AP Police: పోలవరంలో పోలీసుల హల్చల్
పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి షెఖావత్, ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సందర్శించిన నేపథ్యంలో భద్రత పేరుతో పోలీసులు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, భాజపా
ఎమ్మెల్యేలు, మంత్రులకూ చేదు అనుభవాలు
పోలీసు అధికారులపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం
భాజపా నాయకులకూ ఇబ్బందులు
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-పోలవరం: పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి షెఖావత్, ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సందర్శించిన నేపథ్యంలో భద్రత పేరుతో పోలీసులు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, భాజపా నాయకులకూ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మంత్రి పేర్ని నాని కారునే అక్కడినుంచి తీసెయ్యాలని ఒక పోలీసు అధికారి హుకుం జారీ చేయడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగైదు చోట్ల తనిఖీల పేరుతో హంగామా చేశారు. మీ ముందే తనిఖీ చేశారు కదా అని ప్రశ్నిస్తే వారు వేరు, తాము వేరన్న సమాధానం వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే వాహనంలో వెళ్తుండగా మరో ఎమ్మెల్యే వాహనం వెనక వచ్చింది. దాన్ని పోలీసులు ఆపేశారు. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం వద్ద పశ్చిమగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పేర్ని నాని వాహనం దిగి లోపలికి వెళ్లబోయారు. ఆళ్ల నాని కూడా అదే వాహనంలో వచ్చారు. వారిద్దరి వాహనాలు కొద్దిసేపు అక్కడే ఉన్నాయి. ఒక పోలీసు అధికారి అక్కడకు వచ్చి మంత్రుల వాహనాలను తీసెయ్యాలని హడావుడి చేశారు. ఇది గమనించిన మంత్రి పేర్ని నాని ఆగ్రహించారు. ‘కారు తియ్యాలన్నది ఎవరు? ఇలా రండి... మంచి మర్యాద, ఎవరి డిజిగ్నేషన్ ఏమిటో తెలియదా’ అంటూ ప్రశ్నించారు. అక్కడున్న కార్లను చూపిస్తూ... ‘ఈ కార్లన్నీ ఎవరివి? తమాషాలు చేస్తున్నారా? ఎవరి కారు నువ్వు తియ్యాలన్నది? ఇన్ఛార్జి మంత్రిని గుర్తు పెట్టుకో. ఇవాళతో పండగ అయిపోదు’ అన్నారు. అందుకు పోలీసు అధికారి ‘మా సార్ చెప్పింది చెప్పాను’ అని సమాధానం ఇచ్చారు. ‘ఒకరు చెప్పేదేమిటయ్యా... ఎస్పీ కారు, డీఐజీ కారు ఇక్కడ ఎందుకు ఉన్నాయి?’ అని మంత్రి ప్రశ్నించారు. తర్వాత దగ్గరకు పిలిచి ఇది సరికాదని వివరంగా చెప్పారు.
భాజపా నాయకులకూ కష్టాలు
కేంద్రమంత్రి పర్యటనతో పోలవరం వచ్చిన భాజపా నాయకులు, కార్యకర్తలనూ పోలీసులు ఇబ్బందులు పెట్టారు. చాలామందిని అడ్డుకున్నారని అసంతృప్తి వ్యక్తమైంది. మంత్రి పేర్ని నాని లాంటి అనుభవమే తమకూ ఎదురైందని భాజపా నాయకుడు విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు. కేంద్రమంత్రి వచ్చిన సందర్భంగా భాజపా నాయకులు పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం పోలవరం ప్రధాన డ్యాం పరిసరాల్లో ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నా పోలీసుల నుంచి అనుమతి రాలేదని భాజపా నాయకులు తెలిపారు. ఎక్కడో శాడిల్ డ్యాం వద్ద అనుమతి ఇచ్చారు. ఎస్పీ రాత్రికి రాత్రి సమావేశ స్థలం మార్చివేశారని నాయకులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!