CM Jagan: మేం గవర్నర్ను అవమానించినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా
‘రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్ను అవమానిస్తారా? ఇదేం పద్ధతి. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా కాగితాలు చించేసి ఆయనపై విసరడం ఏంటి?’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెదేపా....
మంత్రిమండలినే రద్దు చేసుకుంటాం
రాజ్యాంగ వ్యవస్థనే అవమానిస్తారా?
తెదేపా సభ్యులు ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వరా?
శాసనసభా వ్యవహారాల సలహా మండలి భేటీలో ముఖ్యమంత్రి జగన్
అవాస్తవాలు మాట్లాడితే ఆటోమెటిక్గా ప్రివిలేజ్ వర్తింపజేయాలన్న సీఎం
బీఏసీ సమావేశంలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ‘రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్ను అవమానిస్తారా? ఇదేం పద్ధతి. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా కాగితాలు చించేసి ఆయనపై విసరడం ఏంటి?’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెదేపా సభ్యులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశంలో ఇదే అంశాన్ని సీఎం ప్రస్తావిస్తూ సమావేశానికి హాజరైన తెదేపా పక్ష ఉప నేత అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. ‘చరిత్రలో ఎప్పుడూ ఇలాంటివి లేవు. మీ (తెదేపా) సభ్యుల తీరు అసెంబ్లీ పవిత్రతను నాశనం చేసేలా ఉంది’ అని సీఎం అన్నారు. ‘గతంలో మీరూ చేశారు’ కదా అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించగా... ‘నేను చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా. మంత్రిమండలిని రద్దు చేసుకుంటా’ అని సీఎం తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలిసింది. ‘గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడమనేది ఇదే మొదటిసారి కాదు కదా’ అని అచ్చెన్నాయుడు అనగా... ‘మేమెప్పుడూ ఇలా చేయలేదు? చేశానని చూపిస్తే రాజీనామా చేస్తా’ అని సీఎం పునరుద్ఘాటించారు. ‘మీరు చేశారని కాదు.. ఇలా గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడమనేది గతంలోనూ జరిగాయనేది నా ఉద్దేశం’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
అచ్చెన్న కమింగ్ బ్యాక్: సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభ బీఏసీ గదిలో భేటీ నిర్వహించారు. సమావేశ గదిలోకి అచ్చెన్నాయుడు ప్రవేశిస్తుండగా... ‘అచ్చెన్న కమింగ్ బ్యాక్’ అంటూ ముఖ్యమంత్రి సరదాగా వ్యాఖ్యానించారు. దానికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ... ‘అసెంబ్లీ ఉన్నప్పుడు రావాలి కదా..? ఇందులో కమింగ్ బ్యాక్ ఏముంటుంది’ అని సమాధానమిచ్చారు.
ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమివ్వండి
సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వండని అచ్చెన్నాయుడు కోరగా... ‘ఇస్తున్నారు కదా? మైక్ ఇస్తే విషయం మాట్లాడకుండా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు’ అని మంత్రులు అన్నారు. ‘గత సమావేశంలోనూ మీరు (తెదేపా) అడిగిన అంశంపైనే సభలో చర్చ పెడితే దానిపైన మాట్లాడకుండా డైవర్ట్ చేశారు’ అని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ‘మీ నాయకుడి (చంద్రబాబు) భార్యను సభలో ఎవరూ ఏమీ అనకపోయినా అన్నారంటూ హంగామా చేశారు కదా’ అని సీఎం, ఇతర కమిటీ సభ్యులు (మంత్రులు) వ్యాఖ్యానించగా... ‘మీ వాళ్లు మా వద్దకు వచ్చి అన్న మాటలే చెప్పాం’ అని అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. ‘ఆన్ రికార్డు ఉంటే చూపించండి’ అని చీఫ్ విప్, మంత్రులు అనగా... ‘ఆన్ రికార్డు అంటామంటే స్పీకర్ వారిని అనుమతించరు కదా? రన్నింగ్ కామెంట్రీ చేస్తూ మాట్లాడుతున్నారు. కావాలంటే దానికి సంబంధించిన రికార్డులను మేమే ఇస్తాం’ అని అచ్చెన్నాయుడు అనగా... ‘మీరు ఏవేవో వీడియోలు పట్టుకొస్తారు’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి... అచ్చెన్నాయుడుతో అన్నారు. ‘అనని మాటలను పట్టుకుని హంగామా చేసి వెళ్లిపోయారు. బయటకు (అసెంబ్లీ బయట) వెళ్లి సభలో మేమేదో అన్నట్లు చిత్రీకరించారు. అప్పుడు కుప్పం మున్సిపాలిటీలో మీ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఒక ప్రణాళిక ప్రకారమే అది చేశారు’ అని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం.
మూడో గీత దాటితే సస్పెన్షన్
‘సభలో తెదేపా సభ్యులు చాలా గందరగోళం చేస్తున్నారు’ అని సీఎం అన్నట్లు తెలిసింది. ‘అందువల్లే మూడంచెలు పెడదామనుకుంటున్నా. మొదటి, రెండు అంచెల్లో సభ్యులను హెచ్చరిస్తాం. మూడో గీత అంటే పోడియం మీదకు వస్తే డీమ్డ్ టు బి సస్పెన్షన్ అని పెడదామనుకుంటున్నా’ అని సభాపతి తమ్మినేని సీతారాం తెలిపినట్లు సమాచారం. ‘ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మూడో లైన్ను మేం టచ్ చేస్తాం’ అని అచ్చెన్నాయుడు ప్రతిస్పందించారు.
వెంటనే ప్రివిలేజ్ నోటీసు
‘సభలో మీ (తెదేపా) వాళ్లు అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నారు’ అని మంత్రి బుగ్గన అనగా... ‘ఉన్న విషయాలనే మేం చెబుతాం. అందులో మీకేమైనా తప్పనిపిస్తే వాటిని మీ మంత్రులు సరిచేసి చెప్పవచ్చు కదా’ అని అచ్చెన్నాయుడు స్పందించారు. ‘ఒకసారి ఇవీ వాస్తవాలు అని మేం చెప్పిన తర్వాత మళ్లీ తప్పుడు లెక్కలు సభలో చెబుతున్నారు. అలా చెబితే ఇకపై అక్కడికక్కడే ప్రివిలేజ్ నోటీసునిచ్చి కమిటీకి రెఫర్ చేయాలి’ అని సభాపతితో సీఎం అన్నట్లు తెలిసింది. వివిధ అంశాలపై చర్చ తర్వాత అధికారపక్షం నుంచి 25, ప్రతిపక్ష తెదేపా నుంచి 20 వరకు అంశాలను ఈ సమావేశాల్లో చర్చకు ప్రతిపాదించినట్లు తెలిసింది.
సభా వ్యవహారాలు ఇలా...
* మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతిపై మంగళవారం సభలో సంతాప తీర్మానం. గౌతమ్రెడ్డి మృతికి సంతాపంగా 9న సభా వ్యవహారాలుండవు.
* 10, 11 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది.
* గవర్నర్ ప్రసంగంపై 11న చర్చ ముగియగానే ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ను ప్రవేశపెడతారు.
* 12, 13వ తేదీల్లో సెలవు.
* 14న సభ తిరిగి ప్రారంభమై 17 వరకు కొనసాగుతుంది.
* 18న హోలీ, 19, 20 శని, ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవు.
* తిరిగి 21న ప్రారంభమవుతుంది. 25న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడతారు.. అదే రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు