Viveka Murder Case: వివేకా హత్య ఘటనపై కేసు వద్దన్నారు
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య ఘటనపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదంటూ కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసమూ పంపించొద్దన్నారు
వై.ఎస్.అవినాష్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి నాతో అలా చెప్పారు
అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డిల మార్గదర్శకత్వం, పర్యవేక్షణలోనే ఆధారాల ధ్వంసం
సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య వెల్లడి
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య ఘటనపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదంటూ కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అప్పట్లో తనతో చెప్పారని ఆ సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె.శంకరయ్య సీబీఐకి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూడా పంపించొద్దన్నారని వివరించారు. వై.ఎస్.అవినాష్రెడ్డి, వై.ఎస్.భాస్కర్రెడ్డి, వై.ఎస్.మనోహర్రెడ్డిల మార్గదర్శకత్వం, పర్యవేక్షణలోనే ఘటనా స్థలంలో ఆధారాల ధ్వంసం ప్రక్రియ కొనసాగిందని వెల్లడించారు. వివేకా రక్తపు వాంతులు, గుండెపోటుతో మృతి చెందారంటూ తొలుత వై.ఎస్.అవినాష్రెడ్డి... ఆయన పీఏ రాఘవరెడ్డి ఫోన్ నంబరు నుంచి కాల్ చేసి తనకు చెప్పారని వివరించారు. నేర ఘటనా స్థలంలోని ఆధారాలు ధ్వంసం చేస్తున్న సందర్భంలో వివేకా ఇంటి లోపలికి ఎవరూ ప్రవేశించకుండా వై.ఎస్.భాస్కర్రెడ్డి లోపలి నుంచి తలుపులు వేసేశారని, తలుపు వద్దే ఉంటూ రక్తపు మరకలు శుభ్రం చేసే, గాయాలకు కట్లు, బ్యాండేజీలు వేసే సిబ్బందినే అనుమతించారని పేర్కొన్నారు. ఆ సమయంలో వై.ఎస్.అవినాష్రెడ్డి రెండు, మూడు సార్లు లోపలికి వెళ్లి కాసేపటి తర్వాత మళ్లీ బయటకు వచ్చారని చెప్పారు. వివేకా మృతి ఘటనపై కేసు నమోదు చేయొద్దంటూ వైకాపా నాయకులు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని.. ఆ విషయాన్ని అప్పటి కడప ఎస్పీ రాహుల్దేవ్ శర్మ దృష్టికి తాను తీసుకెళ్లానని, ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేశానని వివరించారు. 2020 జులై 28న సీబీఐ అధికారుల ఎదుట ఆయన ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. మంగళవారం అది వెలుగుచూసింది. అందులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి...
మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టి.. గాయాలు కనపడనీయకుండా చేయాలని చూశారు
వివేకా మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచి.. గాయాలు కనపడనీయకుండా చేయాలని చూశారు. ప్రజల సందర్శనార్థం మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచి.. గాయాలన్నింటినీ పువ్వులతో కవర్ చేసేయాలని చూశారు. కొందరు వ్యక్తులు ఫ్రీజర్ తీసుకొస్తే దాన్ని నేను వెనక్కి పంపించేశాను. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించాలని, ఫ్రీజర్లో పెట్టేందుకు వీల్లేదని ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలతో చెప్పాను. వారు అదే విషయాన్ని అవినాష్రెడ్డి, వై.ఎస్.భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత శివశంకర్రెడ్డి అంబులెన్సు పిలిపించారు. మృతదేహాన్ని చూస్తామంటూ 400-500 మంది వివేకా ఇంటి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. వారందర్నీ నియంత్రించాం. న్యాయవాది ఓబుల్రెడ్డి ఘటన స్థలానికి చేరిన తర్వాత.. అక్కడున్న రక్తపు మరకలు చూశారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్రెడ్డిలతో మాట్లాడారు. ఆ తర్వాతే ఆధారాల ధ్వంసం మొదలైంది.
నోర్మూసుకుని ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు
వివేకా గుండెపోటుతో మరణించారని, ఆయన ఇంటి వద్ద గుమిగూడుతున్న జనాన్ని నియంత్రించేందుకు సిబ్బందిని పంపించాలని అవినాష్రెడ్డి ఫోన్లో చెప్పగానే ముగ్గురు కానిస్టేబుళ్లను వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి వెళ్లాను. అక్కడికి చేరుకునేలోపే దేవిరెడ్డి శివశంకర్రెడ్డి నాకు ఫోన్ చేసి.. ‘రావటానికి ఇంత ఆలస్యమా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరిన తర్వాత కానిస్టేబుళ్లను వివేకా ఇంటి లోపలికి అనుమతించకుండా శివశంకర్రెడ్డి అడ్డుకున్నారు. నన్ను మాత్రమే లోపలికి పంపించారు. బాత్రూమ్లోనూ, బెడ్రూమ్లోనూ రక్తపు మరకలు, వివేకా మృతదేహంపై ఉన్న గాయాలు చూసి... ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు కనిపించట్లేదని నేను శివశంకర్రెడ్డితో అన్నాను. ‘నువ్వు నోర్మూసుకుని ఉండు. తీవ్ర గాయాలున్నాయని ఎవరికైనా చెబితే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అంటూ శివశంకర్రెడ్డి నన్ను బెదిరించారు. వివేకా వద్ద సహాయకుడిగా పనిచేసే ఇనయతుల్లా కూడా మృతిపై అనుమానం వ్యక్తం చేయగా... ‘మీ సార్కి ఎవరితోనూ శతృత్వం లేదు. ఆయన్ను ఎవరూ హత్య చేసే అవకాశమే లేదు’ అంటూ శివశంకర్రెడ్డి ఆయన్ను బెదిరించారు.
వీడియో తీయిస్తుంటే కేకలు వేశారు
వివేకా మృతదేహాన్ని ఎర్ర గంగిరెడ్డి బాత్రూమ్ నుంచి బెడ్రూమ్కు తీసుకొచ్చారు. రక్తపు మరకలతో కూడిన ఆయన దుస్తుల్ని మార్చేందుకు ప్రయత్నించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించాలని, దుస్తులు మార్చటానికి వీల్లేదని వారిని నిలువరించాను. ఘటనా స్థలం మొత్తాన్ని వీడియో తీయాలని మా సిబ్బందికి చెప్పాను. వారు వీడియో తీస్తుండగా... దాన్ని ఆపేయాలని దేవిరెడ్డి శివశంకర్రెడ్డి గట్టిగా కేకలు వేశారు. ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి, ఎం.వి.కృష్ణారెడ్డి, ఉమాశంకర్రెడ్డి, సునీల్యాదవ్, దస్తగిరిల పాత్ర అనుమానాస్పదంగా అనిపించింది. నేర ఘటనా స్థలంలో వై.ఎస్.అవినాష్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వై.ఎస్.భాస్కర్రెడ్డి, వై.ఎస్.మనోహర్రెడ్డిల పాత్ర అనుమానాస్పదంగా అనిపించింది.
* వై.ఎస్.అవినాష్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి.. వీరిద్దరే అందరికంటే ముందు వివేకా ఇంటివద్దకు చేరుకున్నారు. మృతదేహం రక్తపు మడుగులో ఉండటం, తలపై తీవ్రగాయాలు ఉండటం చూసి కూడా ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేశారు.
*వివేకా ఇంటివద్ద బందోబస్తుకు రావాలంటూ... వైకాపా సన్నిహితులైన న్యాయవాది ఓబుల్రెడ్డి, సాక్షి విలేకరి నాపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు.
* వై.ఎస్.వివేకా మృతదేహంపై ఉన్న గాయాలకు ప్రకాశ్రెడ్డి, శ్రీనివాసరెడ్డి బ్యాండేజీలు, కట్లు వేశారు. వారు పులివెందుల్లోని గంగిరెడ్డి, రాజారెడ్డి ఆసుపత్రి సిబ్బంది. గంగిరెడ్డి ఆసుపత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భార్య వై.ఎస్.భారతి తండ్రి అయిన ఈసీ గంగిరెడ్డిది. నేను వివేకా ఇంటివద్దకు వెళ్లేసరికి ఈసీ గంగిరెడ్డి కూడా ఘటనాస్థలాన్ని సందర్శించారు. రాజారెడ్డి ఆసుపత్రి వై.ఎస్.కుటుంబీకులది.
ఉదయ్కుమార్రెడ్డి పాత్ర అనుమానాస్పదం
నాటి పులివెందుల డీఎస్పీ వాసుదేవన్
వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్కుమార్రెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉన్నట్లు తన దర్యాప్తులో తేలిందని గతంలో పులివెందుల డీఎస్పీగా పనిచేసిన రెడ్డివారి వాసుదేవన్ సీబీఐకి తెలిపారు. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిందని.. ఆ రోజు ఉదయం ఉదయ్కుమార్రెడ్డి వివేకా ఇంటి సమీపంలో ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామని వెల్లడించారు. ఉదయ్కుమార్రెడ్డి తండ్రి.. వివేకా మృతదేహానికి కట్లు, బ్యాండేజీలు వేశారని వివరించారు. 2019 జూన్ 17 నుంచి ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఆయన.. గతేడాది సెప్టెంబరు 1న సీబీఐ అధికారులకు ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య జరిగిన రోజు వేకువజామున 4.38 నుంచి 4.48 మధ్య ఓ వ్యక్తి పులివెందులలోని బ్రిడ్జిస్టోన్ టైర్ల దుకాణం సమీపంలో ద్విచక్రవాహనంపై పదే పదే తిరుగుతూ ఉన్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయని ఆయన సీబీఐకి చెప్పారు. ఈ అంశాలతో పాటు శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలంలోని కొన్ని అంశాలూ వాసుదేవన్ వాంగ్మూలంలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?