AP TELANGANA: 2 అంశాలపై న్యాయ సలహాకు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న వివిధ వివాదాస్పద అంశాల్లో రెండు అంశాలపై న్యాయసలహా తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉప సంఘం
కేంద్ర హోంశాఖ ఉప కమిటీ నిర్ణయం
రాష్ట్ర ఫైనాన్సు కార్పొరేషన్ విభజన అంశం లీగల్ కౌన్సిల్కు
ఏపీ, తెలంగాణ ఎవరి వాదనలు వారివే
ఈనాడు, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న వివిధ వివాదాస్పద అంశాల్లో రెండు అంశాలపై న్యాయసలహా తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉప సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ఫైనాన్సు కార్పొరేషన్ విభజన అంశాన్ని కేంద్ర లీగల్ కౌన్సిల్కు నివేదించనున్నారు. రెండోది.. విద్యుత్తు బకాయిల అంశంలో ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వెళ్లినందున ఇందులో కేంద్ర హోంశాఖ జోక్యానికి ఎంతవరకు ఆస్కారం ఉందో చర్చించి తేల్చాలని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్కుమార్ అధ్యక్షతన ఉప సంఘం తొలి సమావేశం గురువారం దృశ్య మాధ్యమంలో జరిగింది. పై రెండు అంశాలూ కాక.. మిగిలిన అన్ని విషయాల్లో సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి మరో నెల రోజుల్లోగా ఇంకో సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు కమిటీ హామీ ఇచ్చింది. ఉపసంఘం గురువారం అయిదు అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులతో చర్చించింది. అయితే, విభజన నాటి నుంచి పెండింగులో ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలూ ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదనలు, అభిప్రాయాలనే మళ్లీ కమిటీ ముందు కూడా వినిపించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల పౌరసరఫరాల కార్పొరేషన్ల మధ్య నిధుల పంపిణీ, తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలు, రాష్ట్ర ఫైనాన్సు కార్పొరేషన్ విభజన, పన్నుల అంశాల్లో సందిగ్ధత తొలగింపు, బ్యాంకుల్లో నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన తదితర అంశాలు చర్చకు వచ్చాయి. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈ విషయాల వల్ల రాష్ట్రానికి తలెత్తుతున్న ఇబ్బందులేంటో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉపసంఘానికి వివరించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర సీఎస్ సోమేశ్కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.
కేసులు వాపస్ తీసుకుంటేనే పరిష్కారం: తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: కేసులను ఉపసంహరించుకుంటే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు సానుకూలత ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్రం ఏపీకి స్పష్టం చేసింది. ‘పన్ను వివాదాల అంశం పరిష్కారానికి ఏపీ కోరుతున్నట్లు పునర్విభజన చట్టం సవరణ ఇప్పుడు అవసరం లేదు. చట్టం అమల్లోకి వచ్చిన ఏడున్నరేళ్ల తర్వాత సవరణ ఆమోదయోగ్యం కాదు. పైగా కొత్త వివాదాలకూ దారి తీస్తుంది. ఏపీ నష్టపోయిన మొత్తాన్ని కేంద్రం ఇస్తే సరిపోతుంది’ అని తెలంగాణ స్పష్టం చేయగా... ఈ అంశం రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాదంటూ హోంశాఖ దీన్ని ఎజెండా నుంచి తొలగించింది. ఈ వివరాలను తెలంగాణ ఒకప్రకటనలో తెలియజేసింది.
విద్యుత్ బకాయిలు: ఏపీజెన్కో నుంచి మాకు రూ.12,532 కోట్లు రావాలి. కానీ ఏపీ తమకే రూ.3,442 కోట్లే రావాల్సి ఉందని అంటోంది. పైగా తెలంగాణ జెన్కోపై విద్యుత్ బకాయిల కోసం హైకోర్టులో కేసు వేసింది. కేసును ఉపసహరించుకుంటే చర్చల ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు మేం సిద్ధం. బకాయిలను వేర్వేరుగా కాకుండా ఒకే అంశంగా గుర్తించి పరిష్కరించుకోవాల్సి ఉంది.
ఏపీఎస్ఎఫ్సీ: దీనిపై ఏపీ ప్రభుత్వం డీమెర్జర్ ప్రతిపాదనలను ఏకపక్షంగా కేంద్రానికి పంపింది. తెలంగాణ ప్రతినిధులు బోర్డులో లేకుండానే తీర్మానం చేసి పంపింది. దాన్ని అమలు చేయకూడదని కేంద్రానికి వివరించాం. ఏపీ ప్రభుత్వం ఎస్ఎఫ్సీకి చెందిన 235.34 ఎకరాలపై కోర్టు స్టే తెచ్చింది. ఎస్ఎఫ్సీ ప్రధాన కార్యాలయం కాని నానక్రాంగూడలోని భవనంలో వాటా అడగడం సరికాదు. ఆంధ్రప్రదేశ్ కోర్టు కేసులను ఉపసంహరించుకుంటే తప్ప ఎస్ఎఫ్సీ విభజన అంశం పరిష్కారం కాదు.
ఏపీ ఇవ్వాల్సిన మొత్తంపై: ఏపీ నుంచి మాకు రావాల్సిన కేంద్ర పథకాల బకాయిలు రూ.495.21 కోట్లు ఏడేళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. ఉమ్మడిగా ఉన్న హైకోర్టు, రాజ్భవన్ వంటి వాటికి మేం ఖర్చుచేసిన రూ.315.76 కోట్లను వెంటనే ఇవ్వాలి.
ఏపీ పౌరసరఫరాల సంస్థ వ్యవహారాలు: ఈ సంస్థకు పెట్టుబడి మొత్తం రూ.354.08 కోట్లు ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. అంతకుముందు కేంద్రం నుంచి మా పౌరసరఫరాల సంస్థకు రావాల్సిన సబ్సిడీని బదిలీ చేస్తామని ఏపీ అండర్టేకింగ్ ఇవ్వాలి. ఏపీ ఇవ్వడానికి తాజాగా అంగీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!