Andhra News: శవాలకు కుట్లేసే పోస్టులకూ విద్యావంతుల క్యూ!
ఉద్యోగ ప్రకటనల కోసం విద్యావంతులు ఎంతగా నిరీక్షిస్తున్నారో తెలియాలంటే తాజాగా పోస్టుమార్టం గదిలో వైద్యుడికి సహాయకుడిగా ఉండేందుకు నిరుద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులే సాక్ష్యం. ఈ పోస్టుకు పదో
న్యూస్టుడే, రాజమహేంద్రవరం (వైద్యం): ఉద్యోగ ప్రకటనల కోసం విద్యావంతులు ఎంతగా నిరీక్షిస్తున్నారో తెలియాలంటే తాజాగా పోస్టుమార్టం గదిలో వైద్యుడికి సహాయకుడిగా ఉండేందుకు నిరుద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులే సాక్ష్యం. ఈ పోస్టుకు పదో తరగతే విద్యార్హత. పైగా ఏడాదిపాటు ఒప్పంద ప్రాతిపదికన పని చేయాలి. రూ.15వేల వరకు వేతనమిస్తారు. ఈ ఉద్యోగాల కోసం డిగ్రీ, పీజీ చదివినవారూ పోటీపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల ఎంపికలో భాగంగా చేపట్టిన పోస్టుమార్టం సహాయకుల పోస్టుల కోసం 150మందికి పైగా పట్టభద్రులు, ఆపై చదివినవారు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 25 పోస్టులకుగానూ మొత్తం 250 మందికిపైగా పోటీ పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోని శవాగారాల్లో మృతదేహాలకు వైద్యుడు పోస్టుమార్టం చేయడానికి వీరు సాయం చేస్తారు. శరీర భాగాలను కోయడం, పోస్టుమార్టం పూర్తయ్యాక వాటికి కుట్లు వేయడం వంటివి వారి విధులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్