Rice: చౌకగా మోసం
మార్కెట్లో కిలో సాధారణ బియ్యం రూ.30. ఒక మోస్తరు నాణ్యమైన బియ్యం కావాలంటే కిలో రూ.40 పైమాటే. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు సగటున కిలో రూ.25కే ఎగుమతి చేస్తున్నారు. క్వింటానో, టన్నో కాదు.. గతేడాది ఏపీ నుంచి ఏకంగా 4.32 కోట్ల క్వింటాళ్ల బియ్యాన్ని ఇలా ఎగుమతి చేశారు. రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరకంటే కనీసం రూ.500-రూ.600 మధ్య
సన్నబియ్యం కిలో రూ.25.. విదేశాలకు మాత్రమే!!
మన మార్కెట్లో కిలో రూ.40 పైమాటే
రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా దోపిడీ
రేషన్ బియ్యం రీసైక్లింగ్ కూడా కారణమే!
ఈనాడు - అమరావతి
మార్కెట్లో కిలో సాధారణ బియ్యం రూ.30. ఒక మోస్తరు నాణ్యమైన బియ్యం కావాలంటే కిలో రూ.40 పైమాటే. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు సగటున కిలో రూ.25కే ఎగుమతి చేస్తున్నారు. క్వింటానో, టన్నో కాదు.. గతేడాది ఏపీ నుంచి ఏకంగా 4.32 కోట్ల క్వింటాళ్ల బియ్యాన్ని ఇలా ఎగుమతి చేశారు. రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరకంటే కనీసం రూ.500-రూ.600 మధ్య తగ్గించి కొంటేనే ఇంత తక్కువ ధరకు విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. అన్నదాతలందరికీ మద్దతు ధర దక్కుతోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న నేపథ్యంలో మరి ఇదెలా సాధ్యమవుతోంది? రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని... రీసైకిల్ చేసి ఎగుమతి చేస్తున్నారా? అనే చర్చ అధికారవర్గాల్లోనే నడుస్తోంది. ఒకవేళ రైతుల నుంచే తక్కువ ధరకు కొంటే మద్దతు విషయంలో అన్యాయం జరుగుతున్నట్లే లెక్క. అలాకాకుండా రేషన్ బియ్యాన్నే రీసైకిల్ చేస్తుంటే... ప్రజాపంపిణీపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును దళారులు దోచుకుంటున్నట్లే అవుతుంది. ఈ రెండింటిలో ఏదైనా అనైతికమే అని పేర్కొంటున్నారు. గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే బియ్యం ధర కిలో రూ.28 వరకు ఉంది. మన రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే బియ్యం ధర అంతకంటే తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2021 నవంబరు వరకు జరిగిన బియ్యం ఎగుమతుల్లో 40% ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్లాయి. కొందరు దళారులు రేషన్ బియ్యాన్ని కిలో రూ.10 చొప్పున కార్డుదారుల నుంచి కొని.. రీసైకిల్ చేసి రూ.25 చొప్పున ఎగుమతి చేయడమూ కారణమేనని అంటున్నారు. క్వింటా ధాన్యానికి ప్రభుత్వం రూ.1,960 మద్దతు ధర నిర్ణయించింది. ఈ ధరకు ధాన్యం కొని మర పట్టిస్తే సుమారు 67 కిలోల బియ్యం వస్తుంది. అంటే కిలో ధర రూ.29.25 అవుతుంది. దీనికి మిల్లింగ్, హమాలీ, రవాణా తదితర ఖర్చులు కలిపితే రూ.33 వరకు అవుతుంది.
క్వింటా రూ.1,400 చొప్పున కొంటేనే సాధ్యం
క్వింటా ధాన్యాన్ని రూ.1,400 చొప్పున కొని మిల్లింగ్ చేస్తే వచ్చే 67 కిలోలకు... కిలో బియ్యం రూ.21 చొప్పున అవుతుంది. దీనికి ఎగుమతి, దిగుమతి ఖర్చులు, కమిషన్, రవాణా, ఇతర వ్యయాలు కలిపితే కిలో రూ.25 చొప్పున ఎగుమతి చేసేందుకు వీలుంటుంది. అంటే మద్దతు ధర కంటే క్వింటాకు రూ.560 తక్కువకే రైతులు ధాన్యాన్ని విక్రయిస్తున్నారని తెలుస్తోందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.
రేషన్ బియ్యం రీసైకిల్...
ప్రజా పంపిణీ వ్యవస ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలో రూపాయి చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన (సార్టెక్స్- నూకలు తక్కువగా ఉండే) బియ్యాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇవికాకుండా కొవిడ్ నేపథ్యంలో ఉచిత రేషన్ ఇస్తున్నారు. ఈ బియ్యాన్ని కొందరు దళారులు కార్డుదారుల వద్ద కిలో రూ.10 చొప్పున కొని, మిల్లులకు తరలించి రీసైకిల్ చేస్తున్నారు. వీటిని విదేశాలకు కిలో రూ.25 చొప్పున ఎగుమతి చేస్తున్నారు. అంటే కిలోకు రూ.15 లాభం. అందుకే రేషన్ బియ్యం రీసైకిల్ దందా అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతోంది. నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇలా పెద్దఎత్తున ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని గతంలో పట్టుకున్నారు. రాష్ట్రంలో నిత్యం ఎక్కడోచోట చౌకబియ్యం అక్రమ రవాణాలో పట్టుబడుతూనే ఉన్నాయి.
ఏపీ నుంచే 40% ఎగుమతులు
బాస్మతి కాని రకాల బియ్యం ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి సానంలో ఉంది. 2021-22 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబరు వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రూ.28,932 కోట్ల విలువైన 10.88 కోట్ల క్వింటాళ్ల నాన్బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.10,926 కోట్ల విలువైన 4.32 కోట్ల క్వింటాళ్ల బియ్యం ఎగుమతి అయింది. అంటే 40% ఆంధ్రప్రదేశ్ నుంచే విదేశాలకు వెళ్లాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాల కిరణం!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్