Bheemla nayak: ఏపీలో ‘భీమ్లానాయక్’ థియేటర్లపై పెరిగిన నిఘా
రాష్ట్రంలో భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వ నిబంధనల అమలుపై జిల్లాల్లో అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. గురువారం నుంచే రెవెన్యూ సిబ్బంది ద్వారా థియేటర్లపై నిఘా పెంచారు. థియేటర్ల యజమానులతో
ఈనాడు, యంత్రాంగం: రాష్ట్రంలో భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వ నిబంధనల అమలుపై జిల్లాల్లో అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. గురువారం నుంచే రెవెన్యూ సిబ్బంది ద్వారా థియేటర్లపై నిఘా పెంచారు. థియేటర్ల యజమానులతో సమావేశమై నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతుల్లేవని, అదనపు కుర్చీలు వేసినా సీజ్ చేస్తామని హెచ్చరించారు. బెనిఫిట్ షోలు లేకపోవడంపై పవన్కల్యాణ్ అభిమానులు తిరుపతిలోని గాంధీ విగ్రహంవద్ద ఆందోళన చేపట్టారు. శ్రీకాళహస్తిలో తహసీల్దారుకు వినతిపత్రాన్ని అందజేశారు. కడపజిల్లా ప్రొద్టుటూరులో పాదయాత్ర చేశారు. విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నిరసన తెలిపారు. థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే నష్టాల నుంచి వారిని ఆదుకోవడానికి గుంటూరు జిల్లా మాచర్లలో విరాళాల సేకరణకు హుండీ ఏర్పాటు చేశారు. మరోవైపు... వైకాపా నాయకులు థియేటర్ల నుంచి ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి తమకు అందకుండా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులు పలుచోట్ల విచారం వ్యక్తంచేశారు. యానాంలో సినిమా విడుదలవుతున్న రెండు థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిస్తూ సబ్ డివిజినల్ మేజిస్టేట్ అమన్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
* శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ బీ లఠ్కర్ గురువారం తహసీల్దార్లు, ఆర్డీవోలతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి, అధిక రేట్లకు టికెట్లు విక్రయించకుండా చూడాలని ఆదేశించారు. థియేటర్ల వద్ద నిబంధనల అమలు బాధ్యతను విశాఖలో తహసీల్దార్లకు అప్పగించారు. విజయనగరం జేసీ, ఒంగోలు ఆర్డీవో టికెట్ల ధరలు పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కృష్ణా జిల్లా జేసీ మాధవీలత బెనిఫిట్ షోలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోని పలు థియేటర్లలో తనిఖీలు కొనసాగాయి. నెల్లూరు జేసీ 5 డివిజన్ల పరిధిలోని ఆర్డీవోలు, థియేటర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో థియేటర్ల వద్ద వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిఘా పెట్టారు. విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డులోని లక్ష్మీనరసింహ, ధర్మవరం బాలత్రిపురసుందరి సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు గురువారం రాత్రి ప్రకటించాయి.
ఏపీలో థియేటర్ల యాజమాన్యాల్ని బెదిరిస్తున్నారు
- తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: సినిమా టికెట్ల ధరల జీవో-35ను హైకోర్టు రద్దు చేసినా... దాని ప్రకారమే టికెట్లను విక్రయించాలంటూ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ అధికారులు థియేటర్ల యాజమాన్యాలను బెదిరిస్తున్నారని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఆరోపించింది. ఈ చర్య కోర్టు ఆదేశాల్ని ధిక్కరించడమేనని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవరించడం సరికాదని నిర్మాతల మండలి నాయకులు సూచించారు. గురువారం హైదరాబాద్లోని చలన చిత్ర వాణిజ్య మండలిలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘కొత్త జీవో విడుదల చేసేవరకు జీవో 35 ప్రకారం కాకుండా, ఒకప్పుడు వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ఇచ్చిన జీవో 100 అమలు చేస్తూ, ఆ ప్రకారమే టికెట్ ధరల్ని నిర్ణయించాలి. ఈ విషయంపై ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి’’ అని కోరారు. నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ... ‘‘శుక్రవారం భీమ్లానాయక్ సినిమా విడులదవుతుండడంతో బుధవారం సాయంత్రం నుంచే థియేటర్ యాజమాన్యాలపై ఒత్తిడి పెరిగింది. జీవో 35 ప్రకారం టికెట్లు అమ్మకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇది కోర్టు ఆదేశాల్ని ధిక్కరించడమే. దీనిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. సమావేశంలో నిర్మాతల మండలి నాయకులు ఏలూరు సురేందర్రెడ్డి, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా