ఎప్పుడేం జరిగింది?
ఒక మహోన్నత ఆశయంతో, మహా నగర నిర్మాణానికి బీజావాపన చేసింది మొదలు... వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం తేవడం... ఉవ్వెత్తున సాగిన రైతుల ఉద్యమం, సుదీర్ఘ న్యాయ పోరాటం, హైకోర్టు తీర్పు వరకు...
ఒక మహోన్నత ఆశయంతో, మహా నగర నిర్మాణానికి బీజావాపన చేసింది మొదలు... వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం తేవడం... ఉవ్వెత్తున సాగిన రైతుల ఉద్యమం, సుదీర్ఘ న్యాయ పోరాటం, హైకోర్టు తీర్పు వరకు... ఒకటా రెండా ఎన్నెన్నో ఘట్టాలు. రాష్ట్ర విభజన తర్వాత 2014 సెప్టెంబరు 3న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ శాసనసభ తీర్మానం చేసింది మొదలు, గురువారం హైకోర్టు తీర్పు వెలువడేంత వరకు... గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణంలో చోటు చేసుకున్న వివిధ ఘట్టాలు, వైకాపా ప్రభుత్వం రాజధాని పనుల్ని నిలిపివేయడం, రైతుల ఉద్యమంలోని కీలక ఘట్టాలు, పరిణామాల సమాహారం ఇది..!
2014 సెప్టెంబరు 3: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ శాసనసభ తీర్మానం
2014 డిసెంబరు 23: ఏపీ సీఆర్డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ
2014 డిసెంబరు 30: ఏపీ సీఆర్డీఏ చట్టాన్ని నోటిఫై చేసిన ప్రభుత్వం. సీఆర్డీఏ అథారిటీ ఏర్పాటు. 7,317 చ.కి.మీ.ల (తర్వాత దీన్ని 8,603 చ.కి.మీ.లకు పెంచారు) విస్తీర్ణంలో కేపిటిల్ రీజియన్ని, 217.23 చ.కి.మీ.లలో రాజధాని నగరాన్ని నోటిఫై చేసిన ప్రభుత్వం
2015 జనవరి 1: రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం
2015 ఫిబ్రవరి 28: కేవలం రెండు నెలల వ్యవధిలో 32,469 ఎకరాలు ఇచ్చిన 20,510 మంది రైతులు
2015 అక్టోబరు 22: ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన
2016 ఏప్రిల్ 25: వెలగపూడి సచివాలయాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు
2016 జూన్ 6: సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు లాటరీ ద్వారా స్థలాల కేటాయింపు ప్రక్రియ నేలపాడు గ్రామంతో ప్రారంభం.
2016 అక్టోబరు 28: పరిపాలన నగరానికి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ శంకుస్థాపన
2017 ఫిబ్రవరి 3: పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్, శాసనసభ, హైకోర్టు, సచివాలయ భవనాల ఆకృతుల రూపకల్పనకు లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థతో ఒప్పందం
2017 మార్చి 1: ప్రాథమిక డిజైన్లు అందజేసిన ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ
2017 మార్చి 2: వెలగపూడిలో అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు
2017 మే 15: స్టార్టప్ ఏరియాని సింగపూర్ కన్సార్షియం స్విస్ఛాలెంజ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ఒప్పందం. శంకుస్థాపన
2017 డిసెంబరు 27: రాజధాని నగరం అమరావతిని సందర్శించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
2019 ఫిబ్రవరి 3: హైకోర్టు ఐకానిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన. జ్యుడీషియల్ కాంప్లెక్స్ (ప్రస్తుత హైకోర్టు) ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ గొగొయ్.
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిణామాలు
2019 డిసెంబరు 17: మూడు రాజధానుల్ని ప్రతిపాదిస్తూ శాసనసభలో సీఎం ప్రకటన
2019 డిసెంబరు 18: సీఎం ప్రకటనకు నిరసనగా ఉద్యమం ప్రారంభించిన రాజధాని రైతులు
2019 డిసెంబరు 20: పరిపాలనను వికేంద్రీకరించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సు
2020 జనవరి 7: చినకాకాని వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన అన్నదాతలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనాన్ని చుట్టుముట్టిని రైతులు. రైతులతో పోలీసుల ఘర్షణ.
2020 జనవరి 10: పొంగళ్లు సమర్పించి, మొక్కులు చెల్లించుకునేందుకు విజయవాడకు వెళుతున్న రాజధాని మహిళలు, రైతులపై పోలీసుల దాష్టీకం. వెలగపూడి వద్ద రణరంగంగా మారిన సీడ్ యాక్సిస్ రోడ్డు
2020 జనవరి 20: చలో అసెంబ్లీకి రాజధాని రైతుల పిలుపు. అసెంబ్లీ సమీపానికి చేరుకున్న రైతులు.. పోలీసుల లాఠీఛార్జి
2020 జనవరి 20: మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీ
2020 జనవరి 22: బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి ఛైర్మన్కి తెదేపా సభ్యుల నోటీసులు. సభలో గందరగోళం. బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపుతూ అప్పటి మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం
2020 జూన్ 16: ఆ రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం
2020 జూన్ 17: మండలిలో తెదేపా సభ్యుల ఆందోళనతో చర్చకు నోచుకోని బిల్లులు
2020 జులై 18: బిల్లుల్ని గవర్నర్కు పంపిన ప్రభుత్వం
2020 జులై 31: బిల్లులకు ఆమోదముద్ర వేసిన గవర్నర్
2020 ఆగస్టు 8: సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల చట్టాల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రాజధాని రైతు పరిరక్షణ సమితి కేసు
2021 మార్చి 8: మహిళా దినోత్సవం సందర్భంగా దుర్గ గుడికి వెళుతున్న మహిళా రైతుల్ని అడ్డుకున్న పోలీసులు. మహిళలపై దురుసు ప్రవర్తన. కొందరికి గాయాలు
2021 నవంబరు 1: న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన రైతులు
2021 నవంబరు 11: ప్రకాశం జిల్లాలోని చదలవాడ వద్ద పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై పోలీసుల దాడి
2021 నవంబరు 22: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాల్ని ఉపసంహరిస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
2022 మార్చి 3: రాజధాని రైతుల ఉద్యమం 807వ రోజుకి చేరింది. రాజధాని కేసులపై హైకోర్టు తీర్పు వెలువడింది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ