CM Jagan: రాజధానులపై నిర్ణయం మా హక్కు
‘పరిపాలన వికేంద్రీకరణ మా విధానం.. రాజధానులపై నిర్ణయం మా హక్కు. అది మా బాధ్యత. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం’ అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ‘అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా పరిపాలన,
పరిపాలన వికేంద్రీకరణ మా విధానం
ఈ విషయంలో వెనకడుగు వేయబోం
హైకోర్టు పరిధి దాటినట్లు అనిపిస్తోంది
సీఆర్డీఏ, రాజధానిపై ఇచ్చిన తీర్పు శాసనసభ అధికారాల్ని ప్రశ్నించేలా ఉంది
రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం చెబుతుంటే.. ఆ అధికారం లేదని హైకోర్టు ఎలా అంటుంది?
నెల రోజుల్లో మౌలిక వసతులు, 6 నెలల్లో రాజధాని నిర్మించేయాలని న్యాయ స్థానాలు నిర్దేశించలేవు
ఫలానా చట్టం చేయొద్దని చట్టసభల్ని నియంత్రించలేవు
శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు
ఈనాడు - అమరావతి
‘పరిపాలన వికేంద్రీకరణ మా విధానం.. రాజధానులపై నిర్ణయం మా హక్కు. అది మా బాధ్యత. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం’ అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ‘అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకురావడంతోపాటు రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాల్ని కాపాడతాం. వారికి అండగా నిలుస్తాం. అసాధ్యమైనవి సాధ్యం చేయాలని ఏ వ్యవస్థలు, న్యాయస్థానాలు నిర్దేశించలేవు. ఈ వ్యవహారంపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. రాజ్యాంగం ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం మూడు రాజధానుల చట్టమే లేదు. దాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయినా ఆ అంశంపై హైకోర్టు తీర్పు ఎలా ఇచ్చింది?’ అని జగన్ ప్రశ్నించారు. మూడు రాజధానులపై భవిష్యత్తులో మరింత మెరుగైన చట్టాన్ని తీసుకొస్తామని.. అది రాకూడదంటూ ముందే నిరోధిస్తూ న్యాయస్థానాలు ఆదేశించజాలవని, శాసన వ్యవస్థను నియంత్రించలేవని పేర్కొన్నారు. ఫలానా చట్టం చేయొద్దని చట్ట సభలను న్యాయస్థానాలు నియంత్రించలేవని చెప్పారు. శాసనసభలో గురువారం పరిపాలన వికేంద్రీకరణ అంశంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
‘రాష్ట్ర రాజధాని, సీఆర్డీఏ చట్టానికి సంబంధించి ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు.. శాసనసభ అధికారాలను ప్రశ్నించేలా, వాటిని హరించేలా ఉంది. ఈ తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకు పూర్తి విరుద్ధం.
* రాజ్యాంగం ప్రకారం చూసినా రాజధాని వ్యవహారంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. రాజధాని ఎక్కడ ఉండాలనేది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనని అధికరణ-3ను ప్రస్తావిస్తూ కేంద్రమే హైకోర్టులో అఫిడవిట్ వేసింది. హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనే వాదనను తిరస్కరిస్తూ గతంలో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నగరాల్ని ఆయా రాష్ట్రాలే నిర్ణయిస్తాయని, కేంద్రానికి అందులో ఎలాంటి పాత్ర లేదని తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో కేంద్రం సమాధానం ఇచ్చింది.
* రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రం స్పష్టంగా చెబుతున్నప్పుడు ఆ అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టు అనడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.
అవాంఛనీయ సంఘర్షణే
రాజధాని వికేంద్రీకరణ విషయంలో చట్టసభకు తీర్మానం చేసే అధికారం లేదని హైకోర్టు తీర్పులో చెప్పారు. ఇలా అనడం గౌరవ న్యాయస్థానం తన పరిధి దాటి శాసన వ్యవస్థ వ్యవహారాల్లోకి ప్రవేశించడమే. ఇది అవాంఛనీయమైన సంఘర్షణే.
* ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వాటి పరిధిలో వాటి అధికారాలకు లోబడి పని చేయాలి. మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా, మరో వ్యవస్థపై పెత్తనం చేయకుండా పని చేయాలని రాజ్యాంగంలో ఉంది. అయితే రాష్ట్ర హైకోర్టు పరిధి దాటినట్లు అనిపిస్తోంది. అందుకే ఆ అంశంపై సభలో చర్చిస్తున్నాం.
* హైకోర్టును, దాని అధికారాల్ని అగౌరవపరచడానికి ఈ చర్చ పెట్టలేదు. మాకు హైకోర్టు పట్ల చాలా గౌరవం ఉంది. అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న గౌరవాన్ని, అధికారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత శాసన వ్యవస్థపై ఉంది. శాసన వ్యవస్థ కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఇది మనతో ఆగిపోయేది కాదు. ఎవరో అనుకూలంగా వ్యవహరిస్తే మనం ఇక్కడికి రాలేదు. ప్రజలు ఓటు ద్వారా ఎన్నుకుంటే మనమంతా ఇక్కడికి వచ్చాం. ఈ గౌరవాన్ని, ఈ అధికారాలను మనం కాపాడుకోలేకపోతే మనం ప్రశ్నించకపోతే ఆ తర్వాత.. శాసన వ్యవస్థకు అర్థమే లేకుండా పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పుడు ఈ అంశంపై మనం చర్చించకపోతే చట్టాలు ఎవరు చేస్తారు? శాసన వ్యవస్థ చేస్తుందా? న్యాయ వ్యవస్థ చేస్తుందా? అనేది చరిత్రలో ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది.
* చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థది. అది కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ పని కాదు. మంచి చట్టాలు తీసుకొస్తే ప్రజలు మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అవి వారికి నచ్చకపోతే అయిదేళ్లకోసారి ఓటు హక్కును వినియోగించుకుని ఇంటికి పంపేస్తారు. గత ప్రభుత్వం చేసిన విధానాలు, చట్టాలు ప్రజలకు నచ్చలేదు కాబట్టే.. మాకు మొత్తం 175కు గానూ 151 సీట్లు వచ్చాయి.
ఆచరణ సాధ్యం కాని తీర్పులిస్తారా?
* రాజధానిలో నెల రోజుల్లోగా కనీస మౌలిక వసతులు, ఆరు నెలల్లోగా మిగతా నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇది సాధ్యమేనా? ఆచరణ సాధ్యం కాని విధంగా తీర్పు ఉండకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అందుకు విరుద్ధంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
* రాజధాని నగర బృహత్ ప్రణాళికను రూపొందించి ఆరేళ్లైంది. అందులోని అంశాలన్నీ గ్రాఫిక్స్ రూపంలో కాగితాలపైనే ఉన్నాయి. 2016 ఫిబ్రవరిలో 20 ఏళ్ల కాలపరిమితితో ఈ బృహత్ ప్రణాళికను నోటిఫై చేశారు. ప్రతి అయిదేళ్లకోసారి సమీక్షించాలని అందులో రాశారు. 20 ఏళ్లలో అది అమలు కాదనే విషయం అందరికీ తెలుసు. బృహత్ ప్రణాళిక ప్రకారం రాజధానిలో రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, విద్యుత్తు వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున 54 వేల ఎకరాలకు రూ.1.09 లక్షల కోట్లు కావాలని అప్పట్లో వారు అంచనా వేశారు. ఈ ఆరేళ్లలో అది గణనీయంగా పెరిగింది.
* పెరుగుతున్న ధరల్ని పరిగణనలోకి తీసుకుంటే రాజధాని నిర్మాణానికి కనీసం 40 ఏళ్లు పడుతుంది. హైదరాబాద్ సహా ఏ రాజధాని నగరాన్ని తీసుకున్నా ప్రస్తుతమున్న స్థితికి అవి చేరడం వెనుక శతాబ్దాల కృషి ఉంది.
వికేంద్రీకరణ మినహా మరో మార్గం లేదు..
* వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అందరి ఆత్మగౌరవం అందులో ఉంది. అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గం. అందరికీ మంచి చేసేందుకే ప్రభుత్వం ఉంది. ఈ చట్టసభకు సర్వాధికారాలతోపాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కాబట్టే వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. వికేంద్రీకరణ బాటలో సాగటం మినహా మరో మార్గం లేదు.
* అభివృద్ధి లేకపోవడంవల్ల తొలి దశ తెలంగాణ ఉద్యమం రాగా.. రాష్ట్ర విభజనకు దారితీసిన రెండోదశ ఉద్యమం అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్లే వచ్చిందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది. వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకూ న్యాయం జరుగుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. గతంలో మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు మా ప్రభుత్వం చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నాం.
న్యాయస్థానాలు ఈ డొమైన్లోకి రాకూడదు
చట్టసభల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అయిదేళ్లకోసారి స్క్రూటినికీ వెళ్లాలి. ధర్మాన ప్రసాదరావు అన్నట్లు గత ప్రభుత్వం చేసిన విధానాలు, చట్టాలు ప్రజలకు నచ్చలేదు కాబట్టే ఈ రోజు మాకు 151 అంటే 86% సీట్లు ఇచ్చారు. శాసనసభలో ఉన్నవారిని, పార్లమెంటులో ఉన్నవారిని అయిదేళ్లకోసారి ప్రజలు పరీక్షిస్తారు. వారు అర్హత సాధించారా.. లేదా అన్న విషయంలో మార్కులిస్తారు. ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం. న్యాయస్థానాలు ఈ డొమైన్లోకి రాకూడదు’ అని జగన్ వ్యాఖ్యానించారు.
రాజధాని వ్యవహారంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. తనకు పాత్ర ఉందని, అది తన అధికారమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు. ఏ కోర్టులోనూ అలా వాదించలేదు. రాజధాని ఎక్కడ ఉండాలనేది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనని పలు సందర్భాల్లో స్పష్టం చేసింది.
అమరావతిలో నెల రోజుల్లోగా రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్తు, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని, 6 నెలల్లోగా అయిదారు లక్షల కోట్లు ఖర్చు చేసి రాజధాని కట్టేయాలని న్యాయస్థానాలు చెప్పలేవు. ఇలా అసాధ్యమైన కాల వ్యవధుల్ని ఏ న్యాయస్థానాలూ నిర్దేశించలేవు.
శాసనసభలో ముఖ్యమంత్రి జగన్
రాజధాని ప్రాంతం రాష్ట్రంలో 0.000001 శాతమే
2016 నుంచి 2019 మధ్య చంద్రబాబు అమరావతి కోసం కేవలం రూ.5వేల కోట్లే ఖర్చు చేశారు. ఏ ప్రభుత్వానికైనా అంతకంటే ఎక్కువ ఖర్చుపెట్టడం సాధ్యం కాని పని.
* రాజధాని ప్రాంతం రాష్ట్రం మొత్తంలో 0.000001 శాతమే. 99.999999 శాతం మిగతా ప్రాంతం ఉంది. అభివృద్ధి, సంక్షేమం పనులు చూసుకుంటూ రాజధానిపై భారీగా ఖర్చు పెట్టడం ఏ ప్రభుత్వానికైనా ఎంతవరకు సాధ్యం? మిగతా రాష్ట్రమంతా సంక్షేమం, అభివృద్ధి వైపు చూస్తోంది. వాటికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా కూడా. ఇది రాజధాని అని చెప్పి.. ఈ ఒక్కచోటే డబ్బులు పెట్టటం సరికాదు.
విజయవాడలోనో, గుంటూరులోనో రాజధాని కట్టేసుంటే దానంతట అదే పెరిగేది
ఇక్కడ కూర్చుని భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఓట్ల కోసం ఊహాజనితమైన గ్రాఫిక్స్ చూపించో.. భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం వల్లో రాజకీయ నాయకుడు ఎప్పుడూ నాయకుడు కాలేడు. విజన్ ఉండాలి. అది ప్రజలకు వివరించగలగాలి. నిజంగా నాకు సాధ్యపడితే ఎందుకు చేయను? కానీ సాధ్యమయ్యే పరిస్థితి ఉందా?
* చంద్రబాబుకు నిజంగా అమరావతి ప్రాంతంపై ప్రేమ లేదు. ఆయనకు ప్రేమ ఉంటే విజయవాడలోనో, గుంటూరులోనో రాజధాని వచ్చేది. ఆ నగరాల్లో 500 ఎకరాల్లోనో, వెయ్యి ఎకరాల్లోనో కట్టాల్సినవి కట్టేసి ఉంటే రాజధాని దానంతట అదే పెరిగేది. కానీ చంద్రబాబు అలా చేయలేదు. తాను, తన బినామీలు భూములు ముందుగానే కొనుక్కుని ఆయా నగరాలకు 40కి.మీ. దూరంలోని ప్రాంతాన్ని రాజధాని అంటున్నారు. అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవు.
* నాకు ఈ ప్రాంతంపై నిజంగా ప్రేమ ఉంది. అందుకే ఇక్కడే ఇల్లు కట్టుకున్నా. ఇక్కడే శాసన రాజధాని కొనసాగుతుందని చెబుతున్నా. నాకు ఈ ప్రాంతంపై ప్రేమ లేకపోతే శాసన రాజధాని ఇక్కడే ఉండాలని ఎందుకు తాపత్రయపడతాను?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్