ap news:ప్రధాన డ్యాం డిజైన్ల ఖరారుకు మరో కమిటీ
గోదావరి వరద ఉద్ధృతికి నదీ గర్భంలో ఏర్పడ్డ కోత వల్ల పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎదురైన సమస్య పరిష్కారానికి కేంద్రం మరో కమిటీని నియమించింది. దిల్లీ ఐఐటీ విశ్రాంత డైరక్టర్ ప్రొఫెసర్ వి.ఎస్.రాజు
25లోగా చర్చించి మెథడాలజీ తేల్చాలి
వరద కోతవల్ల అదనపు పనులకు మేమే నిధులిస్తాం
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి షెకావత్ స్పష్టీకరణ
దిగువ కాఫర్ డ్యాం డిజైన్ల ఖరారు
ఈనాడు, అమరావతి: గోదావరి వరద ఉద్ధృతికి నదీ గర్భంలో ఏర్పడ్డ కోత వల్ల పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎదురైన సమస్య పరిష్కారానికి కేంద్రం మరో కమిటీని నియమించింది. దిల్లీ ఐఐటీ విశ్రాంత డైరక్టర్ ప్రొఫెసర్ వి.ఎస్.రాజు నేతృత్వంలో ఈ కమిటీ అధ్యయనం చేసి, మెథడాలజీ విషయంలో ఒక అభిప్రాయానికి రావాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వద్ద నిర్వహించిన సమావేశం బుధవారం నిర్ణయించింది. వారి అధ్యయనం తర్వాత మార్చి 27, 29 తేదీల మధ్య మరోసారి సమావేశం నిర్వహిస్తానని, తానే స్వయంగా హాజరవుతానని కేంద్రమంత్రి వెల్లడించారు. వరద కోత వల్ల పోలవరం ప్రాజెక్టుకు అదనంగా చేయాల్సిన పనులకు అయ్యే అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందనీ మంత్రి భరోసా ఇచ్చారు. అదనపు పనులు చేయాలని.. ఆకృతులు మార్చాలని కేంద్ర కమిటీలే చెబుతున్నాయని, మళ్లీ ఆ నిధులు అడిగితే అభ్యంతరాలు చెబుతున్నారని రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఈ హామీ ఇచ్చినట్లు తెలిసింది. గోదావరి గర్భంలో ఇసుక కోత సమస్యను ఎలా ఎదుర్కోవాలి? ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ డిజైన్ల ప్రకారం ముందుకు సాగాలనే అంశాలను పై కమిటీతో పాటు ఆకృతులకు సంబంధించిన నిపుణులంతా కలిసి చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టులో డిజైన్లు, నిధుల కొరత సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి హామీతో దిల్లీలో బుధవారం రెండు సమావేశాలు నిర్వహించారు. తొలుత కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్, కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఆర్.కె.గుప్తా, ఏపీ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, కేంద్ర సలహాదారు వెదిరె శ్రీరాం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, డీడీఆర్సీ ఛైర్మన్ పాండ్యా, ఈఎన్సీ నారాయణరెడ్డి, చీఫ్ ఇంజినీరు సుధాకర్బాబు, సలహాదారు ఎం.గిరిధర్రెడ్డి, నిర్మాణ సంస్థ మేఘా డైరెక్టర్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశానికి ముందు మార్చి 10న దిల్లీలో పోలవరం ఆకృతులపై ఓ సమావేశం నిర్వహించారు. అందులో దిగువ కాఫర్ డ్యాం ఆకృతులపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిసింది. ఇప్పటికే దిగువ కాఫర్ డ్యాం నిర్మాణానికి ఆకృతుల కమిటీ ప్రతిపాదించిన అంశాల మేరకు డిజైన్లు ఖరారు చేయాలని కేంద్ర మంత్రి నిర్దేశించడంతో వాటికి ఆమోదం లభించింది. ప్రధాన డ్యాం నిర్మాణంలో గ్యాప్ 2, గ్యాప్ 1 ప్రాంతంలో ఇసుక కోత ఏర్పడటంతో అక్కడ పనులు ఎలా చేపట్టాలనే అంశంలో అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ అంశాన్ని వి.ఎస్.రాజు కమిటీతో పాటు డీడీఆర్పీ సభ్యులు, ఇతరులు కలిసి కొలిక్కి తేవాలని నిర్దేశించారు. పోలవరం స్పిల్ వే వద్ద ఎడమ గట్టు పటిష్ఠం పనులకూ డిజైన్లు ఖరారు చేయాలని సూచించారు. కేంద్రమంత్రితో సమావేశం అనంతరం సాయంత్రం మరోసారి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించారు. పోలవరం ఆకృతులపై తుది నిర్ణయానికి రావడానికి ఎలా ముందుకు వెళ్లాలో షెడ్యూలు సిద్ధం చేసినట్లు సమాచారం.
మరిన్ని వివరాలు https://epaper.eenadu.net లో..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని