AP High Court: పీపీఏల ప్రకారం చెల్లించాల్సిందే
గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. బకాయిలు, భవిష్యత్తు ధరలు పీపీఏల్లో పేర్కొన్న ప్రకారమే చెల్లించాలని రాష్ట్రప్రభుత్వానికి, డిస్కంలకు తేల్చిచెప్పింది.
ఆరు వారాల్లో బకాయిలు కట్టాలని డిస్కంలకు ఆదేశం
సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు యథాతథం
ఏపీఈఆర్సీ సమీక్షించడానికి వీల్లేదు
సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు
హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు
ఈనాడు - అమరావతి
ఆర్థిక ఇబ్బందులు అనే కారణంతో ఒప్పంద నిబంధనల నుంచి పార్టీలు బయటపడలేవు. వినియోగదారుల నుంచి నిర్ణయించిన ధరలను వసూలు చేస్తూ.. డిస్కంలు ఆర్థిక ఇబ్బందులపై వాదన లేవనెత్తడానికి వీల్లేదు.
- హైకోర్టు
గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. బకాయిలు, భవిష్యత్తు ధరలు పీపీఏల్లో పేర్కొన్న ప్రకారమే చెల్లించాలని రాష్ట్రప్రభుత్వానికి, డిస్కంలకు తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి సౌర, పవన విద్యుత్ యూనిట్ ధరను తగ్గించాలని కోరలేవని స్పష్టంచేసింది. యూనిట్ ధరలను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సమీక్షించేందుకు వీలు కల్పించడంతో పాటు, తాత్కాలిక చర్యల్లో భాగంగా పవన విద్యుత్ యూనిట్కు రూ.2.43, సౌర విద్యుత్కు రూ.2.44 చెల్లించాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని, డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దుచేసింది. ఆ తరహా ఉత్తర్వులివ్వడం సముచితంగా లేదని అభిప్రాయపడింది. మరోవైపు సౌర, పవన విద్యుత్ ధరలను సమీక్షించాలంటూ ఏపీఈఆర్సీ వద్ద డిస్కంలు దాఖలు చేసిన పిటిషన్లకు విచారణ అర్హత లేదంటూ వాటిని కొట్టేసింది.
* మరోవైపు పవన, సౌర విద్యుత్ సంస్థలు చేస్తున్న ఉత్పత్తిలో కోత పెట్టవద్దని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ దాఖలుచేసిన అప్పీలును కొట్టేసింది. పవన, సౌర విద్యుత్ సంస్థలు తప్పనిసరి నిర్వహణ (మస్ట్ రన్) నిర్వచనం కిందకు వస్తాయంది. ఆ సంస్థలు ఉత్పత్తి చేసే విద్యుత్లో కోత పెట్టడానికి వీల్లేదని, తప్పనిసరిగా డిస్కంలు తీసుకోవాలని స్పష్టంచేసింది. కోత పెట్టవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది.
* సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన అన్ని పెండింగ్ బకాయిలు, భవిష్యత్తు చెల్లింపులను పీపీఏలో పేర్కొన్న ధరల ప్రకారం ఆరు వారాల్లో చెల్లించాలని డిస్కంలను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం 79 పేజీల కీలక తీర్పు ఇచ్చింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దాఖలుచేసిన అప్పీళ్లను అనుమతించింది.
నేపథ్యమిదే..
* గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ యూనిట్ ధరలను ఏపీఈఆర్సీ సమీక్షించేందుకు వీలుకల్పిస్తూ 2019 సెప్టెంబరులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీలు చేశాయి. తాత్కాలిక చర్యల్లో భాగంగా సౌరవిద్యుత్ యూనిట్కు రూ.2.44 (పీపీఏ ధర రూ.4.84), పవన విద్యుత్ యూనిట్కు రూ.2.43 (పీపీఏ ప్రకారం రూ.5.99) చొప్పున బకాయిలు చెల్లించాలని సింగిల్ జడ్జి ఆదేశించడంపై అభ్యంతరం తెలిపాయి. మరోవైపు యూనిట్ ధరను సవరించాలని కోరుతూ ఈఆర్సీ వద్ద డిస్కంలు దాఖలుచేసిన పిటిషన్లను కొట్టేయడానికి సింగిల్ జడ్జి నిరాకరించడంతో విద్యుదుత్పత్తి సంస్థలు అప్పీళ్లు వేశాయి. నాలుగు అంశాలుగా విభజించి ఈ అప్పీళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేసి, మంగళవారం తుదితీర్పు వెల్లడించింది.
న్యాయస్థానాలు సవరించలేవు
న్యాయస్థానాలు ఒప్పందాలను సవరించలేవని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. పీపీఏల సమీక్షకు సంప్రదింపుల కమిటీని ఏర్పాటుచేస్తూ ఇంధన శాఖ జారీచేసిన జీవో 63, తదనంతరం యూనిట్ ధరలను తగ్గించాలంటూ ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖను రద్దుచేసిన సింగిల్ జడ్జి.. తాత్కాలిక చర్యల్లో భాగంగా యూనిట్ ధరలను తగ్గించడం సరికాదంది. ఓ వైపు విద్యుత్ సంస్థల వ్యాజ్యాలను అనుమతిస్తూనే ధరలు తగ్గించాలని సింగిల్ జడ్జి పేర్కొనడాన్ని తప్పుపట్టింది. తాత్కాలిక చెల్లింపుల్లో భాగంగా ఉత్తర్వులివ్వడానికి సింగిల్ జడ్జి అధికరణ 226ని ఉపయోగించి ఉండాల్సింది కాదని పేర్కొంది. డిస్కంల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సింగిల్ జడ్జి రూ.2.44, రూ.2.43 చొప్పున చెల్లించాలని ఆదేశించి ఉండవచ్చని తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు అనే కారణంతో ఒప్పంద నిబంధనల నుంచి పార్టీలు బయటపడటానికి వీల్లేదంది. వినియోగదారుల నుంచి నిర్ణయించిన ధరలను వసూలు చేస్తూ.. డిస్కంలు ఆర్థిక ఇబ్బందులపై వాదన లేవనెత్తడానికి వీల్లేదంది. పీపీఏలోని నిబంధనలు, షరతులు ఇరుపార్టీల మధ్య రాసుకునేవని తెలిపింది. వాటిని న్యాయస్థానాలు సవరించడం లేదా తిరిగి రాయడం చేయలేవని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో పీపీఏలను పార్టీలు కానీ, న్యాయస్థానం కానీ సవరించలేవని పేర్కొంది. డిస్కం, ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల కారణంగా యూనిట్ ధరలను తగ్గించడానికి వీల్లేదని తెలిపింది.
ఏపీఈఆర్సీ సమీక్షించలేదు
* ఏపీఈఆర్సీ తన జ్యుడిషియల్ అధికారాలను వినియోగిస్తూ.. 2017 మార్చి 31కి ముందు (రెగ్యులేషన్-1 ప్రకారం) జరిగిన ఒప్పందాలన్నీ అమల్లో ఉంటాయని ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో 2017 మార్చి 31 తర్వాత జరిగే ఒప్పందాల్లో యూనిట్ ధరలను ప్రాజెక్టుల వారీగా వేర్వేరుగా నిర్ణయిస్తామని పేర్కొంది. అప్పటికే జరిగిన ఒప్పందాల్లో ఎక్కడా సమయానుగుణంగా ధరలను సమీక్షించవచ్చనే నిబంధన లేనందువల్ల పీపీఏల ప్రకారం 25 ఏళ్ల కాలానికి అంగీకరించిన ధరలనే అమలు చేయాలి. రెగ్యులేషన్-1 ప్రకారం అప్పటికే అమల్లోకి వచ్చిన ఒప్పందాల్లోని ధరను సమీక్షించే అధికారం ఏపీఈఆర్సీకి లేదు. ఈ నేపథ్యంలో యూనిట్ ధరలను సమీక్షించాలంటూ ఈఆర్సీ ముందు డిస్కంలు వేసిన పిటిషన్లకు విచారణ అర్హత లేదు. పీపీఏ అనేది విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, డిస్కంల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందం. ఈ నేపథ్యంలో పీపీఏ ప్రకారం నిర్ణయించిన ధరలను చెల్లించాల్సిందే. పీపీఏల్లో సవరణలు చేయాలంటే ఇరుపక్షాల సమ్మతి మేరకు జరగాలే కానీ.. ఏకపక్షంగా లేదా గతంలో ఏపీఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసిందనే ముసుగులో సవరించడానికి వీల్లేదు’ అని తేల్చిచెప్పింది.
* విద్యుత్ చట్టంలోని సెక్షన్ 62 అధికారాన్ని ఉపయోగించి యూనిట్ ధర మదింపు తర్వాతే పీపీఏ జరిగినట్లు ధర్మాసనం గుర్తుచేసింది.
* విద్యుత్ చట్టంలోని సెక్షన్ 86(1)(బి) ప్రకారం ధరలను సమీక్షించే అధికారం ఏపీఈర్సీకి ఉందన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
* విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పవిత్రమైనవని, ఒప్పందంలో నిర్దిష్టమైన నిబంధన ఉంటే తప్ప వాటిని పునఃసమీక్షించకూడదని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. పీపీఏలను సమీక్షించడంతో పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లుతుందని, భవిష్యత్తు బిడ్డింగ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్రం చెప్పిన విషయాన్ని తీర్పులో ప్రస్తావించింది.
* పీపీఏలను పరిశీలిస్తే టారిఫ్ సవరణ గురించి పేర్కొనలేదని తెలిపింది.
* టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం నిర్ణయించిన ధరలు 25 ఏళ్లు అమల్లో ఉండేలా స్పష్టంచేశారని, ఈ నేపథ్యంలో టారిఫ్ను తగ్గించడం, సవరించడం ఏపీఈఆర్సీ చేయలేదని పేర్కొంది. సవరణ కోసం డిస్కంలు ఈఆర్సీ వద్ద వేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని చెప్పడానికి సందేహించట్లేదని తెలిపింది.
* సౌర, పవన సంస్థలు చేస్తున్న విద్యుత్లో కొత్తపెట్టడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని భావిస్తే, ఏ కారణంతో కోత పెట్టారో చెప్పాల్సిన బాధ్యత ఆ సంస్థపైనే ఉందని తెలిపింది. గ్రిడ్ భద్రతకు తప్ప.. మిగిలిన సమయాల్లో ఉత్పత్తిలో కోత విధించడం సరికాదంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.