liquor: జగన్ హయాంలో 103 మద్యం బ్రాండ్లకు అనుమతి
వైకాపా ప్రభుత్వం 103 రకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చిందని, శాసనసభలో చర్చ పెడితే వివరాలను వెల్లడిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
అయ్యన్నపాత్రుడి పేరుతో ఉన్న డిస్టిలరీని విజయసాయి ఎప్పుడో తీసుకున్నారు
సీఎంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేల ధ్వజం
ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం 103 రకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చిందని, శాసనసభలో చర్చ పెడితే వివరాలను వెల్లడిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాల ప్రకారం జగన్ సీఎం అయ్యాకే కొత్త బ్రాండ్లకు అనుమతులిచ్చారని వివరించారు. మంగళగిరిలో అచ్చెన్నాయుడితోపాటు ఎమ్మెల్యేలు సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, మంతెన రామరాజు గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘శాసనసభలో సీఎం బుధవారం చదివిన బ్రాండ్లన్నీ మద్యం తయారీ కంపెనీలు చేసుకున్న దరఖాస్తుల్లో ప్రస్తావించిన వాటి పేర్లు. మాకు ఫలానా బ్రాండ్, ఫలానా పేరుతో కావాలంటూ మద్యం తయారీ కంపెనీలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ఇవన్నీ చంద్రబాబు రాష్ట్రంలో అమ్మించేశారన్నట్లుగా సీఎం సభలో పచ్చి అబద్ధాలు చెప్పారు’ అని వారు మండిపడ్డారు. ‘తెదేపా నాయకులు నడుపుతున్నారని చెబుతున్న డిస్టిలరీలను అధికారంలోకి రాగానే సీఎం లాగేసుకున్నారు. అయ్యన్నపాత్రుడి పేరుతో ఉన్న డిస్టిలరీని విజయసాయిరెడ్డి ఎప్పుడో తీసేసుకున్నారు’ అని వివరించారు.
‘తెదేపా హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన సీఎం జగన్.. తెదేపా నేతలు నడుపుతున్నారని చెబుతున్న మద్యం తయారీ కంపెనీలను ఎందుకు రద్దు చేయలేదు? తెదేపా నాయకుల పేర్లతో ఉన్నాయని చెబుతూ తన మనుషులతో వ్యాపారం చేయిస్తున్నారు. సభలో సీఎం అన్నీ అబద్ధాలే చెప్పారు. తెదేపా నేతలు అయ్యన్న పాత్రుడు, సుధాకర్ యాదవ్, ఆదికేశవులు నాయుడు పేర్లతో ఇప్పుడు మద్యం కంపెనీలు లేవు. తెదేపా నాయకులను ఇళ్లలో నుంచి బయటకే రానివ్వని సీఎం.. మద్యం అమ్ముకోనిస్తారా?’ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
సీఎం బినామీలకు కాకుండా ఇతరులకు ఒక్క డిస్టిలరీయైనా ఉందా?
‘సీఎం బినామీలవి కాకుండా ఇతరులకు చెందిన ఒక్క డిస్టిలరీ అయినా రాష్ట్రంలో ఉందా? వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న జగన్రెడ్డి.. తన సంపాదనకే కొత్త మద్యం పాలసీ తెచ్చారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికొచ్చిన ఒకటీ రెండు డిస్టిలరీలను ఇప్పుడు జగన్రెడ్డి బినామీలే నడుపుతున్నారు. పేదలకిస్తున్న బియ్యాన్ని వైకాపా నేతలే కొని వాటి నుంచే మద్యం తయారు చేస్తున్నారు. మద్యం తయారీ, అమ్మకాలు, సరఫరా, హాలోగ్రామ్ లేబుళ్లు అంటించడం సహా అంతా సీఎం మనుషులే చేస్తున్నారు’ అని వెల్లడించారు.
నమ్మకస్థులైన అధికారులతో మద్యం వ్యాపారం
‘తనకు నమ్మకస్థులైన అధికారులను ఇతర రాష్ట్రాల నుంచి సీఎం రప్పించి మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. వాసుదేవరెడ్డికి అర్హత లేకపోయినా ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరును చేశారు. సత్యప్రసాద్కు సదరు కార్పొరేషన్లో కీలక బాధ్యతలు అప్పగించారు. మద్యం సరఫరా కాంట్రాక్టులన్నీ వైకాపా ఎంపీ మిథున్రెడ్డి బంధువులే నిర్వహిస్తున్నారు. అక్రమ మద్యాన్ని నివారించేందుకు చంద్రబాబు తీసుకొచ్చిన హాలోగ్రామ్ విధానాన్ని జగన్రెడ్డి తొలగించారు. మద్యం దుకాణదారులు, తయారీదారులు, సరఫరాదారులకు విధిగా జె-ట్యాక్స్ కట్టాలనే షరతు పెట్టారు. రూ.10, రూ.12కి తయారయ్యే క్వార్టర్ మద్యం సీసాను రూ.250 నుంచి రూ.300కు అమ్ముతున్నారు. పేదల ఆకలి తీర్చే రేషన్ బియ్యాన్ని కిలో రూ.20 చొప్పున ప్రభుత్వంలోని వారే మద్యం తయారీ కంపెనీలకు తరలిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా వైకాపావారే పేదలనుంచి రేషన్ బియ్యాన్ని కొంటున్నారు’ అని అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు ఆరోపించారు.
భర్తలతో తాగించి భార్యకు చేయూతనందిస్తారా?
‘మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుతానని ఎన్నికలకు ముందు జగన్రెడ్డి ఎందుకు చెప్పలేదు? భర్త తాగితేనే భార్యకు చేయూత, తండ్రి జేబుగుల్ల చేసుకుంటేనే బిడ్డకు అమ్మ ఒడి ఇస్తానని ఎందుకు అనలేదు?’ అని వారు ప్రశ్నించారు.
ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రాణాలకు తెగించి సీఎంతో పోరాటం
‘మా ప్రాణాలకు తెగించి మరీ ప్రజల ప్రాణాలు కాపాడటానికి సీఎంతో పోరాడుతున్నాం. మద్యం అమ్మకాలు, తయారీ, ముఖ్యమంత్రికి అందుతున్న రూ.10వేల కోట్ల వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించమంటే మమ్మల్ని బయటకు పంపారు. అవాస్తవాలు అవలీలగా చెప్పడంలో ముఖ్యమంత్రిని మించినవారు భూమ్మీదే ఎవరూ ఉండరు’ అని తెదేపా ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.
జగన్కు ఐదేళ్లలో రూ.10వేల కోట్ల ఆదాయం
‘మద్యం వ్యాపారంతో జగన్రెడ్డి ఒక్కరికే ఐదేళ్లలో రూ.10వేల కోట్ల ఆదాయం రానుంది. ఇప్పటికే చాలావరకు చేరింది. అదెలాగంటే.. ప్రభుత్వ లెక్కల్లో చూపుతున్న మద్యం అమ్మకాలు కాకుండా వ్యక్తిగత సంపాదనకు తన వారితో అమ్మిస్తున్న మద్యం వేరే ఉంది. రోజుకు ఎన్ని కేసుల మద్యం అమ్మకాలు ప్రభుత్వ లెక్కల్లో చూపుతున్నారో.. ఎన్ని కేసుల మద్యం జగన్రెడ్డి ఖజానా నింపేందుకు అమ్ముతున్నారో బయటపెడతాం. మద్యం దుకాణాలు, తయారీ కంపెనీలను సీఎం తన గుప్పిట్లో పెట్టుకున్నారు. అవన్నీ తన చేతిలో ఉంటేనే ఐదేళ్లలో రూ.10వేల కోట్లు వస్తాయని ముఖ్యమంత్రి లెక్కలేశారు. జాతిపిత పుట్టిన రోజునాడే కొత్త మద్యం పాలసీ తెచ్చిన ఘనత సీఎంది’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా