Viveka Murder Case: పెద్ద నాయకుల ప్రమేయం
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య వెనుక కొందరు పెద్ద నాయకుల ప్రమేయం ఉందని ఆయన బావమరిది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డి సీబీఐకి తెలిపారు. ఘటనా స్థలంలోని ఆధారాల్ని ధ్వంసం చేయడానికే ‘గుండెపోటు’
వివేకాకు గుండెపోటు ప్రచారాన్ని తెరపైకి తెచ్చినవారికి హత్య కుట్రలో పాత్ర
అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి సమక్షంలో ఆధారాల ధ్వంసం
సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన వివేకానందరెడ్డి బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డి
వివేకాకు, జగన్కు మధ్య విభేదాలున్నాయని వెల్లడి
ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య వెనుక కొందరు పెద్ద నాయకుల ప్రమేయం ఉందని ఆయన బావమరిది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డి సీబీఐకి తెలిపారు. ఘటనా స్థలంలోని ఆధారాల్ని ధ్వంసం చేయడానికే ‘గుండెపోటు’ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఆ ప్రచారం ప్రారంభించిన వ్యక్తులకు వివేకా హత్య కుట్రలో ప్రమేయం ఉందన్నారు. కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్రెడ్డి, చిన్నాన్న మనోహర్రెడ్డిల సమక్షంలోనే ఘటనా స్థలంలోని ఆధారాల ధ్వంసం జరిగిందని చెప్పారు. దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల ఆదేశాల మేరకు అక్కడున్న రక్తాన్ని పనిమనుషులు తుడిచారని వివరించారు. అవినాష్రెడ్డి, శివశంకర్రెడ్డిలకు స్నేహితుడైన ఉదయ్కుమార్రెడ్డి వివేకా మృతదేహానికి కట్లు కట్టడానికి కాటన్, బ్యాండేజీతో పాటు డాక్టర్లు, కాంపౌండర్లను ఏర్పాటుచేశారని తెలిపారు. 2019 మార్చి 15వ తేదీ వేకువజామున 4 గంటల సమయంలోనే వివేకా మృతి గురించి ఆయనకు తెలుసన్నారు. గతేడాది ఆగస్టు 28న ఆయన సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అది తాజాగా వెలుగుచూసింది. ప్రధానాంశాలివే.
వివేకాకు, జగన్కు మధ్య విభేదాలు
2004 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ కావాలని జగన్మోహన్రెడ్డి పట్టుబట్టారు. కానీ... ఆ టికెట్ వివేకానందరెడ్డికి లభించింది. రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో వివేకా చేరడం జగన్కు ఇష్టం లేదు. 2010లో జగన్ వైకాపా స్థాపించడం వివేకాకు ఇష్టం లేదు. అందుకే ఆ పార్టీలో చేరలేదు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో ఆయన విజయమ్మపై పోటీచేసి ఓడిపోయారు. వివేకా సోదరుడు సుధీకర్రెడ్డితోపాటు వివేకా అనుచరులు ఆయన్ను వైకాపాలో చేరాలని కోరారు. మొదట్లో వద్దన్నా, తర్వాత జగన్ సరేననడంతో 2012 డిసెంబరులో వివేకా వైకాపాలో చేరారు. కానీ వారిద్దరి మధ్య విభేదాలు ఉండేవి.
భారతి బంధువులు కావటంతో అవినాష్, భాస్కర్రెడ్డి జగన్కు దగ్గరయ్యారు
జగన్ సతీమణి వై.ఎస్.భారతి తల్లి.. వై.ఎస్.భాస్కర్రెడ్డికి సోదరి. జగన్ పెళ్లి తర్వాత అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి జగన్కు దగ్గరయ్యారు. అవినాష్రెడ్డికి కడప లోక్సభ టికెట్ లభించటానికి మూడు కారణాలున్నాయి. అవి.. భారతికి బంధువులు కావటం; 2011 ఉప ఎన్నికల్లో విజయమ్మపై వివేకా పోటీ చేయటం; వివేకాకు అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి అనుకూలంగా లేకపోవటం, వివేకా వైకాపాలో చేరటం, 2017లో ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై భాస్కర్రెడ్డి కుటుంబీకులు అసంతృప్తితో ఉండేవారు. వారు శివశంకర్రెడ్డికి మద్దతిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా వివేకా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా తరఫున తిరిగేవారు. వారి అసంతృప్తికి ఇదీ ఓ కారణం. తన ఓటమికి అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డి, శివశంకర్రెడ్డి కారణమయ్యారని వివేకా ఆగ్రహంగా ఉండేవారు. ఎర్ర గంగిరెడ్డి వారితో చేతులు కలిపారంటూ అతడినీ దూరం పెట్టారు.
అవినాష్ నా ఫోన్ తీయలేదు
వివేకానందరెడ్డి చనిపోయారని 2019 మార్చి 15వ తేదీ ఉదయం 6.18 గంటలకు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి నాకు ఫోన్ చేశారు. కడప ఎంపీ అవినాష్రెడ్డికి, వివేకా సోదరుడు రవీంద్రనాథ్రెడ్డికి ఉదయం 6.26కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. టైపిస్టు ఇనయతుల్లాకు ఫోన్ చేసి వివేకా ఇంటికి వెళ్లి చూసి ఏం జరిగిందో చెప్పాలన్నాను. తర్వాత మా కుటుంబమంతా రెండు వాహనాల్లో హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరాము. అవినాష్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లిన తర్వాత నాకు సమాచారం ఇవ్వలేదు. ఆయనకు ఫోన్ చేస్తే తీయలేదు. అప్పుడు ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ చేసి వివేకా మరణం గురించి చెప్పాను. ఆయన చాలా తేలిగ్గా.. ‘అట్లానా’ అనడంతో నాకు ఆశ్చర్యం కలిగింది.
* 2019 మార్చి 14న నా మనవరాలి పుట్టినరోజుకు హైదరాబాద్ రావాలని ఎర్ర గంగిరెడ్డితో పాటు రాజారెడ్డి అనే మరో వ్యక్తిని 12న ఆహ్వానించాను. నా కుటుంబసభ్యులు కాకుండా పులివెందుల నుంచి ఆహ్వానించింది వారిద్దరినే. తనకు అత్యవసరమైన పని ఉందని, తాను రాలేనని రాజారెడ్డితో గంగిరెడ్డి చెప్పారు. ఎంత పని ఉన్నా, మా కుటుంబంలో ఏ శుభకార్యాలకూ ఆయన హాజరుకాకుండా లేరు. అలాంటిది రాలేననడం, అదీ నాతో కాకుండా రాజారెడ్డితో చెప్పటం ఆశ్చర్యం కలిగించింది. వివేకా హత్యకు గురైన రోజు రాత్రి ఆయన పులివెందుల్లోనే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు