Urdu Medium: ప్రమాదంలో ఉర్దూ మాధ్యమం
రాష్ట్రంలో ఉర్దూ మాధ్యమం ప్రమాదంలో పడబోతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా అధికారులు చేస్తున్న మ్యాపింగ్ అమల్లోకి వస్తే ఈ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5
ఇతర మాధ్యమ ఉన్నత పాఠశాలలకు అనుసంధానం
మ్యాపింగ్ చేస్తున్న క్షేత్రస్థాయి అధికారులు
వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు
ఈనాడు, అమరావతి
రాష్ట్రంలో ఉర్దూ మాధ్యమం ప్రమాదంలో పడబోతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా అధికారులు చేస్తున్న మ్యాపింగ్ అమల్లోకి వస్తే ఈ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఇతర మాధ్యమ ఉన్నత పాఠశాలలకు తరలించేందుకు మ్యాపింగ్ చేస్తున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలో అవి లేకపోతే ఇతర మాధ్యమ ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేస్తున్నారు. ఆయా విద్యార్థులు ఇతర మాధ్యమ పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల ఉర్దూ భాషకు ప్రమాదం ఏర్పడనుందని ఆ మాధ్యమ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మ్యాపింగ్ చేపట్టారు. మిగతా జిల్లాల్లో కసరత్తు కొనసాగుతోంది.
కొన్ని జిల్లాల్లో పాఠశాలలే లేవు
రాష్ట్రంలో కొన్ని తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులకు అదనంగా ఉర్దూ సబ్జెక్టును బోధిస్తున్నారు. ఇవి కాకుండా పూర్తిగా ఉర్దూ మాధ్యమం బోధించేవి ఉన్నాయి. మూడు కిలోమీటర్ల పరిధిలో చాలా చోట్ల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు లేవు. ఇతర మాధ్యమ బడులకు అనుసంధానం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో 92 ఉన్నత పాఠశాలలు ఉండగా.. మిగతా జిల్లాల్లో 17మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా ప్రాథమికోన్నత పాఠశాలలు 330 ఉండగా.. వీటిల్లో 220 చోట్ల అధ్యాపకులు, గదుల కొరత తీవ్రంగా ఉంది. ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత స్థాయికి ఉన్నతీకరించినా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టలేదు. ఎస్జీటీలే బోధన సాగిస్తున్నారు.
* తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3,4,5 తరగతుల విద్యార్థులకు ఒకటి, రెండు, మూడు తరగతుల స్థాయి కలిగిన ఉర్దూను బోధిస్తారు. వీరందరూ ఉన్నత పాఠశాలలకు వెళ్లిపోతే వీరికి బోధన ఏట్లా? అని ఉర్దూ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఉర్దూ బోధిస్తున్న వారిలో చాలా మందికి బీఈడీ అర్హత లేదు. 1,2 తరగతులకు ఉర్దూ బోధించడం లేదు. వీరిని ఎక్కడ నియమిస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
* కొన్ని చోట్ల పూర్తిగా ఉర్దూలోనే బోధించే పాఠశాలలు ఉన్నాయి. ఒకటి, రెండు తరగతుల్లో ఉర్దూ చదువుకున్న వారిని ఇతర పాఠశాలలకు తీసుకువెళ్లి ఏ మాధ్యమంలో బోధన చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ ప్రత్యేకంగా ఉర్దూ మాధ్యమాన్ని ప్రారంభిస్తే ఉపాధ్యాయులను ఎక్కడి నుంచి సర్దుబాటు చేస్తారనేది తేలాల్సి ఉంది.
* ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తరలిస్తే 1,2 తరగతులే మిగులుతాయి. ఉర్దూ అంగన్వాడీలు లేనందున వీటికి అనుసంధానం చేసే పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో 1,2 తరగతులకు మాత్రమే ఉర్దూ మాధ్యమం పరిమితమవుతుంది.
* ఉర్దూ మాధ్యమ బడుల తరలింపును ఎవరైనా ప్రశ్నిస్తే కేవలం రికార్డుల్లోనే ఈ మ్యాపింగ్ చేస్తున్నామని అధికారులు సమాధానమిస్తున్నారు.
* ఉర్దూ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులను అక్కడికి పంపిస్తే ఈ మాధ్యమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఏపీ ఉర్దూ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షబీర్ హుస్సేన్, అబ్దుల్ అజీజ్ వెల్లడించారు.
ప్రస్తుత విధానం ప్రకారమే విలీనం
- సురేష్ కుమార్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ
‘‘చాలా జిల్లాల్లో ఉర్దూ ఉన్నత పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐదో తరగతి వరకు ఉర్దూ మాధ్యమంలో చదివిన వారు ఆ తర్వాత ఆరో తరగతిలో తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంలో చేరుతున్నారు. దీని ప్రకారమే పాఠశాలలను మ్యాపింగ్ చేస్తున్నాం’’
ఉర్దూ పాఠశాలలను మినహాయించాలి
-అబ్దుల్ వారిస్, సయ్య ఇక్బాల్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
‘‘రాష్ట్రంలో ఒక్క ఉర్దూ అంగన్వాడీ కేంద్రం లేనప్పుడు మాధ్యమ పాఠశాలలను విలీనం ఎలా చేస్తారు? ఇష్టమొచ్చినట్లు విలీనం చేస్తే ఉర్దూలో చదువు ఎవరు చెబుతారు. విలీన ప్రక్రియను నిలిపి వేసి ఉర్దూ పాఠశాలలను కాపాడాలి’’
ఉర్దూ మాధ్యమంలోనే విలీనం చేయాలి
-షేక్ ఖలీమ్, అధ్యక్షుడు, మైనారిటీ టీచర్స్ అసోసియేషన్
‘‘ఉర్దూ మాధ్యమం చదువుతున్న 3,4,5 తరగతులను ఉర్దూ పాఠశాలల్లోనే విలీనం చేయాలి. ఇతర మాధ్యమ బడులకు పంపిస్తే ఇబ్బందులు వస్తాయి. ఉన్నతీకరించిన 220 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, వసతులు లేవు. వీటన్నింటినీ పరిష్కరించాలి’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!