Padma Awards 2022: 65 మందికి పద్మ పురస్కారాల ప్రదానం

వివిధ రంగాల్లో సేవలందించిన 65 మందికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు,.....

Updated : 29 Mar 2022 05:54 IST

దిల్లీ: వివిధ రంగాల్లో సేవలందించిన 65 మందికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌కు మరణాంతరం ప్రకటించగా.. ఆయన తనయుడు, ఎంపీ రాజీవ్‌ సింగ్‌ స్వీకరించారు. శాస్త్రీయ సంగీత గాయని ప్రభ ఆత్రే కూడా పద్మవిభూషణ్‌ అందుకున్నారు. కరోనా వైరస్‌కు దేశీయ టీకా ‘కొవాగ్జిన్‌’ను తయారుచేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులిద్దరికీ సంయుక్తంగా పద్మభూషణ్‌పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు. బెంగాలీ నటుడు విక్టర్‌ బెనర్జీ కూడా పద్మభూషణ్‌ అందుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌లకు పద్మభూషణ్‌ ప్రకటించగా.. వారు కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఒలింపిక్స్‌లో దేశానికి తొలి వ్యక్తిగత బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా పద్మశ్రీ అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న తెలుగువారిలో ప్రముఖసినీనటి షావుకారు జానకి, కూచిపూడి నృత్యకారిణి పద్మజారెడ్డి, కోయ గిరిజనగాయకుడు రామచంద్రయ్య ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు