JUNIOR COLLEGE: అధిక ఫీజులకు రూ.10 లక్షల జరిమానా
ప్రైవేటు జూనియర్ కళాశాలలకు విధించే జరిమానాలను భారీగా పెంచుతూ ఇంటర్ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేసినా, అనుమతుల కోసం తప్పుడు ధ్రువపత్రాలు
మహిళా కళాశాలను కో-ఎడ్యుకేషన్గా మారిస్తే రూ.2 లక్షలు కట్టాల్సిందే
జూనియర్ కళాశాలల జరిమానాలు భారీగా పెంపు
ఈనాడు, అమరావతి: ప్రైవేటు జూనియర్ కళాశాలలకు విధించే జరిమానాలను భారీగా పెంచుతూ ఇంటర్ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేసినా, అనుమతుల కోసం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినా, మొదటిసారి పలు నిబంధనలు ఉల్లంఘించినా రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. ప్రస్తుతం వీటికి ఎలాంటి జరిమానాలు లేవు. బోర్డు నిబంధనలను కళాశాల రెండోసారీ ఉల్లంఘిస్తే అనుమతులను రద్దు చేస్తారు. కళాశాల నిర్వహణకు ఒకచోట అనుమతి తీసుకొని, అనుమతి లేకుండా వేరే చోటకు మారిస్తే ఇప్పటివరకు రూ.50వేల జరిమానాను రూ.2.50 లక్షలకు పెంచింది. మండలం నుంచి మరో మండలానికి, పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలోకి అనుమతి లేకుండా కళాశాలను మారిస్తే ప్రస్తుతం రూ.లక్ష జరిమానా ఉండగా.. దీన్ని రూ.5 లక్షలకు పెంచారు. మహిళా కళాశాలను కో-ఎడ్యుకేషన్గా మారిస్తే ఇప్పటి వరకు రూ.లక్ష జరిమానా విధిస్తుండగా.. దీన్ని రూ.2 లక్షలకు పెంచారు. రిజర్వేషన్ పాటించకపోతే రూ.లక్ష జరిమానా విధిస్తారు. మంజూరుచేసిన సీట్ల కంటే ఎక్కువ మందికి ప్రవేశాలు కల్పిస్తే ప్రతి ఒక్క అభ్యర్థికి రూ.5వేల చొప్పున బోర్డుకు చెల్లించాలి. విద్యార్థుల నుంచి ఫీజులు, డొనేషన్లను నగదు రూపంలో వసూలు చేస్తే ఇప్పటి వరకు రూ.లక్ష జరిమానా ఉండగా.. దీన్ని రూ.5 లక్షలుగా నిర్ణయించారు.
పార్కింగ్ లేకపోతే రూ.లక్ష
కళాశాలకు పార్కింగ్ స్థలం లేకపోతే రూ.లక్ష జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు దీనికి నిబంధనలేమీ లేవు. జరిమానాతో పాటు అదే విద్యాసంవత్సరంలో సదుపాయం కల్పించాలి.
* విద్యార్థుల టీసీ, ఎస్ఎస్సీ ఉత్తీర్ణత పత్రాలు, ఇతర ధ్రువపత్రాలను యాజమాన్యాలు దగ్గర ఉంచుకుంటే రూ.50వేల జరిమానా.
* అనుమతి లేకుండా కొత్తగా అదనపు సెక్షన్లు, మాధ్యమం, కోర్సులను ప్రారంభిస్తే ప్రస్తుతం ఉన్న రూ.లక్ష జరిమానాను రూ.5లక్షలకు పెంచారు. విద్యార్థుల ప్రవేశాల రిజిస్టర్ను సరిగా నిర్వహించకపోతే తనిఖీ చేసిన ప్రతిసారీ రూ.10వేల చొప్పున విధించే అపరాధ రుసుమును రూ.50వేలు చేశారు.
* విద్యాసంస్థను అనుమతి లేకుండా ఇతర సొసైటీ, ట్రస్టుల్లోకి మారిస్తే విధించే రూ.లక్ష జరిమానాను రూ.5 లక్షలకు పెంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!