Pawan Kalyan: మీరు సీబీఐ దత్తపుత్రులా?
అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించానని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ పేర్కొన్నారు. రైతు కష్టం తెలుసు కనకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానన్నారు. వైకాపా హయాంలో 3వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రతి ఒక్క రైతుకూ
నన్ను సీబీఎన్కు దత్తపుత్రుడు అంటే.. మేం మిమ్మల్ని ఆ మాటే అంటాం
మమ్మల్ని తెదేపా బీ టీం అంటే.. వైకాపాను చర్లపల్లి షటిల్ టీం అంటాం
16 నెలలు జైలుకు వెళ్లివచ్చిన మీరా.. మాకు నీతులు చెప్పేది?
ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.7 లక్షలు ఇవ్వాల్సిందే
కౌలు రైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్కల్యాణ్
ఈనాడు డిజిటల్, అనంతపురం
నన్ను సీబీఎన్(చంద్రబాబు)కు దత్తపుత్రుడు అంటే.. మేం మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి ఉంటుంది. మమ్మల్ని తెదేపాకు బీ టీం అంటే మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీం అనాల్సి ఉంటుంది. అక్కడ జైల్లో షటిల్ ఆడుకున్నారు. మీరేమైనా సుభాష్ చంద్రబోష్, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్లా దేశసేవ చేశారా? ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైల్లో కూర్చుని వచ్చారు.
అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించానని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ పేర్కొన్నారు. రైతు కష్టం తెలుసు కనకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానన్నారు. వైకాపా హయాంలో 3వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రతి ఒక్క రైతుకూ న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కౌలు రైతు భరోసా యాత్రను పవన్కల్యాణ్ శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో మంగళవారం ప్రారంభించారు. ముందుగా నల్లమాడ మండలం వంకరకుంటకు చెందిన కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి రూ.లక్ష చెక్కును అందజేశారు. అక్కడ్నుంచి ధర్మవరం, బత్తలపల్లి, గొట్లూరు, అనంతపురం జిల్లా పూలకుంటలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం అనంత గ్రామీణ మండలం మన్నీల గ్రామంలో ఏర్పాటుచేసిన రచ్చబండలో 30బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.
ప్రతి జిల్లాకూ సంక్షేమ నిధి
‘జనసేన పార్టీ.. లేని సమస్యను సృష్టించదు. ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. కౌలు రైతు భరోసా వంటి కార్యక్రమం ప్రారంభించకపోతే ప్రభుత్వంలో చలనం రాదు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుంబానికీ రూ.7 లక్షలు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ఇచ్చేవరకూ ప్రభుత్వంపై పోరాడతాం. అలాగేమావంతు సాయం చేస్తాం. బాధిత రైతు కుటుంబాలను ఆదుకునేలా, వారికి ఇబ్బందులు రాకుండా జిల్లాలవారీగా సంక్షేమ నిధి ఏర్పాటుచేసేలా ఆలోచిస్తున్నాం. దానికి నా వంతుగా సగం సాయం చేస్తాను. మిగిలిన సగం మా నాయకులు ఇస్తారు’ అనిపవన్కల్యాణ్ పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ఏమైంది?
‘మా పార్టీలో కార్యకర్తలకు ఏదైనా జరిగితే రూ.5లక్షల వరకు బీమా ఇస్తున్నాం. అలాంటిది రూ.లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ఎందుకు విఫలమవుతోంది? ఈ సాయం రాజకీయ లబ్ధి కోసం చేయట్లేదు. రైతుల కష్టాలు నాకు తెలుసు. అందులో కౌలు రైతు జీవితం బాగా తెలుసు. సొంత భూమి లేకపోయినా వ్యవసాయంపై మక్కువతో పెట్టుబడి పెడుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఆదరణ లేక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులూ ఇవ్వడం లేదు. ప్రభుత్వ పథకాలు అందట్లేదు. కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకు? ఎన్ని వేల కోట్లు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం’ అంటూ నిలదీశారు.
‘ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జనసేన తరఫున పరామర్శిస్తున్నామని తెలిసి ప్రభుత్వంలో చలనం వచ్చింది. మేము రాకముందే హుటాహుటిన కొన్ని బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించింది. ఏడాదిన్నర కిందట చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకూ ఇవాళ బ్యాంకు ఖాతాలో నగదు జమచేశారు. ఈ పని రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడే చేసి ఉంటే బాగుండేది.
రైతు కన్నీరు తుడుస్తాం
నేను మాటల మనిషిని కాదు. మేము అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని చెప్పం. కానీ రైతు కన్నీరు తుడుస్తాం. నేనూ ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాను. నా సోదరుడు నాగబాబు ధైర్యం చెప్పడంతో విరమించుకున్నా. అన్నింటికీ ఆత్మహత్య పరిష్కారం కాదు. చనిపోయినవారి కుటుంబాలకు అండగా నిలబడతానని మాటిస్తున్నా. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు బిడ్డ తనకు ఎస్సై కావాలని ఉన్నట్లు చెప్పింది. మరోబిడ్డ ఇంజినీర్ అవ్వాలనుందని చెప్పింది. వారికి నేను అండగా ఉంటాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 30 కౌలు రైతు కుటుంబాలకు సాయం చేశాం. మళ్లీ చేస్తాం.
ప్రభుత్వం వద్ద వివరాలు లేవు
కౌలు రైతుల పరిస్థితి గురించి రైతుస్వరాజ్య వేదిక అనే సంస్థ మాకు వివరించింది. తర్వాత మా పార్టీ తరఫున అధ్యయనం చేశాం. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల వివరాలు జనసేన వద్ద ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆ వివరాలు లేకపోవడం శోచనీయం. వైకాపా ప్రభుత్వం నన్ను అన్ని విధాలుగా భయపెట్టాలని చూస్తోంది. నాకు భయమంటే ఏంటో తెలీదు. దెబ్బ పడేకొద్దీ రాటుదేలుతాను. పోలీసుశాఖను ప్రభుత్వం తమకు అనుకూలంగా వాడుకుంటోంది. అయితే వారికి న్యాయంగా రావాల్సినవి ఇవ్వడం లేదు. పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్, ట్రావెలింగ్ అలవెన్సులు అందజేయాలి’ అని పవన్కల్యాణ్ డిమాండ్ చేశారు.
పవన్కు వైకాపా సర్పంచి కృతజ్ఞతలు
మన్నీల గ్రామంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచి, వైకాపా మద్దతుదారు త్రిలోక్నాయుడు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చేయూత అందించిన పవన్కల్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తాను సర్పంచిగా కాకుండా రైతుగా మాట్లాడుతున్నానని, 15 ఏళ్లుగా వ్యవసాయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని గుర్తుచేశారు.
వైకాపా అగ్ర నాయకత్వానికి ఒకటే చెబుతున్నా. నేనేమీ విదేశాల్లో చదువుకోలేదు. లండన్ రాయల్ ఫ్యామిలీ కాదు.. ప్రకాశం జిల్లాలో పెరిగిన వాడిని. మీరు తిట్టే భాష కంటే చాలా మంచి భాష నాకొచ్చు. ఇంకోసారి చెబుతున్నా. నన్ను సీబీఎన్(చంద్రబాబునాయుడు)కు దత్తపుత్రుడు అంటే.. మేం మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి ఉంటుంది. మమ్మల్ని తెదేపాకు బీ టీం అంటే మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీం అనాల్సి ఉంటుంది. అక్కడ జైల్లో షటిల్ ఆడుకున్నారు. మీరేమైనా సుభాష్ చంద్రబోష్, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్లా దేశసేవ చేశారా? ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైల్లో కూర్చుని వచ్చారు. వైకాపాలో చాలామంది నేతలను సీబీఐ దత్తత తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని విమర్శించే స్థాయి మీకు లేదు. మంచో.. చెడో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. వారి తీర్పునకు కట్టుబడి మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను.’
- అనంతపురం జిల్లా పూలకుంటలోజగన్ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్కల్యాణ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM