‘ముఖ్య విషయాలు’ మోదీతో మాట్లాడతా
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్ వచ్చారు. ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్న ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
రష్యా-భారత్ బంధాన్ని అందరూ అర్థం చేసుకున్నారు
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
గుజరాత్లో బిజీబిజీగా తొలిరోజు పర్యటన...
దిల్లీ, అహ్మదాబాద్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్ వచ్చారు. ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్న ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బసచేసే హోటల్ వరకూ మొత్తం 4 కిలోమీటర్ల మేర ఆయన్ను ర్యాలీగా తోడుకొని వెళ్లారు. దారి పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో శుక్రవారం దిల్లీలో సమావేశమవుతానని... వాణిజ్యం, భద్రత సహా పలు ముఖ్యమైన విషయాలపై ఆయనతో చర్చిస్తానని జాన్సన్ చెప్పారు.
సబర్మతి ఆశ్రమం సందర్శన
జాన్సన్... సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడున్న మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. బాపూజీ రచించిన ‘గైడ్ టు లండన్’, ఆయన శిష్యురాలు మీరాబెన్ ఆత్మకథ ‘ద స్పిరిట్స్ పిల్గ్రిమేజ్’ పుస్తకాలను ఆశ్రమ నిర్వాహకులు ఆయనకు అందజేశారు. అసాధారణమైన వ్యక్తికి చెందిన ఆశ్రమానికి రావడాన్నీ... ప్రపంచాన్ని మార్చేందుకు అహింస, సత్యాలను ఆయన మూలసూత్రాలుగా మార్చుకున్న విషయాన్ని తెలుసుకోవడాన్ని తాను గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు జాన్సన్ అక్కడ రాసిన తన సందేశంలో పేర్కొన్నారు.
గాంధీ నివసించిన హృదయ్ కుంజ్ వద్ద చరఖా తిప్పారు. ఆశ్రమ నిర్వాహకులు జాన్సన్కు చరఖా నమూనా ప్రతిని ఆయనకు బహుమతిగా అందజేశారు. సబర్మతి ఆశ్రమాన్ని బ్రిటన్ ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి.
ఆ బంధం తెలిసిందే...
గుజరాత్లోని పంచమహల్ జిల్లా, హలోల్లో ఉన్న బ్రిటన్ నిర్మాణ సామగ్రి సంస్థ జేసీబీ తయారీ కేంద్రాన్ని జాన్సన్ సందర్శించారు. అక్కడ కొత్త కర్మాగారాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్ సంక్షోభం విషయమై బ్రిటన్ ఇప్పటికే దౌత్యస్థాయిలో ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. భారత్-రష్యాల మధ్య భిన్నమైన చారిత్రక సంబంధాలు ఉన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. ఉక్రెయిన్లోని బుచాలో జరిగిన దారుణాలను భారత్ తీవ్రంగా ఖండించింది’’ అని జాన్సన్ పేర్కొన్నారు. బ్రిటన్కు చెందిన ఎడిన్బరో విశ్వవిద్యాలయ సహకారంతో గాంధీనగర్లో ఏర్పాటవుతున్న బయోటెక్నాలజీ యూనివర్సిటీని, అక్షరధామ్ ఆలయాన్నీ సందర్శించారు.
అదానీ గ్రూప్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి...
అహ్మదాబాద్ శివారు శాంతిగ్రామ్లోని అదానీ గ్రూప్ గ్లోబల్ హెడ్క్వార్టర్స్కు వెళ్లిన జాన్సన్... ఆ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు. భారత్ తన సాయుధ బలగాలను 2030 నాటికి ఆధునికీకరించేందుకు సుమారు రూ.23 లక్షల కోట్లు (300 బిలియన్ డాలర్లు) వెచ్చించనున్న క్రమంలో- రక్షణ రంగంలో సహకారం పట్ల వారి మధ్య ప్రధానంగా చర్చ సాగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంధనం, ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీ, క్లైమేట్ యాక్షన్ తదితర అంశాలపైనా వారిద్దరూ చర్చించారు.
అభివాదం... వివాదాస్పదం...
జేసీబీ కర్మాగారాన్ని జాన్సన్ ప్రారంభించిన అనంతరం.. అక్కడున్న బుల్డోజర్పైకి ఎక్కారు. చేతులు ఊపుతూ మీడియా ప్రతినిధులకు అభివాదం చేశారు. వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన మతపరమైన విద్వేషాల క్రమంలో- భాజపా పాలిత దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పలు ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. భాజపా పాలిత ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ బుల్డోజర్లను ఉపయోగించి పలు నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలో జాన్సన్ బుల్డోజరుపైకి ఎక్కి చేతులు ఊపడం తీవ్ర చర్చకూ, విమర్శలకూ తావిచ్చింది.
భారతీయ నిపుణులకు మరిన్ని వీసాలు!
నిపుణులైన భారతీయులకు మరిన్ని వీసాలు మంజూరు చేస్తామని బ్రిటన్ ప్రధాని జాన్సన్ వెల్లడించారు. ఉభయ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయమై జరుగుతున్న చర్చల్లో ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బ్రిటన్లో ఐటీ, ప్రోగ్రామింగ్ రంగాల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉందన్నారు. విదేశీయులు తమ దేశానికి రావడాన్ని ఆహ్వానిస్తున్నామని, వేల సంఖ్యలో నిపుణులకు వీసాలు జారీచేస్తామని జాన్సన్ చెప్పారు. యూకేలో స్కిల్స్ ఆధార వీసా పొందినవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. గత ఏడాది మొత్తం 67,839 మందికి బ్రిటన్ నైపుణ్య వీసాలు జారీచేసింది. 2019లో జారీచేసిన వాటి కంటే ఇవి 14% అధికం. చదువు తర్వాత పనిచేసుకునేందుకు అవకాశం కల్పించడంతో... బ్రిటన్ విద్యాసంస్థల్లో చేరుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి