Azadi Ka Amrit Mahotsav: భాష మార్చి... ‘అమృత’ దాడి!
ఎవరికీ పట్టని రైతు సమస్యల కోసం పుట్టిన ఓ గ్రామీణ పత్రిక... ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది. ఎంత కట్టడి చేసినా తెలివిగా తప్పించుకొని కంట్లో నలుసైంది.
ఎవరికీ పట్టని రైతు సమస్యల కోసం పుట్టిన ఓ గ్రామీణ పత్రిక... ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది. ఎంత కట్టడి చేసినా తెలివిగా తప్పించుకొని కంట్లో నలుసైంది. ఎంతగా అంటే ఈ పత్రికను లక్ష్యంగా చేసుకొని ఏకంగా ఓ చట్టమే తెచ్చింది బ్రిటిష్ సర్కారు. గాంధీజీతో పాటు రష్యా విప్లవవీరుడు లెనిన్ నుంచి కూడా ప్రశంసలందుకొని... బ్రిటిష్ పాలనపై మడమ తిప్పని పోరాటం చేసి... జాతీయోద్యమంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకున్న అరుదైన భారతీయ పుత్రిక అమృత బజార్ పత్రిక!
బెంగాల్ రాష్ట్రంలోని జెసోర్ జిల్లా మగూరా (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది) అనే చిన్న పల్లెటూరిలో మొదలైందీ అమృత బజార్ కథ! బెంగాలీ సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన శిశిర్, మోతీలాల్ ఘోష్ అనే అన్నదమ్ములు 1868 ఫిబ్రవరిలో దీన్ని ఆరంభించారు. రూ.32కు కొన్న చెక్క ముద్రణయంత్రంపై దీన్ని వారపత్రికగా తీసుకొచ్చేవారు. గ్రామీణ ప్రాంత, రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేవారు. బిహార్ చంపారన్లో గాంధీజీ పర్యటనతో నీలిమందు రైతుల సమస్య లోకానికి తెలిసిందనుకుంటాం. కానీ అంతకుముందే నీలిమందు రైతుల సమస్యలను, బ్రిటిష్ సర్కారు ఆర్థిక విధానాలను ప్రశ్నించి ప్రచురించింది అమృతబజార్ పత్రిక.
క్రమంగా తన రూపురేఖల్ని మారుస్తూ, ఆంగ్లేయులపై పోరాటాన్ని విస్తృతం చేయటానికి పత్రిక కార్యాలయాన్ని 1871లో కోల్కతాకు మార్చారు. అమృతబజార్ పత్రిక బెంగాలీ భాషలో రాసే కథనాలు ప్రజాదరణ పొందాయి. ఇవి బ్రిటిష్ సర్కారుకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఎలాగైనా సరే దీన్ని కట్టడి చేయాలనుకున్న ప్రభుత్వం... తమ ఉన్నతాధికారి సర్ ఆష్లే ఎడెన్ను సంపాదకుడు శిశిర్ వద్దకు రాయబారానికి పంపించింది. ప్రచురణకు ముందు వార్తలను తమకు చూపితే... ప్రభుత్వ పరంగా ‘అన్నివిధాలుగా సాయం’ చేస్తామని ప్రతిపాదించాడు ఆష్లే! కానీ శిశిర్ తలొగ్గలేదు. ‘దేశంలో ఒక్కడైనా నిజాయతీగల జర్నలిస్టును ఉండనివ్వండి’ అంటూ తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక అమృతబజార్ను లక్ష్యంగా చేసుకొని... 1878లో అప్పటి వైస్రాయ్ లార్డ్ లైటన్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చారు. ప్రాంతీయ భాషా పత్రికలు ప్రభుత్వాన్ని విమర్శించటాన్ని నిషేధించారు. ఆంగ్ల పత్రికలకు మాత్రం మినహాయింపునిచ్చారు. కారణం... ఆ సమయానికి ఆంగ్ల పత్రికలన్నీ దాదాపుగా బ్రిటిష్ అనుకూలంగానే వ్యవహరించేవి.
దీంతో శిశిర్ తెలివిగా... రాత్రికి రాత్రి... అమృత బజార్ పత్రికను ఆంగ్ల పత్రికగా మార్చేశారు. సర్కారుపై దాడిని మాత్రం ఆపలేదు. ఏమీ చేయలేని ఆంగ్లేయ సర్కారు చోద్యం చూస్తూ ఉండిపోయింది. తరువాత 1919లో పత్రిక డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం సమయంలో పంజాబ్లో పత్రికపై నిషేధం విధించారు. అయినా వెరవకుండా అమృత బజార్ తన పోరాటం కొనసాగించింది. 1905 బెంగాల్ విభజన సమయంలోనైతే వైస్రాయ్ లార్డ్ కర్జన్పై కటువుగా విమర్శల వర్షం కురిపించింది. ‘‘ఎలాంటి అనుభవం, శిక్షణ లేని షోకిల్లా రాయుడికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టిన ఫలితమిది’’ అని కర్జన్ బెంగాల్ విభజనపై వ్యాఖ్యానించింది. కోల్కతా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి సుభాష్ చంద్రబోస్పై వేటు వేయడాన్ని తప్పుపట్టింది. అమృతబజార్ పత్రిక కథనాల ఫలితంగానే బోస్కు మళ్లీ సీటిచ్చారు.
వైస్రాయ్ చెత్తబుట్టలోంచి..
శిశిర్ తర్వాత ఆయన కుమారుడు తుషార్ కాంతి ఘోష్ 1931లో బాధ్యతలు చేపట్టి... 60 ఏళ్లు ఎడిటర్గా కొనసాగారు. 1935లో ఆంగ్లేయ న్యాయమూర్తుల వివక్షను ఎత్తిచూపినందుకుగాను తుషార్ను జైలుకు పంపించారు. కశ్మీర్లో దోగ్రా రాజులను తొలగించేందుకు బ్రిటిష్ సర్కారు ప్రణాళికను... వైస్రాయ్ చెత్తబుట్టలోంచి పట్టుకున్న అమృత్బజార్ పత్రిక పరిశోధనాత్మక కథనం రాసింది. దాంతో ఆంగ్లేయులు తమ ప్రణాళికను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అలా... కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి... స్వాతంత్య్ర సాధన దాకా జాతీయోద్యమంలో ప్రతిఘట్టానికీ అద్దం పట్టి... భారతీయుల గొంతుకై... ఆంగ్లేయులకు లొంగకుండా నిల్చిన ఘనత అమృత్ బజార్ పత్రిక సొంతం. జాతీయోద్యమంలో సమరయోధులెంతటి కృషి చేశారో ఈ పత్రిక కూడా అంతే పోరు సల్పింది. అందుకే... భారత్లో అత్యుత్తమ పత్రిక అమృత్బజార్ అంటూ 1920లో రష్యా విప్లవ నేత లెనిన్ కితాబు పంపించారు. గాంధీ సైతం ‘నిజంగా ఇది అమృతం’ అనేవారు. 123 సంవత్సరాలు కొనసాగిన అమృత్ బజార్ పత్రిక 1991లో మూతబడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత