TDP: రైతులు, పేదలకు న్యాయం చేసేది తెలుగుదేశమే
రాష్ట్రంలో పేదరికం పోవాలన్నా, సామాన్య ప్రజల కష్టాలు తీరాలన్నా తెదేపా అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులకు, పేదలకు న్యాయం చేసేది తెలుగుదేశమేనని స్పష్టం చేశారు. ‘మీరు ఎక్కడున్నా జన్మభూమి అభివృద్ధికి చేస్తున్న కృషి మరవలేనిది.
వైకాపా పాలనలో రాష్ట్రం ఉనికినే కోల్పోయే పరిస్థితి
వివిధ దేశాల్లోని తెదేపా నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పేదరికం పోవాలన్నా, సామాన్య ప్రజల కష్టాలు తీరాలన్నా తెదేపా అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులకు, పేదలకు న్యాయం చేసేది తెలుగుదేశమేనని స్పష్టం చేశారు. ‘మీరు ఎక్కడున్నా జన్మభూమి అభివృద్ధికి చేస్తున్న కృషి మరవలేనిది. రాబోయే రోజుల్లోనూ పుట్టిన ప్రాంత అభివృద్ధికి పునరంకింతం కావాలి. తెదేపా బలోపేతానికి సహకారం అందించాలి’ అని వివిధ దేశాల్లోని తెలుగువారికి విజ్ఞప్తి చేశారు. తెదేపా 40 వసంతాల వేడుకలను 40 దేశాల్లోని 200 నగరాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో వీడియో సమావేశం ద్వారా మాట్లాడారు. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు హైదరాబాద్ను నాలెడ్జి హబ్గా తయారు చేసేందుకు విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డు తదితర మౌలిక సౌకర్యాలను కల్పించాం. దీంతో సంపద సృష్టి జరిగింది. రైతులు, పేదల పిల్లలు కూడా ప్రపంచం నలుమూలలకు వెళ్లి స్థిరపడ్డారు’ అని పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన తర్వాత అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. తెలుగుజాతి పూర్వవైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని పనిచేశా. దేశ విదేశాల్లోని ఎంతోమంది చేయూత అందించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక అమరావతితో పాటు అన్ని రంగాలనూ ధ్వంసం చేసే కార్యక్రమాలు చేపట్టింది. దీంతో రాష్ట్రం ఉనికినే కోల్పోయే పరిస్థితి తలెత్తింది’ అని విమర్శించారు. ‘తెలుగువారు ఎక్కడున్నా మాతృభూమిపై ఉండే ప్రేమ వెలకట్టలేనిది. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నారు. ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా గ్రామాల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు’ అని ప్రశంసించారు.
జన్మభూమి సేవకు పునరంకితమవుతాం
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు వివిధ దేశాల్లో ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో తెదేపా కార్యకర్తలు, అభిమానులు జెండాలు చేతపట్టి ‘కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా’ అనే పాటలతో సందడి చేశారు. అధిక సంఖ్యలో కార్లతో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు సమష్టిగా పని చేస్తామని వివిధ దేశాల్లోని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు పాలనలో ప్రజా జీవితం దుర్భరంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందని.. వీటన్నింటినీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెదేపాను అధికారంలోకి తేవాల్సిన అవసరం ఉందని, అప్పటివరకూ విశ్రమించబోమని ప్రతిజ్ఞలు చేశారు.
* 40 వసంతాల వేడుకలను అమెరికాలోని అట్లాంటా, ఆస్టిన్, బే ఏరియా, బోస్టన్, షికాగో, డాలస్, డెట్రాయిట్, హ్యూస్టన్, న్యూజెర్సీ తదితర 40 నగరాల్లో వైభవంగా నిర్వహించారు. తెదేపా సీనియర్ నాయకుడు కోమటి జయరాం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అభిమానులు హాజరయ్యారు. షికాగోలో బీద రవిచంద్ర, డాలస్లో కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ముళ్లపూడి బాపిరాజు, న్యూజెర్సీలో మన్నవ మోహన్కృష్ణ, కలపటపు రామ్ప్రసాద్, షార్లెట్లో ఆరిమిల్లి రాధాకృష్ణ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
* ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం మాత్రమే నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షిస్తోందని అమెరికాలోని డెట్రాయిట్ తెదేపా కౌన్సిల్ సభ్యులు కొనియాడారు.
* యూకే, యూరోప్లోని 40 పైగా నగరాల్లో ఎన్నారై కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. హాట్ఫీల్డ్లో జరిగిన కార్యక్రమంలో తెదేపా ఆవిర్భావం నుంచి వివిధ వర్గాల సంక్షేమానికి చేసిన కృషిని శివరామ్ కూరపాటి వివరించారు.
* ఐర్లండ్లో మురళి రాపర్ల, జర్మనీలో తిట్టు మద్దిపట్ల, శివ, పారిస్లో మహేశ్ గొపునూరు, జెనాలో పవన్ జాగర్లమూడి, అనుదీప్ పచ్చాల, బెల్పాస్ట్లో దినేశ్ కుదరవల్లి, బ్రసెల్స్లో దినేశ్వర్మ, పోలండ్లో చందు తదితరులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.