Andhra News: ఆ జిల్లా కేంద్రాలకు నేరుగా బస్సులు లేవు
రాష్ట్రంలో ఏర్పడిన పలు కొత్త జిల్లా కేంద్రాలకు.. అదే జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాలు, వివిధ మండలాల నుంచి నేరుగా చేరుకునేందుకు బస్ సర్వీసులు లేవు. వారంతా రెండు, మూడు బస్సులు మారి జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొన్ని మండలాలకు.
వారు బస్సు మారి వెళ్లాల్సిందే
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఏర్పడిన పలు కొత్త జిల్లా కేంద్రాలకు.. అదే జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాలు, వివిధ మండలాల నుంచి నేరుగా చేరుకునేందుకు బస్ సర్వీసులు లేవు. వారంతా రెండు, మూడు బస్సులు మారి జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొన్ని మండలాలకు.. కొత్త జిల్లా కేంద్రానికి ఒకటి, రెండు బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇపుడు వీటిని కూడా పెంచాల్సిన అవసరం ఏర్పడనుంది.
* కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రం. రైల్వేకోడూరు నుంచి ఈ మండలానికి నేరుగా చేరుకోవడానికి బస్సులు లేవు. ఇంతకాలం రైల్వేకోడూరు, కడప జిల్లాలో ఉండగా.. తిరుపతి-కడప మధ్య తిరిగే బస్సులన్నీ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రైల్వేకోడూరు నుంచి రాజంపేట వెళ్లి, అక్కడి నుంచి రాయచోటికి మరో బస్సులో వెళ్లాల్సి ఉంటుంది.
* సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి మడకశిర నియోజకవర్గం నుంచి నేరుగా బస్సులు లేవు. పెనుకొండ చేరుకొని అక్కడి నుంచి పుట్టపర్తికి రావాలి. రాప్తాడు పరిధిలోని మండలాలైన రామగిరి, కనగానపల్లె, సీకే పల్లి మండలాలకు చెందిన వారు ధర్మవరం వెళ్లి, అక్కడి నుంచి పుట్టపర్తికి చేరుకోవాలి.
* గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి, మార్టూరు, చీరాల మండలాలు బాపట్ల జిల్లాలోకి వచ్చాయి. అద్దంకి, మార్టూరుకు చెందినవారు చీరాలకు వచ్చి అక్కడి నుంచి బాపట్లకు రావాల్సి ఉంటుంది. సంతమాగులూరు మండలానికి చెందినవారు చిలకలూరిపేట, చీరాల్లో బస్సులు మారి బాపట్లకు చేరుకోవాల్సి ఉంటుంది. గతంలో గుంటూరు జిల్లాలో ఉన్న వేమూరు మండలానికి చెందిన వారికి కూడా బాపట్లకు చేరేందుకు నేరుగా బస్సులు లేవు.
* తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న చింతూరు, ఏటపాక వంటి మండలాలు మన్యం జిల్లాలో చేరాయి. ఈ జిల్లా కేంద్రమైన పాడేరుకు నేరుగా బస్సులు లేవు. చింతూరు నుంచి పాడేరు 230 కి.మీ. ఉండగా సీలేరు, చింతపల్లి చేరుకొని, అక్కడి నుంచి పాడేరుకు మరో బస్సులో వెళ్లాలి. ఏటపాక మండల వాసులకు పాడేరు 310 కి.మీ. దూరంలో ఉంది. వీళ్లది కూడా అదే పరిస్థితి.
త్వరలో బస్ సర్వీసులు
జిల్లా కేంద్రానికి చేరేందుకు బస్ సర్వీసులు లేని మార్గాల్లో.. ప్రయాణికుల అవసరాన్ని, స్థానికంగా వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకొని త్వరలో బస్ సర్వీసులు తీసుకొస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పాత జిల్లా కేంద్రానికి బదులు, ఇపుడు కొత్త జిల్లా కేంద్రానికి వెళ్లేవారు పెరిగితే.. ఆయా రూట్లలో బస్సులను సర్దుబాటు చేస్తామని పేర్కొంటున్నారు.
* కొత్త జిల్లాలకు చివర్లో కొన్ని మండలాల మార్పులు, చేర్పులు జరిగిన నేపథ్యంలో.. ఏయే జిల్లాలో పరిధిలోకి ఎన్ని డిపోలు వచ్చాయనే వివరాలను అధికారులు సోమవారం ఖరారు చేశారు. అత్యధికంగా తిరుపతి జిల్లాలోకి 10 డిపోలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో 8, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో ఏడేసి డిపోలు చొప్పున వచ్చాయి. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఒక్కటే డిపో ఉంది. అదే విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో రెండు డిపోలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM