Ap news:భరోసా అంతంతే
గ్రామాల్లో విప్లవం సృష్టిస్తున్నాయని, దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని ప్రభుత్వం చెప్పే రైతు భరోసా కేంద్రాల్లో ఒక్కో దాంట్లో పట్టుమని 10 లీటర్ల పురుగు మందులూ అమ్మకం కాలేదు. పాతిక కిలోల విత్తనాలనూ విక్రయించలేదు. వెయ్యి బస్తాల ఎరువులను అందించలేకపోయారు. ఆర్బీకేల ద్వారా అందించే సేవలపై ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు గురువారం శాసన మండలికి ప్రభుత్వమిచ్చిన సమాధానంలోనే ఇది స్పష్టమవుతోంది. 2019 అక్టోబరులో
విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అరకొర సేవలు
శాసన మండలికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సుస్పష్టం
ఈనాడు, అమరావతి: గ్రామాల్లో విప్లవం సృష్టిస్తున్నాయని, దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని ప్రభుత్వం చెప్పే రైతు భరోసా కేంద్రాల్లో ఒక్కో దాంట్లో పట్టుమని 10 లీటర్ల పురుగు మందులూ అమ్మకం కాలేదు. పాతిక కిలోల విత్తనాలనూ విక్రయించలేదు. వెయ్యి బస్తాల ఎరువులను అందించలేకపోయారు. ఆర్బీకేల ద్వారా అందించే సేవలపై ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు గురువారం శాసన మండలికి ప్రభుత్వమిచ్చిన సమాధానంలోనే ఇది స్పష్టమవుతోంది. 2019 అక్టోబరులో ప్రారంభమైన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు ‘పెద్ద ఎత్తున’ సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పే మాటల్లో నిజమెంతో ఈ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలోని 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా 95,571 లీటర్ల పురుగు మందులు విక్రయించినట్లు చెప్పింది. అంటే ఒక్కో ఆర్బీకేలో సగటున 9 లీటర్ల పురుగు మందులు అమ్మగలిగారు. చిన్న పురుగు మందుల దుకాణంలోనూ ఇంతకు 200 రెట్ల అమ్మకాలుంటాయి. మోస్తరు దుకాణంలోనైనా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వ్యాపారం చేస్తారు. మొత్తం విక్రయించిన పురుగు మందుల్లో ప్రభుత్వ పథకాల కింద రైతులకు రాయితీపై ఇచ్చేవీ ఉన్నాయి. వాటిని తీసేస్తే రైతులు సొమ్ము చెల్లించి కొనుక్కున్న పురుగు మందులు నామమాత్రమే. కౌలు రైతులకు 9.37 లక్షల సీసీఆర్సీ కార్డులు (సాగుదారు ధ్రువపత్రాలు) ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఒక్కో ఆర్బీకే పరిధిలో వందలాది కౌలు రైతులుంటే ఇచ్చిన కార్డులు సగటున 87 మాత్రమే.
ఒక్కో ఆర్బీకేలో 780 బస్తాల ఎరువుల అమ్మకం
ఆర్బీకేల్లో మొత్తం 4.19 లక్షల టన్నుల ఎరువులు విక్రయించినట్లు ప్రభుత్వం వివరించింది. రాష్ట్రంలోని 10,778 రైతు భరోసా కేంద్రాలకు పరిశీలిస్తే ఒక్కో ఆర్బీకే ద్వారా సగటున 39 టన్నుల ఎరువులేఅమ్మారు. అంటే 780 బస్తాలను విక్రయించారు. ప్రైవేటు వ్యాపారులకు కేటాయింపుల్లో కోత పెట్టడంతోపాటు సహకార సంఘాల ద్వారా అమ్మకాలను నియంత్రించిన ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా ఎరువుల విక్రయాలకు ప్రాధాన్యమిచ్చింది. ప్రతి గ్రామంలోనూ గోదాములు ఏర్పాటుచేయించి మరీ అమ్మకాలు చేయించింది. ప్రత్యేక దృష్టి పెట్టినా ఒక్కో ఆర్బీకే పరిధిలో వెయ్యి బస్తాలైనా అమ్మలేకపోయారు.
ఒక్కో కేంద్రానికి 13 కిలోల విత్తనాలే
ఆర్బీకేల ద్వారా మొత్తం 1,390 క్వింటాళ్ల విత్తనాలను విక్రయించారు. ఒక్కో ఆర్బీకేను పరిశీలిస్తే సరాసరి 13 కిలోల లెక్క వస్తుంది. ఇందులోనూ పశు సంవర్థకశాఖ ద్వారా అందించే గడ్డి విత్తనాలు కలిసే ఉంటాయి. ఒక గ్రామంలో వెయ్యి ఎకరాలు పత్తి వేశారనుకున్నా 2వేల ప్యాకెట్ల విత్తనాలు కావాలి. ఒక్కోటి 450 గ్రాముల చొప్పున చూస్తే 900 కిలోల విత్తనాలు అవసరం. మొత్తంగా చూస్తే ఒక్కో ఆర్బీకేలో ఎకరం సాగుకు అవసరమయ్యే వరి విత్తనంపాటి వ్యాపారమూ జరగలేదని స్పష్టమవుతోంది. రైతులనుంచి ఎక్కువ డిమాండు ఉండే మిరప, పత్తి విత్తనాలను ప్రత్యేకంగా ఆర్బీకేలకు కేటాయిస్తేనే ఈ మేరకైనా అమ్మకాలు సాగాయి. ఇవికాకుండా రాయితీపై 18.23 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశారు.
అరువుపైనే ఆధారపడుతున్న రైతాంగం
విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్ల విషయంలో రైతులు అరువుపైనే ఆధారపడుతున్నారు. అప్పు తీసుకుని పంట చేతికి రాగానే వారికి విక్రయించడమో, మార్కెట్లో విక్రయించాక వచ్చిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించడమో చేస్తుంటారు. అదే రైతు భరోసా కేంద్రంలో అయితే ముందుగా సొమ్ము చెల్లించాలి. ఆర్డరు పెట్టాక విత్తనాలు, పురుగు మందులు వస్తాయి. ఈలోగా వాన కురిస్తే విత్తనం వేయలేరు. పురుగు భయపెడుతున్నా మందు పిచికారీ చేయలేరు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని గుర్తించకుండా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సహా అన్నీ అమ్మేస్తున్నామని చెబుతోందని రైతుసంఘాల నేతలు పేర్కొంటున్నారు.
కొరవడిన స్పష్టత: రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తృత సేవలందించాలనేది లక్ష్యం. ఆధునిక సాంకేతికత, పంటల సాగుపై శిక్షణల ద్వారా రైతుల్లో అవగాహన పెంపొందించే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. క్రమంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకాలు చేపట్టారు. రైతు భరోసా, ఈ-పంట నమోదు, పంటల బీమా, పంట ఉత్పత్తుల సేకరణకు చర్యలు, రాయితీ విత్తనాలు, పంటనష్టం వివరాల సేకరణ, సీసీఆర్సీ కార్డులు, సున్నావడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ పొలంబడి, పీఎం కిసాన్, పంటకోత ప్రయోగాలు, రైతులకు పంట రుణాలు ఇప్పించడం, తెగుళ్లను గుర్తించి యాప్లో నమోదు చేయడం, పంట నిర్వహణ పద్ధతులపై శిక్షణ, ధాన్యం సేకరణ, సామాజిక అద్దె యంత్రాల కేంద్రాల ఏర్పాటు, వారికి రుణాలు ఇప్పించడం, పంటలవారీ ధరలను సీఎం యాప్లో నమోదు చేయడం, తదితర ఎన్నో కార్యక్రమాల అమలు బాధ్యత అక్కడుండే వ్యవసాయ సహాయకులపై ఉంచారు. ఇవి కాకుండా పంచాయతీ కార్యదర్శులు చెప్పే ఇతర పనులనూ చేయాలి. వీటన్నింటి మధ్య వ్యాపారమా? విస్తరణ సేవలా? అనేది ప్రశ్నార్థకమే. కీలకమైన వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల అమలు ప్రశ్నార్థకంగా తయారైందని పలువురు అధికారులే పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!