AP Cabinet: బొత్సకు విద్య.. వనితకు హోం
పాత, కొత్తల కలయికతో పునర్వ్యవస్థీకరించిన రాష్ట్ర మంత్రివర్గం.. సోమవారం కొలువుదీరింది. అమరావతిలోని సచివాలయం పక్కన ఖాళీస్థలంలో ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రివర్గ సహచరులకు
ధర్మానకు రెవెన్యూ, పెద్దిరెడ్డికి విద్యుత్తు
రోజాకు పర్యాటకం.. రజనికి వైద్య, ఆరోగ్యం
పాత మంత్రుల్లో ఏడుగురికి ఇంతకు ముందున్న శాఖలే
కొత్తవారిలో ముగ్గురు, నలుగురికి ముఖ్యమైన శాఖలు
ఈనాడు - అమరావతి
పాత, కొత్తల కలయికతో పునర్వ్యవస్థీకరించిన రాష్ట్ర మంత్రివర్గం.. సోమవారం కొలువుదీరింది. అమరావతిలోని సచివాలయం పక్కన ఖాళీస్థలంలో ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాఖలు కేటాయించారు. సీనియర్లలో కొందరికి ముఖ్యమైన శాఖలు లభించగా.. కొందరికి యథావిధిగా అప్రాధాన్య విభాగాలే దక్కాయి. ఈసారి కూడా అయిదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ఒక్కో వర్గానికి ఒక్కోటి చొప్పున పంపిణీ చేశారు. వీరిలో ఒకరిద్దరికి తప్ప ఉప ముఖ్యమంత్రి స్థాయి ప్రాధాన్యమున్న శాఖలు దక్కలేదు. ఒకరికి దక్కినా దానిపై నిజమైన అజమాయిషీ లభిస్తుందా అన్నది సందేహమే. ఎస్సీ వర్గానికి చెందిన మహిళకే మళ్లీ హోం శాఖ అప్పగించారు. తొలి మంత్రివర్గంలో ఈ శాఖ చూసిన మంత్రికి కలిగిన అనుభవం ఈమెకు ఎదురుకాకుండా ఉంటేనే దానికి సార్థకత చేకూరుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చాలాకాలం తరువాత మంత్రిగా అవకాశం లభించిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు కీలకమైన రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం దక్కింది. ఆయనకు గతంలో ఈ శాఖ నిర్వహించిన అనుభవం ఉంది. మొన్నటి వరకు ధర్మాన సోదరుడు కృష్ణదాసే ఈ శాఖ చూశారు. మంత్రివర్గంలో అనధికార నంబర్ 2గా చలామణి అయ్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యుత్తు, అటవీ, గనుల శాఖలు దక్కాయి. గతంలో చూసిన పంచాయతీరాజ్శాఖను తప్పించి కొత్తగా విద్యుత్తు అప్పగించారు. అప్పులు, నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలు విద్యుత్తు కోతలతో ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్న నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలు పెద్దిరెడ్డికి ఇవ్వడం గమనార్హం. సీఆర్డీఏతో కూడిన మున్సిపల్ పరిపాలన చూసిన బొత్స సత్యనారాయణకు ఈసారి విద్యాశాఖ లభించడం ఎవరూ ఊహించని పరిణామం. గతంలో మహిళా, శిశు సంక్షేమం చూసిన తానేటి వనితకు హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలి వరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సురేష్కు గతంలో బొత్స సత్యనారాయణ చూసిన మున్సిపల్ పరిపాలనశాఖ దక్కింది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, అంజాద్ బాషాలతోపాటు మంత్రులు సీదిరి అప్పలరాజు, చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, జయరాంలకు పాతశాఖలే దక్కాయి. వీటిలో బుగ్గన దగ్గరున్న ఆర్థిక, వాణిజ్య పన్నులు కీలమైనవి. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తేనే నవరత్నాలు అమలు చేయగలిగే స్థితి ఒకవైపు... కీలకవనరైన వాణిజ్య పన్నుల నుంచి గరిష్ఠంగా ఆదాయాన్ని ఆర్జించాల్సిన పరిస్థితిలో ఆయనకే మరోసారి ఆ బాధ్యతలు అప్పగించారు.
వీరికి ప్రాధాన్యమున్న శాఖలే
కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారిలో అంబటి రాంబాబుకు జలవనరులు, విడదల రజనికి వైద్య, ఆరోగ్యం, అమర్నాథ్కు పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ, కాకాణి గోవర్థన్రెడ్డి వ్యవసాయం, సహకారం వంటి ముఖ్యమైన శాఖలు దక్కటం విశేషం. గోవర్థన్రెడ్డికి కోరుకున్న శాఖే దక్కిందంటున్నారు. ఉప ముఖ్యమంత్రుల్లో అంజాద్ బాషా, రాజన్న దొరలకు వారి వర్గాలకు చెందిన సంక్షేమశాఖలు మాత్రమే దక్కాయి. పేరుకు ఉప ముఖ్యమంత్రులైనప్పటికీ ఆయా శాఖలకున్న బడ్జెట్, పరిమితుల దృష్ట్యా పరిధి తక్కువేనన్న భావన వ్యక్తమవుతోంది. మొదటిసారి మంత్రివర్గంలో చోటిచ్చి, ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించిన బూడి ముత్యాలనాయుడుకు మాత్రం ప్రాధాన్యమున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ దక్కింది. మరో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి మొదటి మంత్రివర్గంలో ఎక్సైజ్తోపాటు వాణిజ్య పన్నులు కూడా ఉండేవి. కొద్ది నెలల తరువాత వాణిజ్య పన్నులు తొలగించి ఎక్సైజ్కు పరిమితం చేశారు. ఆ శాఖలోని కీలక వ్యవహారాల్లోనూ ఆయన పాత్ర నామమాత్రమేనని, మరో సీనియర్ మంత్రి తనయుడే చూస్తారన్న విమర్శలు మొదటి నుంచీ ఉన్నాయి. ఈ విడతలోనైనా అలాంటి వాటికి తావివ్వని పరిస్థితి ఉంటుందేమో చూడాలి. జిల్లాలో సీనియర్ మంత్రితో విభేదాలున్నప్పటికీ మంత్రివర్గంలో చేరగలిగిన రోజాకి మాత్రం నిధులు, పెద్దగా విధులూ లేని శాఖ లభించిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
మహిళల భద్రతపై దృష్టి పెడతా
రెండోసారి మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటానని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మహిళలు, చిన్న పిల్లల సంక్షేమ శాఖ నిర్వహించడం ద్వారా.. వారి సమస్యలపై అవగాహన ఉందని వివరించారు. హోంమంత్రిగా మహిళల ఇబ్బందులు, వారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెడతానని విలేకరులకు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు