YS Viveka Murder: ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే వివేకా హత్యకు కుట్ర
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే కుట్ర జరిగిందని సీబీఐ తెలిపింది. హత్యకు నెల రోజుల ముందు నిందితులైన షేక్ దస్తగిరి, ఉమాశంకర్రెడ్డి,....
కొందరు సాక్షులు ఆయన ప్రభావానికి లోనయ్యారని అనుమానం
బెయిలు రద్దు చేయాలి
జనవరిలోనే హైకోర్టులో సీబీఐ పిటిషన్
ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే కుట్ర జరిగిందని సీబీఐ తెలిపింది. హత్యకు నెల రోజుల ముందు నిందితులైన షేక్ దస్తగిరి, ఉమాశంకర్రెడ్డి, సునీల్ యాదవ్లను ఇంటికి పిలిపించి వివేకా హత్యకు పథకరచన చేశారని వివరించింది. వివేకాను అంతం చేస్తే శివశంకర్రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారంటూ నిందితులు ముగ్గురికీ ఎర్ర గంగిరెడ్డి చెప్పారని పేర్కొంది. హత్యలో కీలకపాత్ర అతనిదేనని వెల్లడించింది. ఈ కేసులో గతంలో అరెస్టయ్యి, ప్రస్తుతం బెయిలుపై ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దుచేయాలని కోరుతూ సీబీఐ అదనపు ఎస్పీ రామ్సింగ్ జనవరిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర, ఇప్పటివరకూ దర్యాప్తులో గుర్తించిన అంశాలు, అతను సాక్షుల్ని ప్రభావితం చేస్తున్న తీరు, బెయిలు రద్దు చేయాల్సిన అవసరం తదితర అంశాల్ని ఆ పిటిషన్లో వివరించారు. ప్రధానాంశాలివీ..
నిందితుల్ని లోపలికి తీసుకెళ్లింది గంగిరెడ్డే
2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకాను హత్య చేసేందుకు సునీల్యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్రెడ్డిలను వివేకా ఇంట్లోకి తీసుకెళ్లింది గంగిరెడ్డే. హత్య తర్వాత మిగతా నిందితులతో కలిసి వివేకా ఇంటివద్ద నుంచి పారిపోతుండగా వాచ్మన్ రంగన్న చూశారు. ఎవరితోనైనా చెబితే చంపేస్తానని అతన్ని బెదిరించారు. పలువురు సాక్షుల్ని బెదిరించారు. రాజకీయ పార్టీలతో గంగిరెడ్డికి సత్సంబంధాలున్నాయి.
* 2019 మార్చి 15వ తేదీ ఉదయాన్నే వివేకా ఇంటి వద్దకు చేరుకుని.. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డితో కలిసి వివేకా గుండెపోటుతో మరణించారనే ప్రచారం ప్రారంభించారు.
* వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ సాక్షి టీవీకి తొలుత సమాచారమిచ్చారు. ఇంటివద్ద ఉన్న జనాల్ని నియంత్రించేందుకు రావాలని సీఐ శంకరయ్యకు చెప్పారు.
* ఘటనాస్థలంలో ఆధారాలు ధ్వంసం చేయటంలోనూ, బాత్రూమ్, బెడ్రూమ్లోని రక్తపు మడుగు, మరకల్ని శుభ్రం చేయించటంలోనూ గంగిరెడ్డి, శివశంకర్రెడ్డిలదే కీలకపాత్ర.
* లోపల నుంచి గడియ పెట్టేసి వివేకా మృతదేహానికి కట్లు కట్టించారు. దీనిపై ప్రశ్నించినందుకు సీఐ శంకరయ్యను నోర్మూసుకుని ఉండాలంటూ హెచ్చరించారు.
* శివశంకర్రెడ్డి, సునీల్యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డి ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో భారీ కుట్ర, ఆధారాల ధ్వంసంపై దర్యాప్తు జరుగుతోంది.
* గంగిరెడ్డి బయటే ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు
ఎర్ర గంగిరెడ్డి... మరో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వారి సన్నిహితులు, ఇతర కుట్రదారులతో కలిసి సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో సాక్షులైన కల్లూరు గంగాధర్రెడ్డి, అప్పటి పులివెందుల సీఐ జె.శంకరయ్య, వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి (ఫిర్యాదుదారు)లు... వారి ప్రభావానికి లోనయ్యారన్న అనుమానం ఉంది.
* వివేకా హత్యానేరాన్ని తనపై వేసుకుంటే రూ.10కోట్లు ఇస్తానంటూ దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఆఫర్ ఇచ్చారని తొలుత వాంగ్మూలం ఇచ్చిన కల్లూరు గంగాధర్రెడ్డి ఆ తర్వాత మాట మార్చారు. సీబీఐపైన అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
* వివేకా హత్య సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె.శంకరయ్య విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అప్పట్లోనే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనకూడా మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి తొలుత అంగీకరించి, అనంతరం నిరాకరించారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆయన సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తేసింది.
* వివేకా పీఏగా వ్యవహరించిన ఎంవీ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తొలుత ఆ ఘటనపై పులివెందుల పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తర్వాత ఆయన సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత సీబీఐ అదనపు ఎస్పీ రామ్సింగ్ తనను ఒత్తిడి చేసి, తప్పుడు వాంగ్మూలం నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వారి సన్నిహితులు చెప్పబట్టే ఆయన ఈ ఫిర్యాదు చేసినట్లు అనుమానం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై ఛీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి