Andhra News: పోలవరం పూర్తయ్యేదెప్పుడో చెప్పలేం
పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. నేను తేదీ ఏదీ చెప్పడం లేదన్నారు. ముందు డయాఫ్రం వాల్ సమస్య తేలాలి.. దాన్ని బట్టే పోలవరం ఎప్పటికి పూర్తి చేయగలమనేది
ముందు డయాఫ్రం వాల్ సమస్య తేలాలి
దానిని బట్టే ప్రాజెక్టు గడువు తేలుతుంది
ఈ విధ్వంసానికి చంద్రబాబే కారణం
జలవనరుల మంత్రి అంబటి
ప్రశ్నలు అడిగిన ‘ఈనాడు’ విలేకరిపై రాంబాబు రుబాబు
ఈనాడు - అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. నేను తేదీ ఏదీ చెప్పడం లేదన్నారు. ముందు డయాఫ్రం వాల్ సమస్య తేలాలి.. దాన్ని బట్టే పోలవరం ఎప్పటికి పూర్తి చేయగలమనేది తేలుతుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం సమస్యకు చంద్రబాబు మిడిమిడి జ్ఞానమే కారణమని విమర్శించారు. చంద్రబాబు చరిత్రాత్మక తప్పిదాల వల్ల, ఆయన ఒక ప్రణాళిక లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ‘మొదట నేను చెప్పేది పూర్తిగా వినండి. మధ్యలో అడ్డు రావద్దు.. ఆ తర్వాత మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెబుతా’ అంటూ పోలవరం ప్రాజెక్టుపై శనివారం విలేకరుల సమావేశం ప్రారంభించిన రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ‘ఈనాడు’ విలేకరి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. మా వార్తను విమర్శించారు కదా డిబేట్ చేద్దాం అని ‘ఈనాడు’ ప్రతినిధి అంటే మీతో డిబేట్ చేయను.. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పను.. దయ చేయొచ్చు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘పోలవరంలో ఎవరిది వైఫల్యం’ అంటూ ఈనాడు రాసిన వార్తలపై విమర్శలు గుప్పించారు. అంబటి ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం డయాఫ్రం వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. అక్కడ నీళ్లు తోడివేయాలంటే రూ.2,100 కోట్లు ఖర్చవుతుంది. డ్రెడ్జింగ్ చేయాలంటే రూ.800 కోట్లవుతుంది. నిపుణులు వచ్చి పరిశీలిస్తున్నారు. డయాఫ్రం వాల్ కొత్తది నిర్మించాలా, పాతది సరిదిద్దాలా అని తర్జనభర్జన పడుతున్నారు. వారిచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్లాలి. ఈలోగా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఈ వైఫల్యాలు ముఖ్యమంత్రి జగన్వి, ఈ ప్రభుత్వానివి అని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే డయాఫ్రం వాల్ విచ్ఛిన్నమైందని రాశారు. తొలుత స్పిల్వే నిర్మించి గోదావరి నదిని మళ్లించి, ఆ తర్వాత కాఫర్ డ్యాంలు కట్టి డయాఫ్రం వాల్ నిర్మించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. పునరావాసం పూర్తి చేయకపోవడం వల్లే ఎగువ కాఫర్ డ్యామ్ను మధ్యలో గ్యాప్లతో వదిలేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలుత పునరావాసం కల్పించి, ఆ తర్వాత ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాం. స్పిల్ వే నిర్మించాం. పోలవరంలో అన్ని పనులూ సమాంతరంగా చేసేందుకు ప్రయత్నించడం వల్లే ఈ ఇబ్బంది ఎదురయింది. కాఫర్ డ్యాంలు సగం సగం కట్టి.. డయాఫ్రం వాల్ నిర్మించడం చారిత్రక తప్పిదం కాదా అని ప్రశ్నిస్తున్నా.
మీ ఇష్టమొచ్చినట్లు రాసుకోండి..
జలవనరుల మంత్రి తాను చెప్పదలుచుకున్నది పూర్తయిన తర్వాత విలేకరులను ప్రశ్నలు అడగమన్నారు. ‘ఈనాడు’ విలేకరి ప్రశ్నలు అడిగితే రాంబాబు రుబాబు ప్రదర్శించారు. విలేకరి.. సర్ అని ప్రశ్నలు అడిగినా ఆయన ఏకవచనంతో నువ్వు నువ్వు అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. ఒక్కో పత్రికకు ఒక్కో సమాధానం ఉంటుందన్నారు. ప్రశ్నలు వేయకుండానే నువ్వు ఆగవయ్యా.. నువ్వు ఆగు.. నాలా ఎందుకు ఆవేశపడుతున్నావంటూ తనే ఆవేశపడుతూ అసహనం ప్రదర్శించారు.
ఈనాడు: పోలవరంలో ఈ నిర్ణయాలు తీసుకున్నది చంద్రబాబు అని చెబుతున్నారు. వీటికి కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ ఆమోదం ఉందా లేదా?
మంత్రి అంబటి: ఉండి ఉండొచ్చు
ఈనాడు: ఉండి ఉండొచ్చు అని కాదు సర్, ఉందా లేదా కచ్చితంగా చెప్పండి
మంత్రి: ఏమిటి ఆవేశపడుతున్నారు? మీది ఏ పత్రిక?
మరో విలేకరి: పత్రికలను బట్టి సమాధానం ఉంటుందా అండీ?
మంత్రి: ఉంటుంది. ఈనాడు వారికి ఒక సమాధానం ఉంటుంది. ఆంధ్రజ్యోతికి మరో సమాధానం ఉంటుంది. మిగిలినవారికి వేరేగా ఉంటుంది. ఈనాడు వారికి చాలా ప్రత్యేక సమాధానం ఉంటుంది. ఆంధ్రజ్యోతి వారికి ఇంకా ప్రత్యేక సమాధానం ఉంటుంది. ఇందులో ఏం సందేహం లేదు. మీరు దురుద్దేశపూర్వకంగా ఉన్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని తొందరపడుతున్నారు.
ఈనాడు విలేకరి నిజం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందా? అని ప్రశ్నించబోగా.. మంత్రి కల్పించుకుంటూ ‘ఆగండి మీరు కంగారు పడతారెందుకు, ఆవేశపడకండి..మీ జీతాలు మీకు వస్తాయి.. నాలాగా ఎందుకు ఆవేశపడతావు?’ అన్నారు.
మంత్రి: పీపీఏ అనుమతి ఉందా లేదా సీడబ్ల్యుసీ అనుమతి ఉందా లేదా అంటున్నారు. ఉండొచ్చు!
ఈనాడు: అది కాదు సర్.. ఉందా లేదా చెప్పండి. ఇప్పటికే అది జరిగిపోయిన అంశం. మీరు మంత్రి కాబట్టి ఆ నిర్ణయాలకు కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ ఆమోదం ఉందా లేదో స్పష్టంగా చెప్పండి.
అంబటి: ఉంది. వారి అనుమతి తర్వాతే ఈ పనులు అన్నీ జరిగాయి.
ఈనాడు: ఈ నిర్ణయాలు అజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో తీసుకున్నవని మీరు అన్నారు. కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ అనుమతి ఉన్నందున వారిదీ మిడిమిడి జ్ఞానం అంటారా?
మంత్రి: ఎవరైనా సరే ఇది అజ్ఞానంతో చేసిన పని. కేంద్ర జలసంఘాన్ని, డీడీఆర్పీని నాతో విమర్శించేలా చేయాలనుకుంటున్నావేమో. నేను అలా చేయను.
ఈనాడు: మేం రాసిన వార్తను మీరు నేరుగా విమర్శిస్తున్నారు. అందువల్ల నేను ప్రశ్నిస్తున్నాను.
మంత్రి: నీకేం కావాలి, అడుగు!
ఈనాడు: ఈ నిర్ణయాలు అజ్ఞానమైనవని అన్నారు. పీపీఏ, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ ఆమోదం ఉందంటున్నారు. వారిదీ అజ్ఞానమే అని మీరు చెబుతున్నారా?
మంత్రి: నువ్వు రేపు రాయదలుచుకున్నది అదే కదా.. ఏం హెడ్డింగు పెట్టుకుంటావో పెట్టుకో.
ఈనాడు: మీరు ఏం చెబితే అదే రాస్తాం..
మంత్రి: పీపీఏ అజ్ఞానం, కేంద్ర ప్రభుత్వానిది అజ్ఞానం అని హెడ్డింగు పెట్టాలనుకుంటున్నావు. పెట్టుకో. నీ ఇష్టం. నీ జామకాయ కడుక్కు తింటావో, ముంచుకు తింటావో నీ ఇష్టం.
మరో విలేకరి: ఆయన ప్రశ్న అడిగితే జామకాయ కడుక్కోవడం అనడం ఏమిటి సమాధానం చెప్పొచ్చు కదా!
మంత్రి: మీరు ఏ విలేకరి (ఆయన తన పత్రిక పేరు చెబితే నువ్వు ఆయనకు సపోర్టు చేయక్కర్లేదు. నువ్వు కూర్చో)
ఈనాడు: వాళ్లని తప్పుపడుతున్నారా?
మంత్రి: నీ ఇష్టమొచ్చింది నువ్వు రాసుకో. ఒకవేళ పీపీఏ వాళ్లని అప్పటి ప్రభుత్వం ఒప్పించి ఉండొచ్చు. పునరావాసం పూర్తి చేస్తామని ఉండొచ్చు.
ఈనాడు: వారు ఏం చెప్పారో మీటింగు మినిట్స్లో ఉంటాయి కదా సర్..
మంత్రి: నేను ఇంకా అవేం చూడలేదు.
ఈనాడు: జలవనరుల మంత్రిగా మీరు చెప్పాలి కదా..
మంత్రి: నువ్వు అడిగావు. నేను చెప్పాను. ఇక క్లోజ్. ఇక అడక్కు.. నీకు కావాల్సిన సమాధానం నేను చెప్పను. ఇక నీకు సమయం కేటాయించను.
మరో విలేకరి: 41.15 మీటర్లకు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారు?
మంత్రి: వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. అది తొలిదశ. సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం.
విలేకరి: మీరు అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేస్తారా?
మంత్రి: అదే చిత్తశుద్ధితో ఉన్నాం.
విలేకరి: ప్రాజెక్టుకు గడువు ఏమైనా పెట్టుకున్నారా?
మంత్రి: అలాంటిది పెట్టుకుంటే చెబుతాం. నేను ఎలాంటి తేదీ ఇవ్వడం లేదు. ఇప్పడు పరిస్థితి అనిశ్చితంగా ఉంది. డయాఫ్రం వాల్ దెబ్బతింది. అది దెబ్బతినకపోతే ప్రాజెక్టు పూర్తయ్యేది. ఆ డయాఫ్రం వాల్ను ఏం చేయాలనే దానిపైనే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనేది తేలుతుంది. దాని మీదే పోలవరం ప్రాజెక్టు పురోగతి ఆధారపడుతుంది. నిపుణులు వచ్చారు. వారు నివేదిక ఇచ్చిన తర్వాతే ఎప్పుడనేది తేలుతుంది.
విలేకరి: డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఎప్పుడు గుర్తించారు?
మంత్రి: అప్పుడే గుర్తించారు
విలేకరి: మరి మూడేళ్లలో ఎందుకు ప్రత్యామ్నాయం చూడలేదు?
మంత్రి: 2020 మార్చిలో పీపీఏ సమావేశంలో చర్చించాం. ఇది దెబ్బతిందని చర్చించాం. డ్యాం రీ డిజైన్ చేయాలని ప్యానెల్ను అడిగాం. ప్రపంచంలో ఎక్కడా ఇలా డయాఫ్రం వాల్ దెబ్బతినలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. -
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల విచారణ నుంచి...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
929 మంది వాలంటీర్లను తొలగించాం
ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని ఉల్లంఘించినందున 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు నివేదించారు. -
సంక్షిప్త వార్తలు
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ను పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే!
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’