Nara Lokesh: జగన్ విశాఖలో ఎంత త్వరగా కూర్చొంటే.. ఉత్తరాంధ్రలో తెదేపాకు అన్ని ఎక్కువ సీట్లు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంత త్వరగా విశాఖపట్నంలో కూర్చుని పరిపాలిస్తే ఉత్తరాంధ్రలో తమ పార్టీకి అన్ని ఎక్కువ సీట్లు పెరుగుతాయని తెదేపా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు.
విజయసాయిరెడ్డి దెబ్బకు అక్కడ భూకబ్జాలు, అరాచకాలు
జగన్ అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు
మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేశ్
ఈనాడు - అమరావతి
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంత త్వరగా విశాఖపట్నంలో కూర్చుని పరిపాలిస్తే ఉత్తరాంధ్రలో తమ పార్టీకి అన్ని ఎక్కువ సీట్లు పెరుగుతాయని తెదేపా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. విజయసాయిరెడ్డి దెబ్బకు ఇప్పటికే విశాఖలో అరాచకం, భూకబ్జాలు పెరిగిపోయాయని.. ముఖ్యమంత్రి వెళ్తే ఇవి మరింత అధికమవుతాయని వ్యాఖ్యానించారు. ఆ నగరంలో 1,200 గజాల స్థలం కలిగిన ప్రతి ఒక్కరూ విజయసాయిరెడ్డికి భయపడుతున్నారని, ఇప్పుడు సీఎం అక్కడికి వెళ్తే ఆయనకూ భయపడతారని వ్యాఖ్యానించారు. శాసనమండలి లాబీల్లో శుక్రవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పరిపాలన అంతా ఒకేచోట నుంచి కొనసాగించి అభివృద్ధిని వికేంద్రీకరించాలనేది తెదేపా ప్రభుత్వ విధానమని.. అందులో భాగంగానే తమ హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టి 13 జిల్లాల్లోనూ పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సైతం ఐటీ కంపెనీ ఏర్పాటుకు భూములు కేటాయించామని వివరించారు. తెదేపా హయాంలో 5.40 లక్షల ఉద్యోగాలు కల్పించామని.. అవన్నీ జిల్లాల్లో వచ్చాయే తప్ప ఒక్క ఉద్యోగం అమరావతి ప్రాంతానికి రాలేదని అన్నారు. నారా లోకేశ్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే!
పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు..
‘జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను రద్దు చేశారు. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పెరిగాయి. పీపీఏల రద్దు వల్లే సుజలాన్ కంపెనీ ఎన్సీఎల్టీని ఆశ్రయించాల్సి వచ్చింది. విశాఖపట్నంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు మా హయాంలో అన్నీ సిద్ధం చేశాం. వైకాపా అధికారంలోకి వచ్చాక అది ముంబయికి వెళ్లిపోయింది. ఆ డేటా సెంటర్ ఏర్పాటై ఉంటే 70 వేల ఉద్యోగాలు వచ్చేవి. విశాఖ రూపురేఖలే మారిపోయి ఉండేవి. ‘గుజరాత్ రాష్ట్రం పరిశ్రమలు, కంపెనీలు రావడంతో అభివృద్ధి చెందిందా లేక కొత్త జిల్లాలు, వ్యవస్థల విధ్వంసంతో అభివృద్ధి చెందిందా? జగన్ చేతగాని వ్యక్తి కాబట్టే తన వైఫల్యాల్ని కోర్టులు, ప్రతిపక్షాలపై నెడుతున్నారు. అమరావతి నిర్మాణం ఒక్క రోజులోనో..ఒక్క సంవత్సరంలోనో పూర్తి కాదు. ఏటేటా అభివృద్ధిని పెంచుకుంటూ పోవాలి. అది ఎలా చేయాలో జగన్కు తెలియదు.
గుంతలు పూడ్చలేని వారు మూడు రాజధానులు కడతారా?
రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని వారు మూడు రాజధానులు కడతారా? అమరావతిని రాజధానిగా నిర్ణయించిన రోజున జగన్ విశాఖపట్నంలోనో, విజయవాడలోనో రాజధాని పెడదామని ఎందుకు చెప్పలేదు? ఆ రోజు అసెంబ్లీలో అమరావతికి మద్దతు పలికి.. ఇవాళ మరో మాట మాట్లాడటం మోసం కాదా? అధికారులు వారంలో మూడు రోజులు కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తోందని.. శాసనమండలిలో మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం వ్యాఖ్యానించారు. సచివాలయం, హైకోర్టు ఒకే చోట ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే.. సచివాలయాన్ని విశాఖలో, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తే అధికారులు ఎక్కడికి తిరగాలి? ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారితే పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి ఇప్పుడు శ్రీలంక ఆర్థిక పరిస్థితి మాదిరిగా మారిపోయింది
నాన్న బుడ్డి వల్లే అమ్మఒడి అని సీఎంతో చెప్పించాం..
మనుషులే చనిపోతుంటే బడ్జెట్ గురించి మాట్లాడాలంటారు. కల్తీ సారాకు 42 మంది చనిపోతే అది చర్చించే అంశం కాదా? అయినా వాటిని సహజ మరణాలుగా ముఖ్యమంత్రి ప్రకటించడం దారుణం. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ అంశంపై గట్టిగా పోరాడాం కాబట్టే ముఖ్యమంత్రి నోరు విప్పారు. నాన్న బుడ్డి వల్లే అమ్మఒడి ఇవ్వగలుగుతున్నామని బహిరంగంగానే ఆయన చెప్పారు. వైకాపా ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయం ద్వారానే మనుగడ సాగిస్తోందని ముఖ్యమంత్రి నోటితోనే చెప్పించాం.. ఇదే మేము సాధించిన విజయం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటాం’ అని లోకేశ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు