పనిని బట్టే పదవులు
పార్టీ కోసం నిబద్ధత, అంకితభావంతో కష్టపడే నాయకులు, కార్యకర్తలకే నిజమైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల రాజకీయ, ఆర్థిక సాధికారికతకు, వారిని ఆరోగ్యవంతులుగా ఉంచేందుకు ప్రత్యేక సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
అందరి వివరాలూ డిజిటల్ కార్డుల్లో నిక్షిప్తం
పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం
కార్యకర్తల ఆరోగ్యానికి న్యూట్రిఫుల్ కార్యక్రమం
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు వెల్లడి
ఈనాడు, అమరావతి: పార్టీ కోసం నిబద్ధత, అంకితభావంతో కష్టపడే నాయకులు, కార్యకర్తలకే నిజమైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల రాజకీయ, ఆర్థిక సాధికారికతకు, వారిని ఆరోగ్యవంతులుగా ఉంచేందుకు ప్రత్యేక సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆరోగ్యం కోసం న్యూట్రిఫుల్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని పార్టీ చేపడుతుందన్నారు. పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ప్రారంభించారు. పార్టీ ఉండవల్లి గ్రామ కమిటీ ప్రతినిధులు ఆయనకు సభ్యత్వం ఇచ్చారు. ఆన్లైన్లో సభ్యత్వం నమోదు చేసుకున్న చంద్రబాబు, సభ్యత్వ రుసుమును, పార్టీ కోసం రూ.లక్ష విరాళాన్ని ఆన్లైన్లోనే చెల్లించారు. ప్రతి కార్యకర్త వివరాల్నీ, పార్టీ కోసం వారు చేసిన సేవలు, ఇచ్చిన విరాళాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తామన్నారు. ‘డిజిటల్ సభ్యత్వం నాయకులతో సంబంధం లేకుండా అందర్నీ తెదేపా కుటుంబంలో భాగం చేస్తుంది. వాట్సప్, టెలిగ్రాం, మన టీడీపీ యాప్ల ద్వారా ఎవరికి వారే ఆన్లైన్లో సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు’ అని తెలిపారు. సభ్యత్వం నమోదు చేసుకున్నవారు పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు వారి కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వారి సమగ్ర వివరాలు తెలుస్తాయన్నారు. పార్టీకి చేసిన సేవలను బట్టే.. వారికి తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఉంటాయన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల వివరాల్ని 360 డిగ్రీల్లో పరిశీలించి, వారి పూర్తి సమాచారాన్ని డిజిటల్ కార్డుల్లో నిక్షిప్తం చేస్తామని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు... రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని నాయకులు, ప్రజలతో మాట్లాడారు.
సెకనుకు 8,765 మంది ప్రయత్నం
పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించగానే విశేష స్పందన లభించిందని, ఆన్లైన్లో సభ్యత్వ నమోదుకు సెకనుకు 8,765 మంది ప్రయత్నించారని చంద్రబాబు తెలిపారు. దానివల్ల సర్వర్ కొంత సేపు మొరాయించిందని, దాన్ని వెంటనే పునరుద్ధరించారని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలు, నాయకుల వివరాలను వాటిలో నిక్షిప్తం చేసే బాధ్యతను నారా లోకేశ్, చింతకాయల విజయ్, కిలారు రాజేష్, మద్దిపాటి వెంకట్రాజులకు అప్పగిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. వారి పనితీరును ప్రతి 15 రోజులకు తాను సమీక్షిస్తానన్నారు. ‘నా ఆలోచనలు ఎప్పుడూ మిగతా వారికంటే 10-15 ఏళ్లు ముందుంటాయి. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ తెదేపా ఎప్పుడూ ముందుంటుంది. మన జీవితాల్లో టెక్నాలజీ అనివార్యమైపోయింది. ప్రతి నాయకుడూ దాన్ని వినియోగించుకోవాలి’ అని తెలిపారు.
ఉదారంగా విరాళాలివ్వండి
పార్టీకి ప్రతి ఒక్కరూ ఉదారంగా విరాళాలివ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రూ.9,99,999 విరాళమిచ్చిన లోహిత్ని ఆయన అభినందించారు. ‘పార్టీకి 60-70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మీ శక్తిని బట్టి విరాళాలు ఇవ్వండి. పార్టీ సభ్యత్వ నమోదుపై ట్రయల్ నిర్వహిస్తున్న సమయంలోనే 20వేల మంది సభ్యులుగా చేరారు. సభ్యత్వ రుసుముగా రూ.20 లక్షలు రావాలి. కానీ రూ.48 లక్షలు వచ్చింది. అంటే రూ.28 లక్షలు విరాళంగా వచ్చింది’ అని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో యువతకు 40% టికెట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పార్టీలోని వివిధ విభాగాలకు సమాంతరంగా ఎన్నికల ప్రక్రియ కోసం క్లస్టర్, యూనిట్, బూత్స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతి 100 మంది ఓటర్లకు ఒకర్ని బాధ్యులుగా నియమిస్తామని తెలిపారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అనుసరించిన ఈ నమూనాను రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. తెదేపా చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రతి ఇంటికీ నాయకులు వెళ్లాలన్నారు. తానూ ఐదు ప్రాంతాలకు వెళతానన్నారు.
అండమాన్-నికోబార్ నుంచి తెదేపా నాయకులు మాట్లాడుతూ... ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండు కౌన్సిలర్ స్థానాల్ని గెలుచుకున్నామని, భాజపాతో కలసి అధికారంలోకి వచ్చామని తెలిపారు. మేయర్ పదవిని తలో సగం కాలం పంచుకున్నామన్నారు. అండమాన్-నికోబార్ విభాగాన్ని అధికారికంగా గుర్తిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM