Andhra News: కొత్త మంత్రులెవరు..?
దూకుడు.. సీనియారిటీ.. వైకాపా ఆవిర్భావం నుంచి, అంతకంటే ముందు నుంచి వెంట నిలిచినవారు.. 2014-19 మధ్య ఎంత ఒత్తిడి వచ్చినా పార్టీని వీడని ఎమ్మెల్యేలు.. ఇలా నాలుగు విభాగాలుగా
11న ఉదయం 11.31 గంటలకు నూతన మంత్రిమండలి!
26 జిల్లాల్లో ఆ 25 మంది ఎవరు?
ఆశావహుల్లో పెరిగిన ఉత్కంఠ
ఈనాడు - అమరావతి
దూకుడు.. సీనియారిటీ.. వైకాపా ఆవిర్భావం నుంచి, అంతకంటే ముందు నుంచి వెంట నిలిచినవారు.. 2014-19 మధ్య ఎంత ఒత్తిడి వచ్చినా పార్టీని వీడని ఎమ్మెల్యేలు.. ఇలా నాలుగు విభాగాలుగా ఆశావహులను క్రోడీకరించి వారిలో కొందరిని మంత్రిమండలిలోకి తీసుకునేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు వైకాపా వర్గాల్లో చర్చ సాగుతోంది. వీరే కాకుండా సామాజిక, రాజకీయ సమీకరణలో భాగంగా తీసుకునేవారూ ఉంటారని చెబుతున్నారు.
జిల్లాకు ఒకరు...
మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు ఏప్రిల్ 11న ఉదయం 11.31 గంటలకు ముహూర్తం ఖరారైనట్లు అధికార పార్టీ వర్గాల కథనం. జిల్లాకు ఒక మంత్రి ప్రాతిపదికను అమలుచేసే అవకాశమున్నట్లు సమాచారం. సామాజిక, రాజకీయ సమీకరణల దృష్ట్యా దీనికి అతీతంగానూ కొందరిని తీసుకోవచ్చనే చర్చ కూడా ఉంది. అప్పుడు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఎంపిక చేస్తారని అంటున్నారు. సీనియారిటీపరంగా ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి వంటి నేతల పేర్లు పరిశీలనలోకి తీసుకోవచ్చని వైకాపా నేతలు అంటున్నారు. ప్రాతిపదికేంటి? ఉన్నవారిలో ఎవరిని తొలగిస్తారు? కొత్తగా ఎవరు మంత్రిమండలిలోకి వస్తారనే విషయాలపై సీఎం ఇప్పటికీ తన ఆలోచనను ఎవరి దగ్గరా బయట పెట్టలేదని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
జిల్లాల వారీగా ఆశావహులెవరు?
శ్రీకాకుళం: జిల్లా నుంచి ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు ఉండగా.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఇక్కడినుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కృష్ణదాస్, అప్పలరాజులో ఒకరిని మంత్రిమండలిలో కొనసాగించవచ్చనే ప్రచారం ఉంది. అదే జరిగితే ఈ జిల్లాలో కొత్తగా ఎవరికీ మంత్రి పదవి దక్కబోదు. ఇద్దరినీ తప్పిస్తే వేరొకరికి పదవి దక్కే అవకాశముంది. తమ్మినేని సీతారాం మంత్రిమండలిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. శాసనసభాపతి పదవికి ధర్మాన కృష్ణదాస్, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావులలో ఒకరి పేరును పరిశీలిస్తున్నారన్న ప్రచారముంది. వీరిలో ఒకరికి సభాపతి స్థానం ఇస్తే తమ్మినేని పేరు మంత్రి పదవి పరిశీలనకు రావచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ మహిళలకు ప్రాధాన్యమివ్వాలనుకుంటే రెడ్డి శాంతి పేరు పరిశీలించే అవకాశం ఉంటుందని, అప్పుడు సీతారాం సభాపతిగానే కొనసాగాల్సి ఉంటుందని చెబుతున్నారు.
విజయనగరం: ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణను తప్పించే పరిస్థితి వస్తే.. కోలగట్ల వీరభద్రస్వామి, కంబాల జోగులు పేర్లు పరిశీలనకు రావొచ్చు. విజయవాడకు చెందిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ను తప్పిస్తే ఆయన సామాజికవర్గానికి చెందిన కోలగట్లకు అవకాశం రావచ్చనేది వైకాపా నేతల అంచనా. అలా కాదంటే ఎస్సీ కోటాలో జోగులుకు అవకాశం ఉండొచ్చన్న ప్రచారముంది. బొత్స కుటుంబంలోనే ఇవ్వాల్సి వస్తే అప్పలనరసయ్యకు అవకాశం ఉండొచ్చు.
మన్యం(పార్వతీపురం కేంద్రంగా): జిల్లాలో పీడిక రాజన్నదొర, విశ్వాసరాయి కళావతిలో ఎవరికో ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశముంది. మరోవైపు రాజన్నదొరను స్పీకర్ను చేయవచ్చన్న చర్చ కూడా ఉంది.
అల్లూరి సీతారామరాజు(పాడేరు): జిల్లాలో భాగ్యలక్ష్మి, నాగులపల్లి ధనలక్ష్మిలలో ఒకరికి మంత్రిమండలిలో స్థానం దక్కొచ్చు.
అనకాపల్లి: బీసీ కోటాలో బూడి ముత్యాలనాయుడు, కాపు కోటాలో గుడివాడ అమర్నాథ్ మధ్య పోటీ ఉంది. గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ కూడా రేసులో ఉన్నారు.
విశాఖపట్నం: అవంతి శ్రీనివాసరావు కాపు కోటాలో మంత్రిగా ఉన్నారు. బీసీకి ఇవ్వాలనుకుంటే తిప్పల నాగిరెడ్డికి అవకాశం రావచ్చు.
కాకినాడ: కాపు సామాజిక వర్గానికే చెందిన మంత్రి కన్నబాబు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాల మధ్య తీవ్ర పోటీ ఉంది. కన్నబాబును పక్కనపెడితే రాజాకే పదవి అనే ప్రచారం ఉంది.
తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం): కాపు కోటాలో జక్కంపూడి రాజా, ఎస్సీ కోటాలో తలారి వెంకట్రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
కోనసీమ(అమలాపురం): వేణుగోపాలకృష్ణ, పినిపె విశ్వరూప్ మంత్రులుగా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని కొనసాగించవచ్చన్న ప్రచారం ఉంది. ఇద్దరినీ తొలగిస్తే కొత్తగా ఇంకొకరికి పదవి దక్కుతుంది. జిల్లా నుంచి ఎస్సీకి ఇవ్వాలన్న ప్రతిపాదనే వస్తే కొండేటి చిట్టిబాబు పేరు పరిశీలించే అవకాశముంది. శ్రీకాకుళంలో మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజును తప్పిస్తే ఆయన సామాజికవర్గానికి చెందిన పొన్నాడ వెంకట సతీష్కుమార్కు అవకాశం ఉంటుంది.
ఏలూరు (పశ్చిమగోదావరి): ఉపముఖ్యమంత్రి ఆళ్ల నానిని పక్కన పెట్టాల్సి వస్తే.. పోటీలో ఎస్టీ కోటాలో తెల్లం బాలరాజు, ఎస్సీ కోటాలో ఎలీజా పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ కృష్ణా జిల్లాలో కొడాలి నానిని పదవి నుంచి తప్పిస్తే ఆయన సామాజికవర్గానికి చెందిన కొఠారు అబ్బయ్యచౌదరికి అవకాశం దక్కొచ్చన్న ప్రచారం ఉంది. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్అప్పారావు పేరునూ పరిశీలించే అవకాశముంది.
నరసాపురం: ప్రస్తుత మంత్రి శ్రీరంగనాథరాజును తొలగిస్తే అదే సామాజికవర్గానికి చెందిన ముదునూరి ప్రసాదరాజుకు అవకాశం రావచ్చనే ప్రచారముంది. ఇదే జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్పై నెగ్గిన, కాపు వర్గానికి చెందిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్నుంచి ప్రసాదరాజుకు గట్టి పోటీ ఉంది. బీసీ కోటాలో కారుమూరి వెంకటనాగేశ్వరరావు సైతం ఉన్నారు.
కృష్ణా: ఇక్కడి నుంచి కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా ఉన్నారు. వీరిలో ఎవరు కొనసాగినా ఇతరులకు అవకాశముండదు. ఇద్దరిని తొలగిస్తే.. సామాజిక సమీకరణల కోణంలో కొలుసు పార్థసారథి, జోగి రమేష్ పోటీలో ఉన్నారు.
ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ): ఇక్కడ వెలంపల్లి శ్రీనివాసరావును తొలగించాల్సి వస్తే ఆ స్థానంలో ఎస్సీ కోటాలో కొక్కిలిగడ్డ రక్షణనిధి పేరు పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. కాపు కోటాలో సామినేని ఉదయభాను, బ్రాహ్మణ కోటాలో మల్లాది విష్ణు పోటీ పడుతున్నారు.
గుంటూరు: జిల్లా నుంచి ప్రస్తుతం ఎస్సీ కోటాలో మేకతోటి సుచరిత హోంమంత్రిగా ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆశావహుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. మైనారిటీలకు ఇస్తే మహమ్మద్ ముస్తఫాషేక్కు అవకాశం రావచ్చు.
పల్నాడు(నరసరావుపేట): మంత్రి పదవులకు భారీగా పోటీ ఉన్న జిల్లాల్లో ఇదొకటి. ప్రస్తుత మంత్రివర్గంలో ఇక్కడి నుంచి ఎవరూ లేరు. వైకాపాలో మొదటినుంచీ ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు పోటీ పడుతున్నారు. మహిళా కోటాలో విడదల రజని ప్రయత్నాల్లో ఉన్నారు.
బాపట్ల: జిల్లా నుంచి కోన రఘుపతి ఉపసభాపతిగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశమిస్తామని సీఎం జగన్ అప్పట్లో రఘుపతికి హామీనిచ్చారని పార్టీలో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయనకు అవకాశం వస్తుందా? లేదా ఎస్సీ కోటాలో మేరుగ నాగార్జునకు దక్కుతుందా? తేలాల్సి ఉంది. నాగార్జునకు పదవిస్తే రఘుపతిని ఉపసభాపతిగా కొనసాగించే అవకాశముంది.
ప్రకాశం: జిల్లా నుంచి ప్రస్తుతమున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్లలో ఎవరిని కొనసాగించినా కొత్తవారికి అవకాశం లేనట్లే. ఈ ఇద్దరినీ తప్పిస్తే... కాపు కోటాలో మద్దిశెట్టి వేణుగోపాల్, ఎస్సీ కోటాలో టీజేఆర్ సుధాకర్బాబు పేర్లు వినిపిస్తున్నాయి.
నెల్లూరు: జిల్లా నుంచి మంత్రి పి.అనిల్కుమార్యాదవ్ మంత్రిగా ఉన్నారు. మరో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కన్నుమూశారు. ఇప్పుడు అనిల్ను తొలగిస్తేనే మరొకరికి అవకాశం వస్తుంది. ఆశావహుల్లో ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్రెడ్డి పేరు ముందు వరుసలో ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. అదే స్థాయిలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పోటీలో ఉన్నారు. మానుగుంట మహీధర్రెడ్డి పేరూ ప్రచారంలో ఉంది.
కర్నూలు: గుమ్మనూరు జయరాం మంత్రిగా కొనసాగేందుకు కుల సమీకరణ ఉపయోగపడుతుందన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయన్ను తొలగిస్తే రేసులో సాయిప్రసాదరెడ్డి/బాలనాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి ఉన్నారు. కాటసాని ఇప్పటికే తితిదే బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయినందున ఆయన్ను మంత్రిమండలిలోకి తీసుకుంటారా? లేదా పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్న కుటుంబం తమదంటున్న సాయిప్రసాదరెడ్డి.. ఆయన సోదరుడు బాలనాగిరెడ్డిల్లో ఒకరికి అవకాశం దక్కుతుందా అనేది చూడాలి. మహిళా కోటాలో కంగాటి శ్రీదేవి పేరు తెరపైకి వచ్చే అవకాశముందన్న చర్చ ఉంది. ముస్లిం కోటాలో హఫీజ్ఖాన్ గట్టి పోటీనే ఇస్తున్నారు.
నంద్యాల: ప్రస్తుత జిల్లా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిని తప్పించే పరిస్థితే వస్తే శిల్పాచక్రపాణిరెడ్డి, లేదా ఎస్సీ కోటాలో ఆర్థర్ పేర్లు పరిశీలనకు రావచ్చంటున్నారు.
అనంతపురం: జిల్లాలో మంత్రి లేనందున పోటీ గట్టిగానే ఉంది. మహిళల్లో బీసీ కోటాలో ఉషశ్రీచరణ్, ఎస్సీ కోటాలో జొన్నలగడ్డ పద్మావతి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీలో మొదటినుంచీ ఉన్నానని, బీసీనని కాపు రామచంద్రారెడ్డి కూడా గట్టిగానే ఆశిస్తున్నారు. వచ్చేది ఎన్నికల బృందం (కొత్త కేబినెట్) అంటున్నారు కాబట్టి సీనియర్లకే ఓటేసే పరిస్థితి వస్తే అనంత వెంకటరామిరెడ్డికి అవకాశం దక్కొచ్చన్న చర్చా ఉంది.
శ్రీసత్యసాయి: జిల్లాలో మాలగుండ్ల శంకరనారాయణ మంత్రిగా ఉన్నారు. ఆయన్ను తొలగించాల్సి వస్తే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్రెడ్డిలలో ఒకరిని.. లేదా ఎం.తిప్పేస్వామిని పరిశీలించొచ్చని చర్చ జరుగుతోంది.
కడప: ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లానుంచే ఉపముఖ్యమంత్రి అంజద్బాషా మంత్రిమండలిలో ఉన్నారు. జిల్లాలో ఒకరికే పదవి నిబంధన పాటిస్తే అంజద్బాషాను తొలగించడంతోపాటు కొత్తగా ఎవరికీ అవకాశం లేకపోవచ్చు. అయితే కొత్తగా ఎన్నికైన డాక్టర్ సుధ పేరు పరిశీలనలో ఉందని, ఆమెకు విప్ పదవిని ఇస్తారనే ప్రచారమూ ఉంది.
అన్నమయ్య: కొరుముట్ల శ్రీనివాసులు పేరు ప్రచారంలో ఉంది. సామాజిక సమీకరణల దృష్ట్యా గడికోట శ్రీకాంత్రెడ్డికి అవకాశం ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశమే. సీఎం హామీ పొందిన మేడా మల్లికార్జునరెడ్డి ఇదే జిల్లాకు చెందినవారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి పదవిని వదులుకుంటే పార్టీకి పెద్ద దిక్కయిన ఆయన కుటుంబంలో వారికే మళ్లీ అవకాశమిచ్చే పరిస్థితి వస్తే.. పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పేరు తెరపైకి రావచ్చు.
శ్రీబాలాజీ(తిరుపతి): జిల్లా నుంచి మంత్రులు ప్రస్తుతం లేనందున కచ్చితంగా ఒకరికి అవకాశం దక్కనుంది. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
చిత్తూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి మంత్రిమండలిలో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని కొనసాగించినా ఇతరులకు మంత్రిపదవి గురించిన చర్చ ఉండదు. ఇద్దరినీ తొలగిస్తే మహిళా కోటాలో ఆర్కే రోజా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కాపు కోటాలో జంగాలపల్లి శ్రీనివాసులు ప్రయత్నాల్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ