7న మంత్రిమండలి భేటీ

రాష్ట్ర మంత్రిమండలి ఏప్రిల్‌ 7న సమావేశం కానుంది. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇదే ప్రస్తుత మంత్రిమండలి చివరి భేటీ కానుంది. ఆ సమావేశంలో మంత్రిమండలిలో కొనసాగేవారెవరు? వైదొలగనున్నది ఎవరెవరనే విషయాన్ని

Updated : 30 Mar 2022 08:58 IST

8న సీఎం గవర్నర్‌ను కలిసే అవకాశం
11న కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ?

ఈనాడు, అమరావతి: రాష్ట్ర మంత్రిమండలి ఏప్రిల్‌ 7న సమావేశం కానుంది. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇదే ప్రస్తుత మంత్రిమండలి చివరి భేటీ కానుంది. ఆ సమావేశంలో మంత్రిమండలిలో కొనసాగేవారెవరు? వైదొలగనున్నది ఎవరెవరనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టంచేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి 7న జరిగే సమావేశానికి ఎజెండా కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వశాఖల అధిపతులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీనిపై నేడోరేపో అధికారిక వర్తమానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపే అవకాశముంది.

ప్రస్తుత మంత్రిమండలిలోని మంత్రుల్లో తొలగించే వారితో వ్యక్తిగతంగా రాజీనామా చేయించి వాటన్నింటినీ కలిపి గవర్నర్‌కు పంపడం లేదా కేబినెట్‌ హెడ్‌గా తన మంత్రివర్గంలోని కొందరు మంత్రులను మార్చుకుంటున్నానని వివరిస్తూ... వారి పేర్లతో కూడిన లేఖను గవర్నర్‌కు ముఖ్యమంత్రే అందించవచ్చు. వాటిని ఆమోదిస్తూ ఆయా ఖాళీలను గవర్నర్‌ నోటిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆయా ఖాళీల్లో కొత్తగా నియమించుకోనున్న వారి పేర్ల జాబితాను ముఖ్యమంత్రి గవర్నర్‌కు సమర్పిస్తారు. దాన్ని ఆమోదించి, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సమయాన్నివ్వాలని గవర్నర్‌ను కోరతారు. 7న మంత్రిమండలి భేటీ జరగనుండగా... మరుసటి రోజు 8న ముఖ్యమంత్రి జగన్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవననున్నట్లు సీఎంవో సమాచారం. దీన్నిబట్టి 8న గవర్నర్‌ను కలిసినప్పుడు రాజీనామా చేస్తున్న మంత్రుల జాబితాను, అలాగే కొత్తగా కేబినెట్‌లోకి తీసుకోనున్న వారి జాబితాను గవర్నర్‌కు ముఖ్యమంత్రి సమర్పించే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏప్రిల్‌ 11న మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ జరగవచ్చనే వాదనకు ఈ పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని