Andhra News: సహజ మరణాలని చెప్పండి.. మీకు సాయం చేసేలా చూస్తాం
జంగారెడ్డిగూడెంలో సారా మరణాలుగా చెబుతున్నవన్నీ సహజ మరణాలేనంటూ ప్రభుత్వ పెద్దలు శాసనసభలో చేస్తున్న ప్రకటనలకు బలాన్ని చేకూర్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
ఏలూరులో అధికారులు చెప్పారంటున్న బాధిత కుటుంబీకులు
ఈనాడు డిజిటల్, ఏలూరు: జంగారెడ్డిగూడెంలో సారా మరణాలుగా చెబుతున్నవన్నీ సహజ మరణాలేనంటూ ప్రభుత్వ పెద్దలు శాసనసభలో చేస్తున్న ప్రకటనలకు బలాన్ని చేకూర్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు బాధిత కుటుంబీకులే ధ్రువీకరిస్తున్నారు. ‘నాతో పాటు నాటుసారా వల్ల అండ కోల్పోయిన 12 కుటుంబాల వారిని ఏలూరుకు తీసుకెళ్లారు. ఉదయంనుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉన్నాం. మాకు భోజనం పెట్టారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో వీఆర్వోను కేటాయించి మావాళ్లు చనిపోయిన రోజు ఏం జరిగిందో, వారు ఎలా మరణించారో మమ్మల్ని అడిగారు. నాటుసారా వల్లే మావాళ్లు చనిపోయారని అందరం చెప్పాం. మేం చెప్పినవన్నీ రాసుకున్నారు. మా ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు, ఇతర వివరాలు తీసుకున్నారు. ఆ తరువాత.. ‘మేము మీడియాను పిలుస్తాం. మద్యం తాగే అలవాటుంది.. కానీ తినకుండా ఉండటం వల్లే మావాళ్లు అనారోగ్యానికి గురై చనిపోయారని చెప్పండి. తాగి చనిపోయారంటే నష్టపరిహారం రావడానికి సమయం పడుతుంది. మేం చెప్పినట్లు చెబితే సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేలా చేస్తాం. మీకు ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తుంది’ అని అక్కడుండే ఓ అధికారి మాకు చెప్పారు. అలా అని నిర్బంధం చేయలేదు. ‘మాకు మీరు ఎలాంటి సాయం చేయకపోయినా ఫరవాలేదు. మావాళ్లను పోగొట్టుకుని ఇంత దూరం వచ్చాం. నిజమే చెబుతాం తప్ప అబద్ధం చెప్పబోం. కల్తీసారా వల్ల మావాళ్లను కోల్పోయి దిక్కుతోచక ఉన్న మాకు సాయం చేస్తే చేయండి. లేదా మమ్మల్ని పంపించేయండి’ అని చెప్పి అందరం వచ్చేశాం’ అని బి.రాంబాబు కుమార్తె తెలిపారు. ‘మాకు మీ డబ్బులొద్దు.. ఏమీ వద్దు.. అలా చెప్పం అన్నాం. సారా మరణాలని చెబితే ప్రభుత్వంనుంచి డబ్బులేమీ రావన్నారు. మా పిల్లలకు మంచి చేస్తారేమోననే ఆశతో వెళితే అబద్ధాలు చెప్పమన్నారు’ అని పితాని రమణ భార్య విజయలక్ష్మి వాపోయారు. సోమవారం ఏలూరుకు వెళ్లిన మరో రెండు కుటుంబాలవారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘నాటుసారా కట్టడికి చర్యలు తీసుకుని మాకు సాయం చేసి పరిస్థితిని చక్కదిద్దడం మాని విషయాన్ని దాచేందుకు ప్రభుత్వం ఎందుకింత చేస్తోందో అర్థం కావట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
22మందిపై కేసులు
జంగారెడ్డిగూడెంలో తాజాగా చాలా మరణాలకు కల్తీసారానే కారణమని ఈ సంఘటనలతో సంబంధం లేనివారు కూడా చెబుతున్నారు. సారా ప్రభావం లేదని చెబుతున్న యంత్రాంగం హడావుడిగా పలువురిని ఎందుకు అరెస్టు చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో 243 లీటర్ల నాటుసారా, 18,300 లీటర్ల బెల్లంఊటను ఎస్ఈబీ అధికారులు ధ్వంసం చేశారు. 63,048 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. 22మందిపై కేసులు పెట్టి నలుగురిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు?
రాజీనామా చేశాక వాలంటీర్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
గులకరాయి కేసులో కస్టడీ పిటిషన్పై ముగిసిన వాదనలు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్ను పోలీసు కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.