Chinna Jeeyar Swamy: మా మాటలను వక్రీకరించారు
‘ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి సబబా, కాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. ఆదివాసీలకు.. మహిళలకు అగ్రాసనం ఉండాలన్న సంప్రదాయాల్లోంచి వచ్చిన వాళ్లం.
సమ్మక్క-సారలమ్మలపై 20 ఏళ్ల క్రితం అన్న విషయమది
మధ్యలోంచి ఓ మాటను తెచ్చి ప్రచారం చేస్తున్నారు
మాకు ఎవరితోనూ విభేదాలు లేవు.. వారు పెట్టుకుంటే ఏమీ చేయలేం
విలేకరులతో చినజీయర్ స్వామి
ఈనాడు, అమరావతి: ‘ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి సబబా, కాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. ఆదివాసీలకు.. మహిళలకు అగ్రాసనం ఉండాలన్న సంప్రదాయాల్లోంచి వచ్చిన వాళ్లం. అలాంటి వారిని చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు. ‘స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ అన్న నినాదంతో ముందుకెళ్తున్నాం. ఎప్పుడైనా ఒక మాట విన్నప్పుడు.. దానికి పూర్వాపరాలు చూడాలి. ఎక్కడో మధ్యలో ఒక మాటను తీసుకుని ప్రచారం చేయడం హాస్యాస్పదం. మేం ఆదివాసీలనే కాదు, ఎప్పుడూ ఎవరినీ కించపర్చలేదు. 20 ఏళ్ల క్రితం సమ్మక్క సారలమ్మ దేవతలపై అన్న మాట గురించి ఇలా వచ్చిందని మావాళ్లు చెప్పారు. ‘ఆ దేవతలు స్వర్గం నుంచి దిగిరాలా. మనుషుల్లో నుంచే వచ్చారు. వారికి ఉండే గుణాల వల్ల దేవతలయ్యారు. అలాంటివారిని మధ్యలో పెట్టుకుని మనం అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించొద్దు’ అని మాత్రమే అన్నాం. అది తప్పా? విషయం తెలుసుకోకుండా అందులోని ఒక మాటను పట్టుకుని ఇప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?’ అని శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం ఆయన గుంటూరు జిల్లా సీతానగరంలో విజయకీలాద్రిపై విలేకర్లతో మాట్లాడారు.
ప్రచారం కోసమే..
‘ఇటీవల హైదరాబాద్లోని ముచ్చింతల్లో సమతామూర్తి కార్యక్రమం జరిగింది. దీని గురించి యావత్తు ప్రపంచం మాట్లాడుకుంటోంది. అది సహించలేనివారే గ్రామ దేవతలను తూలనాడినట్లు, తద్వారా ఆదివాసీలను అవమానించినట్లు చెబుతున్నారు. గిరిజనుల కోసం పాఠశాలలు, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటుచేశాం. వారి ఆరోగ్యం కోసం పాటుపడ్డాం. జనాన్ని ప్రభావితం చేసే దేవతలను చిన్నచూపు చూసే పద్ధతిని ఎన్నడూ ప్రోత్సహించం. ఆ పేరుతో జరిగే అరాచకాలను మాత్రం తప్పనిసరిగా అరికట్టాల్సిన బాధ్యత ఉంటుంది. దీనిని అర్థం చేసుకోలేని వ్యక్తుల వివేచనకే వదిలేస్తున్నా. కానీ పనిగట్టుకుని దీన్నో పెద్ద అంశంగా చిత్రీకరించడం తగదు. సమాజహితంపై కాంక్ష ఉండేవారు అయితే వచ్చి మాట్లాడాలి. అమాయకులను రెచ్చగొట్టడం సులభం. కానీ సమాజానికి ఇది మంచిది కాదు. దాంతో సాధించేది ఏమీ ఉండదు.
రామానుజాచార్యుల బాటలో..
జ్ఞానంలో ఉన్నతులైతే.. హరిజనులు, గిరిజనులు, అన్ని వర్గాలవారికీ గౌరవం ఇవ్వాలని రామానుజులు ఎప్పుడో చెప్పారు. 1938లోనే పెదజీయర్ స్వామి.. దేశంలోనే మొదటిసారిగా ఆదివాసీలకు పక్కా ఇళ్లతో కాలనీని మండపేట సమీపంలోని అర్తమూరులో నిర్మించారు. 2004లో ఆదిలాబాద్జిల్లాలో ఆదివాసీలకు విద్య అందించేందుకు పాఠశాలను ప్రారంభించాం. మహిళల సమానతకు ప్రాధాన్యమిచ్చే సంప్రదాయం మాది.
తెలంగాణ ప్రభుత్వంతో సంబంధాలపై అడిగిన ప్రశ్నకు...
మాకు ఎవరితోనూ విభేదాలు ఉండవు. వాళ్లు ఏమైనా పెట్టుకుంటే ఏమీ చేయలేం. మంచి కార్యక్రమాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగేవాళ్లం. అలా ఉంటాం కనకే ఇలాంటి విషయాలు మాట్లాడగలుగుతున్నాం. లేనిపక్షంలో వాళ్లకి, వీళ్లకి భయపడుతూ ఎక్కడో మూలకు నక్కి మాట్లాడతారు. సక్రమమైన మార్గంలో నడవడం లేదని భావిస్తే చెప్పడం మాలాంటి వాళ్ల బాధ్యత. సమాజానికి మేం కళ్ల లాంటి వారం. నువ్వు నడుస్తున్నప్పుడు కాలులో ఏం గుచ్చుకుంటుందో చెప్పడం మా బాధ్యత. దాన్ని గుర్తించకుండా వెళ్లి తొక్కుతాను అంటే.. రక్తం కారేది కాళ్లకే. కానీ.. కన్నీరు కార్చేది కళ్లే.
యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవ ఆహ్వానంపై..
మేం ఎందులోనూ పూసుకు తిరిగేవాళ్లం కాదు. అడిగితే సలహా చెప్పడం, చేసి పెట్టడం మా బాధ్యత. అలా బాధ్యత తీసుకుంటే నూటికి నూరుశాతం న్యాయం చేస్తాం. బాధ్యత కావాలని వెంటపడి పాకులాడే అలవాటు లేదు.
* సమ్మక్క సారలమ్మకు సంబంధించి వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని వీడియోలో మాట్లాడారు కదా.. మీరు సమతామూర్తి దర్శనానికి టికెట్ పెట్టారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘దర్శనానికి టికెట్ పెట్టలేదు. అదో పెద్ద ప్రాంగణం. రుసుము లేకపోతే అంతమందిని నియంత్రించడం కష్టమని.. సామాన్యులకూ అందుబాటులో ఉండాలనే రూ.150 ప్రవేశ రుసుముగా నిర్ణయించాం. అదీ నిర్వహణ కోసమే. ప్రసాదాలు, పూజలు... ఇలా లోపలన్నీ ఉచితమే’ అన్నారు.
* మీరు ఎక్కువగా రాజకీయ నాయకులతో మసలుతున్నారు. మున్ముందు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు.. ‘మేం రాజకీయాలకు ఎప్పుడూ దూరమే. మేం భిక్షా సన్యాసులం. రాజకీయాల్లోకి వెళ్లాలని మా మనసులో ఎప్పుడూ లేదు. రాదు కూడా’ అని సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.