TTD: కొండంత కష్టం
తిరుమల వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించి తరించాలని సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు... తితిదే అధికారుల ఘోర వైఫల్యంతో మంగళవారం నరకం కనిపించింది. వేలసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.
తిరుపతికి పోటెత్తిన భక్తులు
సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట
సొమ్మసిల్లిన కొందరు.. అయిదుగురికి గాయాలు
వృద్ధులు, పిల్లల ఇబ్బందులు వర్ణనాతీతం
తితిదే అధికారుల నిర్వాకం
ఈనాడు-తిరుపతి, తిరుపతి (తితిదే, గాంధీరోడ్డు), తిరుమల, న్యూస్టుడే
తిరుమల వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించి తరించాలని సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు... తితిదే అధికారుల ఘోర వైఫల్యంతో మంగళవారం నరకం కనిపించింది. వేలసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో అయిదుగురు గాయపడ్డారు. పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. వారిని అంబులెన్సులలో రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఊపిరాడక విలవిల్లాడిపోయారు. కొందరు సొమ్మసిల్లిపోయారు. వారిని 108లలో ఆస్పత్రులకు తరలించారు. నిప్పులు చెరుగుతున్న ఎండలో, దాహంతో తడారిపోతున్న గొంతులతో, ఏడుస్తున్న పిల్లా, పాపలతో గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడం... అంతసేపు ఎదురుచూసినా టోకెన్లు దొరుకుతాయో లేదో తెలియని సందిగ్ధత భక్తుల్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. సాధారణ రోజుల కంటే వేసవిలో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువ. కొవిడ్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల రద్దీ మరింత పెరిగింది. ఇదంతా తెలిసీ తితిదే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ముందస్తు వ్యూహం, ప్రణాళిక లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలకొద్దీ భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నా, తీరిగ్గా ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించారు. చూస్తుండగానే భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. వారు వేచి ఉండేందుకు తగిన ఏర్పాట్లు లేవు. ఎంతసేపటికీ క్యూలైన్లు తరగక సహనం కోల్పోయిన భక్తులు తోసుకురావడంతో... తితిదే భద్రతా సిబ్బంది వారిని నియంత్రించలేకపోయారు. పోలీసులు వచ్చేసరికే పరిస్థితి అదుపు తప్పింది.
రెండు రోజులుగా వేచి ఉన్నారని తెలిసినా..
తిరుపతిలోని శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లో ఉచిత దర్శన టోకెన్లు జారీచేస్తున్నారు. సాధారణ రోజుల్లో 30వేల టోకెన్లు, వారాంతాల్లో 40 వేలు ఇస్తున్నారు. సాధారణంగా రేపటి దర్శనానికి ముందురోజు టోకెన్లు ఇస్తున్నారు. ఒక్కోసారి భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటే... ఎల్లుండి దర్శనానికీ ఈరోజు అర్ధరాత్రి నుంచే టోకెన్లు ఇస్తున్నారు. అలా సోమవారం వరకూ టోకెన్లను శనివారమే ఇచ్చేశారు. ఆది, సోమవారాల్లో టోకెన్ల జారీ నిలిపివేశారు. ఆ విషయాన్ని తితిదే ప్రకటించినా... విషయం తెలియని చాలామంది భక్తులు ఆది, సోమవారాల్లో తిరుపతికి చేరుకున్నారు. వారంతా టోకెన్లు ఎప్పుడు ఇస్తారా? అని తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్తో పాటు ఇటు గోవిందరాజస్వామి సత్రాల వద్ద వేచి ఉన్నారు. రెండు రోజులపాటు టోకెన్లు జారీ చేయకపోవడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం టోకెన్లు జారీ చేస్తారని తెలిసి.. మరింతమంది తిరుపతి వచ్చారు. ఇలా మూడు రోజుల్లో వచ్చిన భక్తులతో తిరుపతి మంగళవారం కిటకిటలాడిపోయింది. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడం, క్యూలైన్లు ఎంతకూ తరగకపోవడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రవేశమార్గం పూర్తిగా కూలిపోయే పరిస్థితికి చేరింది. పోలీసులు తాడు సాయంతో పడిపోతున్న ఆ ప్రవేశమార్గాన్ని నిలబెట్టారు. పోలీసు సిబ్బంది ఆ మార్గం నిలబెట్టకపోయి ఉంటే భారీ ప్రమాదం చోటుచేసుకునేది. భక్తులు ఆగ్రహంతో బారికేడ్లు పీకేశారు. భక్తులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన జాలీల్ని తొలగించారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో టోకెన్లు లేకుండానే భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఉదయం 11.30 గంటలకు తితిదే ప్రకటించింది. దాంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు బస్సులు, సొంత వాహనాలు, టాక్సీల్లో కొండపైకి వెళ్లారు. మిగతా రెండు కేంద్రాల వద్ద తోపులాట జరగకపోయినా, భక్తుల అవస్థలు మాత్రం అన్నిచోట్లా ఒకేలా ఉన్నాయి.
కొవిడ్ ఉద్ధృతి తగ్గాక తితిదే గత నెల నుంచి తిరుపతిలోనే సర్వదర్శనం టోకెన్లు జారీచేయడం ప్రారంభించింది. టోకెన్ల జారీ విధానం వల్ల కొండపై రద్దీ తగ్గినా, తిరుపతిలో క్యూలైన్లలో టోకెన్ల కోసం వేలకొద్దీ ప్రజలు తోసుకుంటూ గంటల తరబడి నిలబడుతున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచీ టోకెన్లు జారీచేయాల్సి ఉండగా, ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టారు. భక్తులు వేల సంఖ్యలో ఉన్నారని తెలిసినా, తొక్కిసలాట జరగొచ్చని ఊహించడంలో తితిదే అధికారులు విఫలమయ్యారు. బందోబస్తు కోసం పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. తితిదే అధికారుల తీరుపై భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. కొవిడ్ కారణంగా ఎప్పటి నుంచో మొక్కులు తీర్చుకోలేదని, తమను తిరుమలకు అనుమతిస్తే స్వామి దర్శనం దొరక్కపోయినా, కనీసం మొక్కులైనా తీర్చుకుంటామని, తలనీలాలు సమర్పించుకోడానికైనా అనుమతించాలని వేడుకున్నారు.
విజిలెన్స్ సిబ్బందిపై పోలీసుల ఆగ్రహం
క్యూలైన్లలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, టోకెన్లు లేకుండానే కొండపైకి వెళ్లవచ్చని పోలీసులు భక్తులకు సూచించారు. అలా ప్రకటించవద్దని వారిని తితిదే విజిలెన్స్ సిబ్బంది నిరోధించడంతో పోలీసులు వారిపై మండిపడ్డారు. ఎట్టకేలకు 11.30 సమయంలో తితిదేనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో, భక్తుల్ని బస్సుల్లోకి ఎక్కించి పంపారు. వాహనాలన్నీ ఒకేసారి రావడంతో ఉదయం 12 గంటల సమయంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ ఏర్పడింది. అదనపు ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో ఎస్పీఎఫ్, పోలీసు సిబ్బంది పలువురిని సప్తగిరి తనిఖీ కేంద్రానికి తరలించి త్వరితగతిన చెకింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటలకు మొత్తం వాహనాలను క్లియర్ చేయగలిగారు. మరోవైపు అటు నడకమార్గం భక్తులతో కిక్కిరిసిపోయింది.
సర్వదర్శన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
టోకెన్ల విధానం తీసేసిన నేపథ్యంలో తిరుమలకు పెద్దసంఖ్యలో చేరుకునే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తితిదే అధికారులు చేపట్టారు. కల్యాణకట్టల వద్ద తగినంత మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. స్థానిక రాంభగీచా, సుదర్శన్ కౌంటర్ల వద్ద అన్నప్రసాద వితరణను కొనసాగిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రం వద్ద భక్తులకు వేగంగా అన్నప్రసాదాలను అందించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్సులోకి భక్తులను అనుమతించి శ్రీవారి దర్శనానికి పంపుతున్న నేపథ్యంలో భక్తుల దర్శనానికి అధిక సమయం తీసుకునే అవకాశం ఉంది. క్యూలైన్లోని వారికి అల్పాహారం, తాగునీరు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తితిదే అధికారులు తెలిపారు.
ఆదివారం వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు తిరుపతిలో సర్వదర్శనం కౌంటర్ల వద్ద భక్తుల రద్దీతో తోపులాటలు చోటుచేసుకున్న నేపథ్యంలో తితిదే బుధవారం నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేసింది. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసి కొవిడ్కు పూర్వం ఉన్న విధానాన్ని పునరుద్ధరించింది. భక్తులను స్థానిక లేపాక్షి కూడలిలోని సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి అనుమతిస్తోంది. మంగళవారం మొదట టోకెన్లు ఉన్నవారిని, వారి తర్వాత టోకెన్లు లేనివారిని కంపార్ట్మెంట్లలోకి అనుమతించారు.
అనూహ్య రద్దీతోనే స్లాటెడ్ విధానం రద్దు
అదనపు ఈవో ధర్మారెడ్డి
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో మంగళవారం అనూహ్య రద్దీ నెలకొనడంతో స్లాటెడ్ టోకెన్లను రద్దుచేసి నేరుగా సర్వదర్శనానికి అనుమతించామని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన అధికారులతో కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లను తనిఖీ చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అనూహ్య రద్దీతో 2020కి పూర్వం ఉన్న విధానంలోనే టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి భక్తులను అనుమతించామని తెలిపారు. దర్శనానికి 20-30 గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని, తదనుగుణంగా భక్తులు తిరుమలకు రావాలని సూచించారు.
అనాలోచిత నిర్ణయాలతో.. శ్రీవారిని భక్తులకు దూరం చేస్తారా?
చంద్రబాబు మండిపాటు
ఈనాడు, అమరావతి: భక్తుల పట్ల తితిదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మంగళవారం జరిగిన ఘటనపై క్షమాపణ చెప్పి, పునరావృతం కాకుండా చూడాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు పడిన కష్టాలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. వేల మంది గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే, తితిదే ఏం చేస్తోందని మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘మహిళలు, పిల్లలు, వృద్ధులు క్యూలైన్లలో పడుతున్న అవస్థలు తితిదేకు పట్టవా? భక్తుల రాక, రద్దీపై కనీస అవగాహన లేకుండా దేవస్థానం వ్యవహరించింది. క్యూలైన్లో తొక్కిసలాట జరగడం, పలువురు గాయపడటం విచారకరం. తాగునీరు, నీడ కూడా కల్పించకపోవడం దారుణం. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలను ఆదాయ వనరు కోణంలో తితిదే చూస్తోంది. కొండపైకి వెళ్లడానికి ఆంక్షలు విధించడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే’నని చంద్రబాబు మండిపడ్డారు.
నిర్లక్ష్యమా? ఉద్దేశపూర్వకమా?
పయ్యావుల కేశవ్ ప్రశ్న
ఈనాడు డిజిటల్, అమరావతి: సామాన్య భక్తులకు తిరుమలేశుడిని దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్, తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘సర్వదర్శనం టికెట్ల కోసం సామాన్యులు పడుతున్న కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వేసవిగానీ, వేసవి సెలవులుగానీ ఇప్పుడే కొత్తగా వచ్చాయా? ఈ రద్దీ గత వందేళ్లలో ఎప్పుడూ లేదా? ఇంత జరుగుతుంటే తితిదే పాలకమండలి ఏం చేస్తోంది? ఇది నిర్లక్ష్యమా? లేక ఉద్దేశపూర్వక ఆలోచనా?’ అని ప్రశ్నించారు.
తితిదే ఘోర వైఫల్యం: సోమువీర్రాజు
ఈనాడు, అమరావతి: భక్తులకు భగవంతుని దర్శనం కల్పించడంలో తితిదే అధికారులు ఘోరంగా విఫలమయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈవోను డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM