Andhra News: ప్లాట్లపై పన్ను పోటు
పట్టణాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పేరుతో రుసుములు చెల్లించాలని పేదలకు ఇప్పటికే తాఖీదులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. లేఅవుట్లలో ఎప్పుడో స్థలాలు (ప్లాట్లు) కొన్నవారికి వ్యవసాయేతర భూమి (నాలా) పన్ను కట్టాలని ప్రస్తుతం నోటీసులిస్తోంది. అప్పులు చేసి ప్లాట్లు కొన్న కుటుంబాలు లక్షలాది రూపాయిలు చెల్లించాలంటే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లేఅవుట్లకు అనుమతులిచ్చినప్పుడే వ్యాపారులు (డెవలపర్లు) నాలా పన్ను చెల్లించారా? లేదా? పరిశీలించకుండా, అనేక ఏళ్ల తర్వాత కొనుగోలుదారులను బాధ్యులను చేయడంపై ఆవేదన చెందుతున్నారు. పన్ను చెల్లించని ప్లాట్ల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఆదేశించడం మరింత కలవరపెడుతోంది.
రూ.500 కోట్ల నాలాపన్ను లక్ష్యం
వసూళ్లకు రంగంలోకి రెవెన్యూశాఖ
లేఅవుట్లలో స్థలాల కొనుగోలుదారులకు తాఖీదులు
అధికారుల తప్పిదానికి ప్రజలు బాధ్యులా?
అనుమతులిచ్చినప్పుడే ఎందుకు పట్టించుకోలేదు?
ఈనాడు - అమరావతి
పట్టణాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పేరుతో రుసుములు చెల్లించాలని పేదలకు ఇప్పటికే తాఖీదులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. లేఅవుట్లలో ఎప్పుడో స్థలాలు (ప్లాట్లు) కొన్నవారికి వ్యవసాయేతర భూమి (నాలా) పన్ను కట్టాలని ప్రస్తుతం నోటీసులిస్తోంది. అప్పులు చేసి ప్లాట్లు కొన్న కుటుంబాలు లక్షలాది రూపాయిలు చెల్లించాలంటే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లేఅవుట్లకు అనుమతులిచ్చినప్పుడే వ్యాపారులు (డెవలపర్లు) నాలా పన్ను చెల్లించారా? లేదా? పరిశీలించకుండా, అనేక ఏళ్ల తర్వాత కొనుగోలుదారులను బాధ్యులను చేయడంపై ఆవేదన చెందుతున్నారు. పన్ను చెల్లించని ప్లాట్ల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఆదేశించడం మరింత కలవరపెడుతోంది. విజయవాడలో వందకుపైగా లేఅవుట్ల నుంచి నాలా పన్ను వసూలు చేయడానికి రెవెన్యూ శాఖ సిద్ధమైంది. మిగతా నగరాల్లోనూ ఇదే విధంగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో రూ.500 కోట్లకుపైగా పన్ను వసూలు చేయాలన్నది లక్ష్యంగా తెలుస్తోంది.
అప్పుడు ఏమయ్యారు?
పట్టణాభివృద్ధి సంస్థలు ప్రైవేట్ లేఅవుట్లకు ప్లాన్లు (ఎల్పీ నంబరు) ఇచ్చాయంటే వీటిలో ఎలాంటి లొసుగులు ఉండవన్న నమ్మకంతో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తుంటారు. అన్ని రకాల ఫీజులు చెల్లించాకే పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులిస్తాయన్నది భరోసా. అనుమతులిచ్చేటప్పుడే సంబంధిత వ్యాపారి రెవెన్యూ శాఖకు నాలా పన్ను చెల్లించారా, లేదా అన్నది పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మొదట పరిశీలిస్తారు.
ఆ తర్వాత డెవలప్మెంట్ ఛార్జీలు, భూ వినియోగ మార్పిడి రుసుములు వసూలు చేస్తారు. 2006 తరువాత వేసిన ప్రతి లేఅవుట్కు నాలాపన్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయినప్పటికీ 2007, 2008, 2009లో వేసిన లేఅవుట్లల్లో కొనుగోలు చేసిన ప్లాట్లకు నాలాపన్ను చెల్లించాలని తాజాగా రెవెన్యూ శాఖ నోటీసులిస్తోంది. అంటే నాలాపన్ను చెల్లించకపోయినా పట్టణాభివృద్ధి సంస్థలు లేఅవుట్లకు అనుమతులిచ్చాయా?, ఇచ్చినా రెవెన్యూ శాఖ ఇప్పటిదాకా పట్టించుకోలేదా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రాథమిక దశలోనే లోపాలు గుర్తించి నోటీసులిస్తే లేఅవుట్ వేసిన వ్యాపారి పన్ను చెల్లించేవారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం వంటి నగరాల్లో లేఅవుట్లు వేసిన వ్యాపారులు ఇప్పుడెక్కడున్నారో తెలియదు. పేరొందిన స్థిరాస్తి వ్యాపార సంస్థలైతే సులువుగా గుర్తించవచ్చు. చిన్నాచితక సంస్థలు, వ్యాపారుల చిరునామా తెలుసుకొని, వారిని ప్రశ్నించడం సాధ్యమయ్యే పని కాదు.
5% పన్ను.. మరో 5% అపరాధ రుసుము: ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్దేశించిన విలువపై 5% చొప్పున నాలా పన్ను, మరో 5% అపరాధ రుసుము చెల్లించాలంటే కొనుగోలుదారులకు తడిసిమోపెడవుతుంది. విజయవాడ నగర శివారులో ఒక వ్యక్తి 2007లో గజం రూ.15 వేల ధరకు 200 గజాల విస్తీర్ణం గల ప్లాట్ని రూ.30 లక్షలకు కొన్నారు. అదే గజం స్థలం ధర ప్రస్తుతం రూ.30 వేలు ఉంది. అంటే ప్లాట్ విలువ రూ.60 లక్షలు. దీనిపై 5% నాలా పన్ను రూ.3 లక్షలు, 5% అపరాధ రుసుము కింద మరో రూ.3 లక్షలు కలిపి మొత్తం రూ.6 లక్షలు కట్టాలి. సీఆర్డీఏ, వుడా, తుడా వంటి పట్టణాభివృద్ధి సంస్థల్లో స్థలాల విలువ ఎక్కువ అయినందున ఇప్పుడు వారు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారిలో 60% వరకు మధ్య తరగతి కుటుంబాలు ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు బ్యాంకుల్లో అప్పులు చేసి కొనుగోలు చేస్తుంటారు. ప్లాట్ కొన్నందుకు చేసిన అప్పులు తీరకముందే.. నాలాపన్ను ఏంటని విజయవాడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వాపోయారు.
4నగరాల్లో 450 లేఅవుట్లు రూ. 500 కోట్లు
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో నాలా పన్ను చెల్లించని దాదాపు 450 లేఅవుట్లను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అత్యధికంగా విశాఖలో 150 లేఅవుట్లు ఉన్నాయి. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా వీటిని గుర్తించి నోటీసులు సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో ఇప్పటికే కొన్ని నోటీసులు జారీ చేశారు. మిగతా నగరాల్లోనూ త్వరలో ఇవ్వనున్నారు. నాలుగు నగరాల్లో రూ.500 కోట్లకుపైగా పన్ను వసూలు చేయాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలరాతలు మార్చేది ఓటే.. ఓటరును చైతన్యపరుస్తున్న చిన్న పుస్తకం
‘ఏ సమాజంలో నీతి తప్పినవాళ్లు విజయం సాధిస్తారో.. నేరస్థులు ఆరాధ్యులుగా మారతారో, విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో.. అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా పట్టించుకోకుండా తమకు కావాల్సిన వాటా కోసం ఎక్కడైతే ప్రజలు అర్రులు చాస్తుంటారో.. అక్కడ వ్యవస్థ పునఃసమీక్షకు సమయం ఆసన్నమైందని అర్థం’. -
ఇదో నియంత పోకడ.. టీచర్ల ఆవేదనపై కొరకొర
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్ మంచివారే.. పాదయాత్రలో సీపీఎస్పై ఇచ్చిన హామీ అమలు చేయలేదని ఉపాధ్యాయులు అనడం మాత్రం తప్పయిపోయిందట. -
‘అమ్మఒడి’.. మామ కత్తెర!
పిల్లల్ని బడికి పంపండి చాలన్నారు.. అందరికీ ‘అమ్మఒడి’ సాయం అందిస్తామన్నారు.. ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ లబ్ధి కల్పిస్తామన్నారు.. తల్లులను ఆశల పల్లకీ ఎక్కించారు.. ఓట్లు వేయించుకొని అధికారం దక్కించుకున్నారు.. ఆ తర్వాత.. నిబంధనల కత్తి అందుకున్నారు. -
బొండా ఉమా పేరు చెప్పాలంటూ.. ఒత్తిడి చేశారు
‘మీ నాయకులు కానీ బొండా ఉమా కానీ.. సీఎం జగన్పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు.. వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించా.. దీనికి పోలీసులు నాపై రెండు దెబ్బలేశారు. -
జీ‘వి’తాలతో ఆడుకున్నారు
జగన్ ‘ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం’లో ఇవి నిత్యకృత్యం. తన అనుచరగణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచిపెట్టిన జగన్.. ఉద్యోగుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు. -
అవినీతి ‘వర్ధనం’!
ఆయన హయాంలో కొండలు లోయలయ్యాయి.. ఇసుక తోడేయడంతో నదులు గుల్లయ్యాయి.. వ్యాపారుల గల్లాపెట్టెలు ఘొల్లుమన్నాయి.. గుత్తేదారుల ఖాతాలు ఖాళీ అయ్యాయి. -
అర్చకులకు జగన్ శఠగోపం!
వేతనాలు పెంచుతామని గత ఎన్నికల సమయంలో జగన్ అర్చకులను ఆశల ‘పల్లకి’లో ఊరేగించారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు సరిపడా ఖర్చులు అందజేస్తామని హామీ ఇచ్చారు. -
పరుగులు పెడుతున్న ఏపీ గ్రిడ్
రాష్ట్రంలో గ్రిడ్ డిమాండ్ సరికొత్త రికార్డును ఆవిష్కరించింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల చరిత్రలోనే గరిష్ఠంగా శుక్రవారం 13,319 మెగావాట్ల గ్రిడ్ డిమాండ్ నమోదైంది. -
కార్టూన్
-
భూమి నీదే.. రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం!
‘భూమి నీదే.. రాత్రికి రాత్రే మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం.. అయితే ఏంటి.. భూమి నీదైతే నిరూపించుకో?’ అంటూ వైకాపా నేతలు తెగబడితే ఏ రైతు అయినా ఏం చేయగలరు.. కోర్టులకు వెళ్లే అవకాశం లేకపోతే వారికి న్యాయం ఎక్కడ లభిస్తుంది..? -
బకాయిల సొమ్ము అందక ఉద్యోగులకు ఇబ్బందులు
ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యతతో ముందుకెళ్దామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. -
ప్రజాప్రభుత్వం వస్తుంది.. కష్టాలన్నీ తీరతాయి
‘రెండునెలలు ఓపిక పట్టండి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందరి కష్టాలు తీరతాయి’ అని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. మంగళగిరి చేనేతకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవడమే లక్ష్యంగా నారా లోకేశ్ పనిచేస్తున్నారన్నారు. -
మల్లన్న సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి
శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. -
వ్యాపార సంస్థలా.. వైకాపా
వైకాపాలో ఇమడలేక ఆ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ పదవికి అనంత రామకృష్ణప్రసాద్ రాజీనామా చేశారు. -
నేర చరిత్ర వివరాలేవి?
తన తండ్రి, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్రెడ్డి నేర చరిత్రపై వైకాపా అధ్యక్షుడు, సీఎం జగన్ ఎన్నికల సంఘానికి ఎందుకు నివేదిక ఇవ్వలేదని సునీత ప్రశ్నించారు. -
వైకాపా అవినీతి ‘పురం’పర!
వైకాపాలోని పెద్ద తలకాయలన్నీ.. గనులు, మద్యం, ఇసుకలో వేల కోట్లు కొల్లగొడితే.. ఆ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఛోటా నాయకులు.. ఊళ్ల మీద పడి దోచుకుతింటున్నారు. -
వెయ్యి పెంచి.. లక్షలు ముంచి
అన్న వస్తున్నాడు అంటే... ఆనందపడ్డాం... మాట తప్పడు అంటే మురిసిపోయాం... అధికారంలోకి వచ్చాక మా వేతనాలు పెంచితే.. మా ఇళ్లలో రెండు పూటల పొయ్యి వెలుగుతుందనుకున్నాం. -
ఒంటిమిట్టలో నేడు సీతారాముల కల్యాణం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. -
తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు ప్రారంభం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్ప స్వామివారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. -
ఎన్డీయే కూటమి అభ్యర్థులకే పెన్షనర్ల ఓటు
జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎన్డీయే కూటమికి ఓటు వేసి గెలిపిస్తామని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ ప్రకటించింది. -
పురోహితుడిపై ఆకతాయిల వికృత చేష్టలు
పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడితో ఆ కార్యక్రమంలోనే పాల్గొన్న కొందరు అమానవీయంగా ప్రవర్తించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదుల కూల్చివేత.. అడ్డుకున్న తెదేపా
-
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
-
‘పచ్చని’ పోలింగ్ బూత్.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!
-
చైనా అనుకూలుడికే ‘మాల్దీవులు’ పట్టం.. భారత్తో దౌత్యం జరిపేనా!