CHANDRA BABU:అవినాష్పై ఆరా తీస్తుంటే సీబీఐనే నిందిస్తారా?
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి పాత్రపై సీబీఐ ఛార్జిషీట్లో పెడితే సమాధానం చెప్పలేని సకల శాఖల మంత్రి సజ్జల.. సీబీఐ కక్ష కట్టిందని చెప్పడం విడ్డూరంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సొంత
సమాధానం చెప్పలేక దర్యాప్తు సంస్థ కక్ష కట్టిందంటారా?
కోర్టులే లేకపోతే రఘురామకృష్ణరాజునూ చంపేసేవారేమో?
సర్పంచుల అవగాహన సదస్సులో చంద్రబాబు వ్యాఖ్యలు
ఈనాడు డిజిటల్, అమరావతి: వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి పాత్రపై సీబీఐ ఛార్జిషీట్లో పెడితే సమాధానం చెప్పలేని సకల శాఖల మంత్రి సజ్జల.. సీబీఐ కక్ష కట్టిందని చెప్పడం విడ్డూరంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సొంత బాబాయి హత్యకు గురైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఏమన్నారో, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలని సూచించారు. కోర్టులే లేకపోతే ఎంపీ రఘరామకృష్ణరాజును కూడా చంపేసేవారేమోనని వ్యాఖ్యానించారు.
తెదేపా మద్దతుతో గెలిచిన సర్పంచులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో చంద్రబాబు అధ్యక్షోపన్యాసం చేశారు. ‘నాడు సీఎస్గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎం జగన్.. అన్నా అని పిలిచి చివరికేం చేశారో అందరూ చూశారు. డీజీపీని కూడా సవాంగన్నా అని పిలిచి ఇప్పుడు పీకేశారు. అలా అని డీజీపీగా సవాంగ్ చేసిన పనుల్ని సమర్థించం. ఆయన పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నా కాన్వాయ్పై రాళ్లు వేస్తే భావప్రకటన అని చెప్పారు. పోలీసులపై మంత్రి అప్పలరాజు దాడి చేసినా కనీస చర్యలు తీసుకోలేదు’ అని మండిపడ్డారు.
వైకాపా హయాంలో ఒక్క రోడ్డయినా వేశారా?
‘గ్రామాల్లో తెదేపా హయాంలో వేసిన రోడ్లే తప్ప వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డయినా వేశారా? పైగా 14, 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల్లో రూ.7,658 కోట్లు దారి మళ్లించారు. దీంతోపాటు జల్జీవన్ పథకంలో రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో రూ.3 వేల కోట్లు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లాలో సత్యసాయి నీటి పథకంలో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేక పథకం మూత పడింది. ఇళ్ల స్థలాల చదును పేరుతో వైకాపా నేతలు వేల కోట్లు కొట్టేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నరేగాలో రూ.261 కోట్లు అవినీతి జరిగిందని కేంద్రం తేల్చింది. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని పేర్కొన్నారు.
సర్పంచికి ఉండే అవగాహన కూడా సీఎంకి లేదా?
‘ప్రధానికి, ముఖ్యమంత్రికి రాజ్యాంగం ఎలా అధికారమిచ్చిందో సర్పంచులకూ అలాగే ఇచ్చింది. రాష్ట్ర సచివాలయానికి అధిపతి ముఖ్యమంత్రి అయినప్పుడు గ్రామ సచివాలయానికి అధిపతి సర్పంచి కాదా? వాలంటీర్లను పెట్టి సర్పంచుల అధికారాన్ని తొలగిస్తారా? సర్పంచులకు ఉండే కామన్సెన్స్ కూడా ముఖ్యమంత్రికి లేదా?’ అని ధ్వజమెత్తారు. ‘సీఎం జగన్ అబద్ధాన్ని కూడా అతికేలా చెప్పి, చాలా విషయాల్లో ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. అబద్ధాన్నే జగన్ అతికేలా చెబుతున్నప్పుడు మనం నిజాన్ని ప్రజలు నమ్మేలా ఎందుకు చెప్పలేకపోతున్నాం? గ్రామస్థాయి నుంచి ప్రజలకు నిజాలు వివరించాలి. అది సర్పంచుల స్థాయి నుంచే మొదలవ్వాలి. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా రౌడీయిజాన్ని ఎదిరించి, తెదేపా బలపరిచిన సర్పంచి అభ్యర్థులు గెలిచారు. మనం గెలిచిన స్థానాలను కూడా ఫలితాలు తారుమారు చేసి వైకాపా ఖాతాలో వేసుకున్నారు. తప్పుడు కేసులు పెట్టి పోటీలో ఉన్న వారిని వేధించినా రాజీలేని పోరాటం చేసి గెలిచిన అందరికీ అభినందనలు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం వచ్చిన హక్కుల్లో పంచాయతీలకు 19 హక్కుల్ని తెదేపా హయాంలోనే కల్పించాం. పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్ సర్వనాశనం చేశారు. సర్పంచుల హక్కుల్ని కాలరాస్తున్న వైకాపా ప్రభుత్వంపై పోరాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.
చేనేతలకు జగన్ నూలు పోగంత సాయం కూడా చేయలేదు
కార్మికుల ఆత్మహత్యలపై అధ్యయనానికి కమిటీ
తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖ్యమంత్రి జగన్రెడ్డి అధికారంలోకి వచ్చాక చేనేత వర్గానికి కనీస ప్రోత్సాహం లేకపోవడంతో కార్మికులు ఆత్మహత్మకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వంలో వారికి కనీసం నూలు పోగంత సాయం కూడా అందడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రచారార్భాటానికి చేసేంత ఖర్చు కూడా చేనేతల అభ్యున్నతికి వెచ్చించడం లేదని దుయ్యబట్టారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చేనేత సామాజికవర్గం నేతలతో చంద్రబాబు గురువారం సమావేశం నిర్వహించారు. చేనేతల సమస్యలు, వాటిపై చేపట్టాల్సిన పోరాటాలపై చర్చించారు. అప్పుల బాధతో పెడనలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు పద్మనాభం కుటుంబానికి లక్షన్నర, ధర్మవరంలో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయం ప్రకటించారు. కార్యక్రమంలో తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల కిష్టప్ప తదితర నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం