Rushikonda beach: రుషికొండ పిండి
విశాఖలోని రుషికొండ వద్ద పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న పనుల్లో తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి (సీఆర్జడ్) నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
విశాఖ సాగర తీరంలో పరిమితికి మించి తవ్వకాలు
సీఆర్జడ్ అనుమతుల అమలుపై అనుమానాలు?
పది కి.మీ. మేర తీరంలో గ్రావెల్ డంపింగ్
ఈనాడు, విశాఖపట్నం: విశాఖలోని రుషికొండ వద్ద పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న పనుల్లో తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి (సీఆర్జడ్) నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పరిమితికి మించి తవ్వేయడంతో తీర ప్రాంత సహజ వాతావరణం దెబ్బతింటోందని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు సీఆర్జడ్ అనుమతులకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) దరఖాస్తు చేయగా కేంద్ర అటవీ పర్యావరణశాఖ గత ఏడాది మే 19న నిబంధనలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన నివేదికలోని అంశాలు బయటకు వచ్చాయి. ఆ అనుమతులకు భిన్నంగా క్షేత్ర స్థాయిలో పలు ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కేంద్ర అటవీ శాఖకు వాస్తవ సమాచారం ఇవ్వలేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
* మొత్తం 61 ఎకరాల రుషికొండ ‘హిల్ ఏరియా’లో 9.88 ఎకరాల్లో ప్రాజెక్టుకు ఏపీటీడీసీ అనుమతి తీసుకోగా... క్షేత్ర స్థాయిలో దీనికి రెండింతల తవ్వకాలు జరిగినట్లు కనిపిస్తోంది. కొండ మధ్యలో చిన్న భాగం తప్ప మిగిలిన అంతటా భారీగా తవ్వేశారు. శిఖర భాగాన్ని వదిలి చుట్టూ తవ్వకాలు జరిపారు. అటవీశాఖ 139 చెట్లు తొలగించినట్లు పేర్కొనగా... వందల సంఖ్యలో చెట్లను తొలగించినట్లు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* సీఆర్జడ్ అనుమతుల్లో భాగంగా వీఎంఆర్డీఏ (విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ) పేర్కొన్న బృహత్తర ప్రణాళిక (మాస్టర్ప్లాన్) నిబంధనలు పాటించాలి. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేయడంలో కేంద్ర అటవీశాఖను తప్పుదోవ పట్టించినట్లు విమర్శలు వస్తున్నాయి. వివిధ రకాల అనుమతులకు మే నెలకు ముందే దరఖాస్తు చేసి ఆగస్టులో పనులు మొదలుపెట్టారు. అప్పటికి ‘2041 మాస్టర్ ప్లాన్’ అమల్లోకి రాకపోవడంతో 2021 ప్లాన్ను ప్రాతిపదికగా తీసుకోవాలి. దీని ప్రకారం ఈ ప్రాంతం అటవీ సంరక్షణ పరిధిలోని సీఆర్జడ్ -1లో ఉంది. అంటే ఇక్కడ నిర్మాణాలకు వీలు కాదు. ఈ నేపథ్యంలో అమలులోకి రాని ‘2041 మాస్టర్ప్లాన్’ ప్రకారం నిర్మాణాలకు వీలయ్యే సీఆర్జడ్-2 పరిధిలో చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నూతన ప్రణాళిక నవంబరు నుంచి అమల్లోకి వచ్చింది.
సముద్ర తీరం కలుషితం
రుషికొండ వద్ద తవ్విన మట్టిని సముద్ర తీరంలో పలు చోట్ల డంపింగ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం తవ్వకాల ద్వారా వచ్చిన వాటిని నీటి వనరులు, పక్కనే ఉన్న ప్రదేశాల్లో వేయకూడదు. ప్రాజెక్టు పూర్తయ్యాక అంతకు ముందున్నట్లుగా ఆయా ప్రాంతాలు పునరుద్ధరించాలి. దీనికి విరుద్ధంగా వేలాది టన్నుల గ్రావెల్ను సముద్ర తీరంలో పారబోశారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పేరుతో తీర ప్రాంత సహజత్వాన్ని పూర్తిగా దెబ్బతీశారు. లారీల్లో మట్టిని తరలించి చేపల తిమ్మాపురం నుంచి ఎర్రమట్టి దిబ్బల వరకు సుమారు పది కిలోమీటర్ల మేర తీరం వెంట పోశారు. చాలాచోట్ల పది అడుగుల ఎత్తు వరకు మట్టి వేసి చదును చేశారు. మంగమారిపేట, మరికొన్ని చోట్ల ఈ మట్టి ఏకంగా సముద్రంలోకి జారిపోతుంది. దీనివల్ల ఇసుక తిన్నెలు సహజ వాతావరణానికి ముప్పు ఏర్పడుతోంది. సాగర జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పర్యావరణవేత్తలు, మత్స్యసంపదపైనా ప్రభావం ఉంటుందని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* నిర్మాణాలు చేపడుతున్న గుత్తేదారు లేబర్ క్యాంపు ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద సంఖ్యలోని లారీలు, ఇతర యంత్రాలను అక్కడే ఉంచుతున్నారు. ఈ పనుల ప్రగతి నివేదికను ఏపీటీడీసీ వెబ్సైట్లో నిర్ణీత కాలంలో ఉంచాల్సినప్పటికీ పెట్టలేదు. ‘సీఆర్జడ్ నిబంధనల మేరకే పనులు చేస్తున్నాం. ఎక్కడా మీరడం లేదు. వాహనాలు తిరగడానికి వీలుగా పనులు చేయడంతో ఎక్కువ విస్తీర్ణంలా కనిపిస్తుంది. ల్యాండ్ స్కేపింగ్ వంటి పనులు చేసి ప్రాజెక్టు 9.88 ఎకరాల్లోకే పరిమితం చేస్తాం. మిగిలిన ప్రాంతాన్ని కొండలా మారుస్తాం. పర్యాటక శాఖ అవసరాల నిమిత్తం కొన్ని చోట్ల గ్రావెల్ డంపింగ్ చేశాం’ అని ఓ అధికారి పేర్కొన్నారు.
కోర్టు ధిక్కరణ కింద
రుషికొండ వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేపడుతున్నారని గతంలో హైకోర్టును ఆశ్రయించాం. దీనిపై విచారించిన న్యాయస్థానం కేంద్ర అటవీ పర్యావరణశాఖ నిబంధనలు మేర పనులు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు పనులు చేయాల్సినప్పటికీ ఉల్లంఘిస్తున్నారు. అలల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని హై టైడ్ లెవల్(హెచ్టీఎల్)కు కనీసం 200 మీటర్ల దూరంలో ‘నో కన్స్ట్రక్షన్ జోన్’ ఆవలే ఈ పనులు చేపట్టాలి. ఇక్కడ మాత్రం దానిని మీరి తవ్వకాలు చేస్తున్నారు. ఈ పనులు కొన్ని చోట్ల వంద మీటర్ల లోపు ఉన్నాయి. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని ఏపీటీడీసీ ఎండీ, విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొని కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశాం.
- పీతల మూర్తి యాదవ్, కార్పొరేటర్, విశాఖ
తీరం భయానకం
తవ్విన గ్రావెల్ తీసుకొచ్చి తీరంలో వేశారు. తీరంలోని ఇసుక తిన్నెల వద్ద గ్రావెల్ కనిపిస్తోంది. ఇక్కడి తీరంలోకి సముద్ర తాబేళ్లు గుడ్లు పొదగడానికి వస్తాయి. ఇసుక లేకపోవడంతో వాటిని ప్రమాదంలోకి నెట్టినట్లు అయింది. ఇతర మత్స్యరాశుల జీవనంపైనా ఇది ప్రభావం చూపుతుంది.
- తెడ్డు శంకర్, మత్స్యకార యువజన సంక్షేమ సంఘం కార్యదర్శి
గ్రావెల్ బీచ్లో పడేస్తే ఎలా?
రుషికొండ వద్ద ఉన్న భవనాలను ‘రీ డెవలప్’ చేస్తామని మాత్రమే ఏపీటీడీసీ కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నుంచి అనుమతి తీసుకుంది. దాని ప్రకారం అక్కడ కేవలం భవనాల్లో మార్పులు మాత్రమే చేపట్టాలి. ఏకంగా భవనాలు కూల్చేసి కొండంతటినీ తవ్వేస్తున్నారు. తవ్విన మట్టిని ఎక్కడ వేస్తున్నారో చెప్పాలి. అదీ పేర్కొనలేదు. ఈ పర్యావరణ అనుమతులు చెల్లవు. ఇక్కడి గ్రావెల్ తీసుకువెళ్లి బీచ్లో పడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మత్స్యసంపదపై తీవ్ర ప్రభావం పడుతుంది. అక్కడి ఇసుక ఆధారంగా చేపలు పెరుగుతాయి. దాని స్వరూపాన్ని మార్చడంతో చేపల లభ్యత తగ్గిపోతుంది. కొండను తవ్వేయడంతో వర్షాల సమయంలో అదంతా కిందకు జారిపోయే ప్రమాదం ఉంటుంది. నగరాభివృద్ధి సంస్థల చట్టం ప్రకారం కొండలను కాపాడాలి. వాటిపై పచ్చదనం పెంచాలి. ఈ ప్రాంతంలో బృహత్తర ప్రణాళికను సవరించాలంటే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. అలా చేయకుంటే న్యాయస్థానంలో దీనిపై పోరాడొచ్చు.
- ఈఏఎస్ శర్మ, విశ్రాంత ఐఏఎస్ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్