AP Cabinet: అంబటితో మొదలై.. రజనితో ముగింపు
కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న నాయకుల ముఖాల్లో మెరుపులు... ఆప్తులు, ఆత్మీయుల అభినందనలు... అభిమానులు, కార్యకర్తల కేరింతలు... పదవి కోల్పోయిన మాజీ మంత్రుల ముఖాల్లో కొరవడిన కాంతులు... తప్పనిసరై ఆలింగనాలు..
అక్షర క్రమంలో సాగిన మంత్రుల ప్రమాణ స్వీకారం
వెలిగిన కొత్త ముఖాలు
తాజా మాజీల్లో కొరవడిన కాంతులు
ఈనాడు, అమరావతి: కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న నాయకుల ముఖాల్లో మెరుపులు... ఆప్తులు, ఆత్మీయుల అభినందనలు... అభిమానులు, కార్యకర్తల కేరింతలు... పదవి కోల్పోయిన మాజీ మంత్రుల ముఖాల్లో కొరవడిన కాంతులు... తప్పనిసరై ఆలింగనాలు... ముక్తసరి పలకరింపులు... ఇవి కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కనిపించిన దృశ్యాలు. రాజధాని అమరావతిలో సచివాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయించారు. నిర్ణయించుకున్న ముహూర్తానికి కార్యక్రమం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఉదయం 11.22కి సభా ప్రాంగణానికి చేరుకొని.. 11.27కి గవర్నర్తో కలసి వేదికపైకి వచ్చారు. అక్షర క్రమంలో అంబటి రాంబాబుతో మొదలై... విడదల రజనితో ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. అంజాద్ బాషా అల్లా సాక్షిగా ప్రమాణం చేయగా, మిగతా వారు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్, ఉషశ్రీ చరణ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంగ్లంలో, మిగతా వారంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం ముగిశాక గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు ఫొటో దిగారు. ఆ తర్వాత తేనీటి విందులో పాల్గొన్నారు.
తడబాట్లు... పొరపాట్లు!
తెలుగులో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ‘సార్వభౌమాధికారం’, ‘అంతఃకరణశుద్ధి’ పదాలు పలికేటప్పుడు తడబడటం గతంలో చాలా సార్లు జరిగింది. ఈసారి ఒక్క బొత్స సత్యనారాయణ ఆ రెండు పదాలు పలికేటప్పుడు కొంచెం తొట్రుపడ్డారు తప్ప, మిగతావారంతా ఆ పదాల్ని జాగ్రత్తగానే పలికారు. కారుమూరి నాగేశ్వరరావు... శాసనము ద్వారా నిర్మితమైన అని కాకుండా.. ‘నిర్మాతమైన’ అని పలికారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా’ అనకుండా... ‘ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా’ అని చెప్పారు. ఆర్కే రోజా, విడదల రజని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొంత భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. ‘ప్రమాణం చేస్తున్నాను’ అని చెప్పాల్సిన చోట... ‘ప్రమాణ స్వీకారం చేసి చెబుతున్నాను’ అని రోజా చదివారు. ‘కర్తవ్యాన్ని’ అని చదివేటప్పుడు విశ్వరూప్ కొంత తొట్రుపడ్డారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు కొత్త మంత్రుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ పిలిచారు. ‘తానేటి వనిత’ పేరుని ‘తేనేటి వనిత’ అని పిలిచారు.
పిలిచింది రామలింగేశ్వరరావు అని... ప్రమాణం చేసింది రాజా అని..!
మంత్రి దాడిశెట్టి రాజా పేరు విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మంత్రుల జాబితాలో ఆయన పేరు దాడిశెట్టి రామలింగేశ్వరరావు అని ఉంది. వేదికపైకి పిలిచేటప్పుడు సీఎస్ సమీర్శర్మ ఆయన పేరుని... దాడిశెట్టి రామలింగేశ్వరరావు అనే పలికారు. కానీ ఆయన మాత్రం ‘దాడిశెట్టి రాజా అనే నేను’.. అని ప్రమాణ స్వీకారం చేశారు. రికార్డులో ఒక పేరు ఉంటే... ఆయన మరో పేరుతో ప్రమాణ స్వీకారం చేయడం సాంకేతికంగా సమస్య కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘సాక్షి’కే ప్రత్యేకం..!
మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం కవరేజికి మీడియా ప్రతినిధుల్ని ఆహ్వానించే విషయంలో సమాచార పౌర సంబంధాల శాఖ వివక్ష ప్రదర్శించింది. ఒక్కో సంస్థ నుంచి ఇద్దరు రిపోర్టర్లకు మాత్రమే పాస్లు ఇస్తామని, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు ప్రవేశం లేదని, ఫొటోలు, వీడియోలు తామే ఇస్తామని మీడియా సంస్థలకు ఆదివారం సందేశాలు పంపింది. అదనంగా మరో పాస్ ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు. కానీ ప్రమాణ స్వీకారోత్సవానికి ‘సాక్షి’ ఛానల్, సాక్షి పత్రిక ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లలతో పాటు, మరికొన్ని ఛానళ్లకూ కెమెరామెన్లు, రిపోర్టర్లకు ప్రత్యేక ప్రవేశం కల్పించింది. ఒక సంస్థకు రెండే పాస్లు అన్న నిబంధన పక్కన పెట్టి ‘సాక్షి’ పత్రిక, ఛానళ్లకు ఎక్కువ పాస్లు జారీ చేశారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇలాగే జరిగింది.
తాజా మాజీల్లో హాజరైంది కొందరే..
కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి తాజా మాజీ మంత్రుల్లో కొందరు హాజరుకాలేదు. మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, శంకరనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి హాజరయ్యారు. మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సుచరితలతో పాటు, అనిల్కుమార్ యాదవ్, శ్రీరంగనాథరాజు హాజరుకాలేదు. హాజరైన తాజా మాజీ మంత్రుల ముఖాలు కూడా దిగాలుగా ఉన్నాయి. మంత్రి పదవులు ఆశించి నిరాశ చెందిన ఎమ్మెల్యేలు కూడా రాలేదు. ప్రమాణ స్వీకారోత్సవానికి వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసి వచ్చాక రోజా... తన కుమార్తెను దగ్గరకు పిలిచి, ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. రోజా ప్రమాణ స్వీకారం చేసి వచ్చాక... కరచాలనం చేసేందుకు సహచర మంత్రుల దగ్గరకు వెళ్లగా అంబటి రాంబాబు లేచి సరదాగా సెల్యూట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.