Teachers:బోధనేతర పనులకు ఉపాధ్యాయులొద్దు
ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ... ‘ఉపాధ్యాయులు
వారు పూర్తిగా బోధనలోనే ఉండాలి
విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ... ‘ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. లేదంటే పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులున్నారు. వారి సేవలను సమర్థంగా వాడుకోగలిగితే నాణ్యమైన విద్య అందుతుంది. అన్ని తరగతులకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. విద్యార్థులకు ప్రతి రోజూ ఒక ఆంగ్ల పదాన్ని నేర్పేటప్పుడు నిఘంటువులో ఆ పదాన్ని చూసి అర్థం తెలుసుకోవడంతోపాటు వాక్యాల్లో ఎలా వినియోగించాలో నేర్పాలి’ అని ఆదేశించారు. ‘కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లోనూ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలి. ప్రస్తుతమున్న వాటిలో సౌకర్యాలు మెరుగుపర్చాలి.
ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు కెరీర్ మార్గదర్శకత్వం ఇవ్వాలి. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులను విడివిడిగా కలుస్తూ వారి భవిష్యత్తుకు మార్గం వేసేలా కౌన్సెలింగ్ ఇవ్వాలి’ అని సూచించారు.
15 నుంచి రెండో విడత ‘నాడు-నేడు’
‘రెండో విడత ‘నాడు- నేడు’ను ఈనెల 15 నుంచి ప్రారంభించాలి. పాఠశాలలకు క్రీడా స్థలాలు ఉండాలి. ప్రతి ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి విద్యా కానుక అందించాలి. ప్రైవేటు కళాశాలల్లో ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయో.. లేదో చూడాలి. పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కింద కల్పిస్తున్న సౌకర్యాల నిర్వహణ సరిగా లేకుంటే నిరర్ధకమవుతాయి. మరుగుదొడ్లు, తాగునీటి ప్లాంట్లు తదితరాలపై ఫిర్యాదులు వచ్చిన వారం రోజుల్లోగా పరిష్కారం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఇంజినీరింగ్ సిబ్బంది, విలేజ్ క్లినిక్లలోని సిబ్బందికి పాఠశాలల్లో వసతుల నిర్వహణపై సూచనలు ఇవ్వాలి’ అని ఆదేశించారు.
* ‘రాష్ట్రం నైపుణ్యమున్న మానవ వనరులకు చిరునామాగా మారాలి. ఈ మేరకు నైపుణ్యాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావాలి. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక నైపుణ్య కళాశాలతోపాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఐటీఐ, పాలిటెక్నిక్ సమ్మిళితంగా నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి’ అని సీఎం సూచించారు.
* ‘నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని పాఠశాలలను మ్యాపింగ్ చేశాం. ఫిబ్రవరి 14 నుంచి ప్రతి రోజూ ఒక ఆంగ్ల పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన సాగుతోంది. వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్ అభ్యసన, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాం. ప్రతి మండలానికి కో-ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, మరో మహిళా కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. పాఠశాలలు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబరు ఏర్పాటు చేశాం’ అని అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. -
అక్రమాల కిరణం!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.