Ukraine Crisis: ఉక్రెయిన్కు అండగా ఆయుధాలు, ఇంధనం
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్కు క్రమంగా ఒక్కో దేశం ముందుకు వచ్చి మిలటరీ సాయంతో అండగా నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ఆయుధాగారం నుంచి రూ.2,628 కోట్ల
రూ.2,628 కోట్ల సాయానికి బైడెన్ ఆమోదం
జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ తదితర దేశాల అభయం
వాషింగ్టన్: రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్కు క్రమంగా ఒక్కో దేశం ముందుకు వచ్చి మిలటరీ సాయంతో అండగా నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ఆయుధాగారం నుంచి రూ.2,628 కోట్ల (350 మిలియన్ డాలర్లు) విలువచేసే ఆయుధాలను అదనపు సాయంగా ఉక్రెయిన్కు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. విదేశీ సహాయక చట్టం కింద ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుపుతూ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్కు మార్గదర్శకాలు పంపారు. ఈ ఆయుధ రవాణాను ఓ అపూర్వమైన సందర్భంగా బైడెన్ అభివర్ణించారు. రష్యా యుద్ధ విమానాలను కూల్చడానికి జావెలిన్ యాంటీ-ట్యాంక్ ఆయుధాలు, స్టింగర్ క్షిపణులను ఉక్రెయిన్ అడుగుతోంది. ఆయుధ నిరోధక కవచాలు, విమాన నిరోధక వ్యవస్థల వంటి ఆయుధాలను సాయంగా పంపుతున్నట్లు అమెరికా రక్షణ విభాగ కార్యాలయం ‘పెంటగాన్’ తెలిపింది.
మరిన్ని దేశాల సాయం
ఉక్రెయిన్కు ట్యాంకు విధ్వంసక ఆయుధాలను చేరవేసేందుకు సమ్మతిస్తూ జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి ట్యాంకు విధ్వంసక ఆయుధాలు, ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే ‘స్టింగర్’ క్షిపణులు 500 పంపేందుకు నిర్ణయించింది.
* ఉక్రెయిన్కు 3,800 టన్నుల ఇంధనం, 2,000 మెషీన్ గన్లను పంపాలని బెల్జియం నిర్ణయం తీసుకొంది. నాటో ప్రయత్నాల్లో భాగంగా ఈ దేశం ఇప్పటికే 300 ట్రూపుల సైన్యాలను ఉక్రెయిన్ సరిహద్దులోని రొమేనియాకు పంపింది. డచ్ నుంచి 50 ట్యాంకు విధ్వంసక ఆయుధాలు, 400 రాకెట్లు పంపుతున్నట్లు ఆ దేశ పార్లమెంటుకు ప్రభుత్వం నివేదించింది. నెదర్లాండ్స్ నుంచి 200 గగనతల రక్షణ రాకెట్లు పంపుతున్నారు. రూ.64 కోట్ల విలువైన (8.57 మిలియన్ డాలర్లు) ఆయుధాలు, మందుగుండు పంపుతున్నట్లు చెక్ ప్రభుత్వ రక్షణ మంత్రి ప్రకటించారు. రూ.93 కోట్ల (12.39 మిలియన్ డాలర్లు) విలువ చేసే ఫిరంగి మందుగుండు సామగ్రి, ఇంధనం ఉక్రెయిన్కు పంపనున్నట్లు స్లొవేకియా రక్షణమంత్రి తెలిపారు. తాము కూడా ఆయుధాలు పంపే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఫ్రాన్స్ ఆర్మీ అధికార ప్రతినిధి సైతం వెల్లడించారు. ఉక్రెయిన్ విజ్ఞప్తి మేరకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపుతున్న గ్రీస్ ప్రకటించింది.
ఇంటర్నెట్ సేవలతో ఎలాన్ మస్క్ బాసట..
బిలియనీర్ ఎలాన్ మస్క్ సైతం ఉక్రెయిన్కు బాసటగా నిలిచారు. స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల్ని ప్రారంభించి నిరంతరాయ ఇంటర్నెట్ సేవలను ఉక్రెయిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్ని టెర్మినళ్లను సైతం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!