Viveka Murder Case: వివేకాను అవినాష్ రెడ్డే హత్య చేయించారా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ద్వారా హత్య చేయించారన్న అనుమానం ఉందని సీబీఐ పేర్కొంది. ఆ
ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాం
కడప ఎంపీ టికెట్ను వివేకా ఆశించినందుకే కక్ష
అభియోగపత్రాల్లో సీబీఐ వెల్లడి
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ద్వారా హత్య చేయించారన్న అనుమానం ఉందని సీబీఐ పేర్కొంది. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. కడప లోక్సభ నియోజకవర్గం టికెట్టు అవినాష్రెడ్డికి కాకుండా తనకు లేదా వైఎస్ షర్మిల, విజయమ్మల్లో ఎవరికైనా ఒకరికి రావాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారని, ఈ నేపథ్యంలోనే అవినాష్రెడ్డి ఆయన్ను హత్య చేయించి ఉంటారనే అనుమానం ఉందని వివరించింది. తమ దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది. హత్య వెనుక ఉన్న భారీ కుట్రను వెలికితీసే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించింది. ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డి, షేక్ దస్తగిరిల ప్రమేయంపై పులివెందుల కోర్టులో సీబీఐ గతంలో దాఖలు చేసిన అభియోగపత్రాలు సోమవారం వెలుగు చూశాయి. ఇప్పటివరకూ దర్యాప్తులో గుర్తించిన అంశాలను సీబీఐ అందులో ప్రస్తావించింది. ప్రధానాంశాలివీ.
వివేకాను చంపినట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లు
వివేకానందరెడ్డి హత్య నేరాన్ని నీపై వేసుకుని, అతణ్ని నువ్వే చంపినట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లు ఇస్తా.. అంటూ కె.గంగాధరరెడ్డి అనే వ్యక్తికి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఆఫర్ చేశారు. నిందితుల్లో ఒకరైన దస్తగిరిని సీబీఐ అధికారులు విచారణ కోసం దిల్లీకి పిలిపించారని శివశంకర్రెడ్డికి తెలిసింది. సీబీఐకి తమ పేర్లు చెప్పకుండా ఉంటే జీవితం సెటిల్ చేస్తానంటూ ఆయన దస్తగిరికి హామీ ఇచ్చారు. దిల్లీలో దస్తగిరి కదలికలు కనిపెట్టేందుకు, సీబీఐ ఆయన్ను ఏం ప్రశ్నిస్తుందో తెలుసుకునేందుకు భరత్యాదవ్ను అక్కడికి పంపించారు. 2019 ఫిబ్రవరి 10నే వివేకా హత్యకు ప్రణాళిక సిద్ధమైంది. ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో జరిగిన ఈ కుట్రలో దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి భాగస్వాములయ్యారు.
ఎమ్మెల్సీగా పోటీకి అడ్డుతగిలారని..
వివేకా హత్యకు కుట్ర, హత్య తర్వాత ఆధారాల ధ్వంసంలో పాల్గొన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కడప జిల్లా వైకాపాలో కీలక నేత. 2017లో కడప స్థానిక సంస్థల నుంచి వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. దీంతో ఆ స్థానంలో పోటీ చేసిన వివేకాకు మద్దతివ్వలేదు. ఓటమి పాలైన వివేకా.. శివశంకర్రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు వివేకా వైకాపాలో చేరితే రాయలసీమలో తమ ప్రాబల్యానికి ఇబ్బందవుతుందని భావించిన శివశంకర్రెడ్డి.. ఆయన చేరికపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
హత్య ప్రణాళికలో అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డి
‘వివేకాను హత్య చేస్తే శివశంకర్రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో నీకు రూ.5 కోట్లు ఇస్తాం. ఈ హత్య చేస్తే నీ జీవితం సెటిల్ అయిపోతుంది. వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, శివశంకర్రెడ్డి వంటి పెద్దలు ఈ హత్య ప్రణాళికలో ఉన్నారు’ అని ఎర్ర గంగిరెడ్డి దస్తగిరితో చెప్పారు. వివేకా మృతి వార్త వెలుగుచూసిన తర్వాత 2019 మార్చి 15న ఉదయం 6.25 గంటలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఇతర సన్నిహితులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. వైఎస్ భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డికి కూడా అక్కడికి చేరారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో ఉన్నా.. ఆయన గుండెపోటుతో మరణించారంటూ అవినాష్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలు ప్రచారం మొదలుపెట్టారు. ఇదే మాటను శివశంకర్రెడ్డి.. సాక్షి టీవీకి తొలిసారి చెప్పారు. వివేకా కుమార్తె, అల్లుడు రాకుండానే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు.
వ్యక్తిగత కక్షలతో హత్య కుట్రలోకి..
గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డిలు వ్యక్తిగత కక్షలతోనే వివేకా హత్య కుట్రలో భాగస్వాములయ్యారు. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా ఓటమికి పని చేశావంటూ వివేకా తరచూ ఎర్రగంగిరెడ్డిని తిట్టేవారు. బెంగళూరులో ఓ భూవివాదాన్ని సెటిల్ చేసినందుకు వివేకా రూ.8 కోట్లు ఆశించారు. దానిలో తనకూ వాటా ఇవ్వాలని గంగిరెడ్డి అడిగినా వివేకా ఇవ్వలేదు. వివేకా ఆస్తులకు బినామీగా, ఆయన వెన్నంటే ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో తమ కుటుంబానికి అవకాశమివ్వలేదని గజ్జల ఉమాశంకర్రెడ్డి, డ్రైవర్గా తీసేశారని షేక్ దస్తగిరి ఆయనపై కక్ష పెంచుకున్నారు.
హత్య సమయంలో.. సునీల్ యాదవ్ అక్కడే
* 2019 మార్చి 15వ తేదీ తెల్లవారుజామున 2.42 గంటల సమయంలో సునీల్ యాదవ్ వివేకా ఇంట్లో ఉన్నట్లు ఆయన జీమెయిల్ ఖాతాకు సంబంధించిన గూగుల్ కోఆర్డినేట్స్ ద్వారా వెల్లడైంది. హత్య జరిగిన రోజు, మర్నాడు సునీల్, దస్తగిరిల మధ్య పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు నడిచాయి.
* హత్య జరిగిన రోజు రాత్రి వివేకా ఇంటి ముందు నుంచి ఉమాశంకర్రెడ్డి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
* ఎర్ర గంగిరెడ్డి దిశా నిర్దేశంతో సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దస్తగిరిలు హత్య ప్రణాళిక అమలు చేశారు. హత్యకు కుట్ర రూపొందించిన నాలుగైదు రోజుల తర్వాత సునీల్ దస్తగిరికి రూ.కోటి ఇచ్చారు. ఉమాశంకర్రెడ్డి, సునీల్ కూడా రూ.కోటి చొప్పున పొందారు. దస్తగిరి తనకు వచ్చిన డబ్బుల్లో రూ.46.70 లక్షలు మున్నా అనే స్నేహితుడి వద్ద ఉంచగా సీబీఐ స్వాధీనం చేసుకుంది.
* పోలీసులకు మా పేర్లు చెబితే నిన్ను చంపేస్తాం.. అంటూ వాచ్మెన్ రంగన్నను గంగిరెడ్డి బెదిరించారు.
* దేవిరెడ్డి శివశంకర్రెడ్డి.. వివేకా హత్య విషయాన్ని దాచిపెడుతూ ఆయన పీఏ కృష్ణారెడ్డితో పులివెందుల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయించారు. మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయని, పడకగదిలోనూ, స్నానాలగదిలోనూ రక్తపు మడుగు ఉందనే విషయాలేవి ఫిర్యాదులో ప్రస్తావించకుండా దాచిపెట్టారు. దాని ఆధారంగానే కేసు నమోదు చేయాలని సీఐ శంకరయ్యపై ఒత్తిడి తీసుకొచ్చారు. ‘సార్... శివశంకర్రెడ్డి, గంగిరెడ్డిలు ఘటనాస్థలాన్ని ఎందుకు శుభ్రపరుస్తున్నారు? వారు ఆధారాలు ధ్వంసం చేస్తే కేసు సంక్లిష్టమవుతుంది’ అని సీఐ శంకరయ్య.. అక్కడున్న వైఎస్ ప్రతాప్రెడ్డితో అన్నారు.
* ఘటనాస్థలంలోని రక్తపు మరకలన్నింటినీ శివశంకర్రెడ్డి, గంగిరెడ్డి శుభ్రం చేయించారు. వివేకా తలకు గాయాలైనచోట్ల బ్యాండేజీ చుట్టించి కట్లు వేయించారు. శివశంకర్రెడ్డి ఆదేశాలతోనే పనిమనిషి లక్ష్మి ఈ రక్తపుమరకల్ని శుభ్రం చేశారు.
* నార్కో అనాలసిస్ పరీక్షకు శివశంకర్రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డిలు ఒప్పుకోలేదు.
* వివేకా తల, నుదురు, అరచేతిపై ఏడు గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. హెమరేజిక్ షాక్తో పాటు, మెదడుకు తీవ్ర గాయాలవటం వల్ల చనిపోయారని నివేదికలో వెల్లడైంది. గొడ్డలితో వివేకాను హత్య చేసి ఉండొచ్చని శవపరీక్ష చేసిన వైద్యులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా