RUIA Hospital: మానవత్వానికే మచ్చ
తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అంబులెన్స్ డ్రైవర్లు మాఫియాలా తయారయ్యారు. కుమారుడు చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న ఓ అభాగ్యుడితో అమానవీయంగా వ్యవహరించారు. వేలరూపాయల
రుయాలో అంబులెన్స్ మాఫియా
మృతదేహం తరలింపునకు నాలుగింతల ఛార్జీ డిమాండ్
బయటి నుంచి తెచ్చుకున్నా అడ్డగింత
చేసేది లేక కుమారుడి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన తండ్రి
ఆసుపత్రి ఎదుట పలువురి ఆందోళన
అధికారులపై సస్పెన్షన్ వేటు
తిరుపతి (వైద్యం), న్యూస్టుడే: తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అంబులెన్స్ డ్రైవర్లు మాఫియాలా తయారయ్యారు. కుమారుడు చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న ఓ అభాగ్యుడితో అమానవీయంగా వ్యవహరించారు. వేలరూపాయల ఛార్జీ భరించలేనని మొత్తుకున్నా కనికరించలేదు. అతని యజమాని తక్కువ ధరకు అంబులెన్స్ మాట్లాడి పంపితే.. అడ్డుకున్నారు. చేసేది లేక కుమారుడి మృతదేహాన్ని భుజంపై వేసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరాల్సి వచ్చింది. హృదయవిదారకమైన ఈ ఘటన రుయా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీ కేసీ ఎస్టీ కాలనీకి చెందిన కంభంపాటి నరసింహులు తన కుమారుడు జాషువా(10)ను కిడ్నీ సమస్య కారణంగా ఈ నెల 24న రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి బాలుడు మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆసుపత్రి ప్రాంగణంలోని అంబులెన్స్లను విచారించారు. కొండూరుకు వెళ్లడానికి రూ. 20,000 అడిగారు. కూలి పని చేసుకుని బతికే అతడు అంత డబ్బులు ఇవ్వలేక ఈ విషయాన్ని తన యజమానికి ఫోన్ చేసి చెప్పి ఆవేదన చెందాడు. 110 కి.మీ. దూరానికి అంత డబ్బు ఎందుకన్న ఆయన.. ఆన్లైన్లో పరిశీలించి రూ. 5,000కు ఓ అంబులెన్స్ మాట్లాడి రుయా వద్దకు పంపించారు. అక్కడే ఉన్న అంబులెన్స్ మాఫియా ఆ వాహనాన్ని అడ్డుకుంది. డ్రైవర్ను బెదిరించింది. చేసేది లేక రాత్రి వేళ నరసింహులు కొడుకు మృతదేహాన్ని భుజాలపై వేసుకుని ఆసుపత్రి బయటికి వచ్చారు. అంబులెన్స్తో పాటే వచ్చిన దాని యజమాని తన ద్విచక్ర వాహనంపై ఎక్కమని కోరారు. సుమారు 12 కి.మీ. ప్రయాణించి అక్కడ తాము మాట్లాడుకున్న అంబులెన్స్లో ఎక్కించి మృతదేహాన్ని తన సొంత ఊరికి తీసుకెళ్లారు.
అధికారులపై సస్పెన్షన్ వేటు
మంగళవారం ఉదయం ఈ వ్యవహారం బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డి వెంటనే స్పందించారు. ఆర్డీవో కనక నరసారెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ శ్రీహరి, డీఎస్పీ మురళీకృష్ణతో కమిటీ వేసి వెంటనే ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వారు రుయా ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఇదే సమయంలో అఖిలపక్ష నేతలు అధికారులను అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విచారణ జరిపిన కమిటీ సభ్యులు ప్రైవేటు అంబులెన్స్ మాఫియా నిజమేనని నిగ్గుతేల్చారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎస్ ఆర్ఎంవో సరస్వతీదేవిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆర్డీవో, ఆర్టీవో, పోలీసు, డీఎంహెచ్ఓలతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించి ఆస్పత్రిలో ప్రదర్శిస్తామని తెలిపారు. అంబులెన్స్ను అడ్డుకున్న నరసింహులు, కృష్ణమూర్తి, సురేష్, ప్రభు, శేఖర్, దొరైరాజ్లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
గతంలోనూ ఇదే తీరు
* 2020లో రుయా అత్యవసర విభాగంలోని ఓ రోగిని విశాఖకు తీసుకెళ్లడానికి ఇక్కడి అంబులెన్స్ అసోసియేషన్ సభ్యులు రూ.15,000 అడిగారు. రోగి బంధువులు బయట వేరే వాహనాన్ని రూ.8,000కు మాట్లాడుకుని తీసుకురాగా, మాఫియా సభ్యులు ఆ వాహనం డ్రైవర్పై దాడికి దిగారు.
* 2021లో ఓ రోగిని చెన్నైకి తరలించేందుకు రుయాకు బయటి అంబులెన్స్ను అడ్డుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
* అదే ఏడాది కొవిడ్ సమయంలో ఓ మృతదేహాన్ని తరలించడానికి ప్రైవేటు అంబులెన్స్ యజమాని రూ.10,000 అడిగాడు.
అందరూ బెదిరించారు..
-మృతుడి బంధువు శివకుమార్ ఆరోపణ
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, పెనగలూరు: రుయా ఆసుపత్రిలో నర్సుల నుంచి అంబులెన్సు డ్రైవర్ల వరకు అందరూ బెదిరించారని మృతుడు జాషువా బంధువైన శివకుమార్ ఆరోపించారు. ‘ఓ వైపు చిన్నారి చనిపోయాడనే బాధతో అల్లాడుతుంటే మరోవైపు శవాన్ని త్వరగా తీసుకెళ్లాలి.. లేదంటే మార్చురీకి తరలిస్తామని నర్సులు, సిబ్బంది గట్టిగా హెచ్చరించారు. అంబులెన్స్ డ్రైవర్లు రూ.20,000 డిమాండ్ చేశారు. దిక్కుతోచని స్థితిలో ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకుని బయలుదేరాల్సి వచ్చింది.’ అని వాపోయాడు.
ప్రీ-పెయిడ్ ట్యాక్సీల పరిశీలన: మంత్రి రజని
రుయా ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. మహాప్రస్థానం వాహనాలు రాత్రి సమయాల్లోనూ నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహాల తరలింపునకు ప్రీ-పెయిడ్ ట్యాక్సీలను నడిపే విషయాన్నీ పరిశీలిస్తామని పేర్కొన్నారు.
అక్కరకు రాని మహాప్రస్థానం వాహనాలు
రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో 4 మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్నా.. చిన్నారి జాషువా మృతదేహం తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్లే దిక్కయ్యాయి. నర్సులు మహాప్రస్థానం వాహనదారులకు సమాచారం ఇవ్వకపోవడం.. సంబంధిత ఆర్ఎంఓ అందుబాటులో ఉండి పర్యవేక్షించకపోవడమే దీనంతటికీ కారణంగా కనిపిస్తోంది.
వ్యవస్థల విధ్వంసానికి ఇదే నిదర్శనం: చంద్రబాబు
ఈనాడు, అమరావతి: ‘‘రుయా ఆసుపత్రిలో బాలుడి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమే. ఈ ఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది’’ అని తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వ్యవస్థల విధ్వంసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. తన కుమారుడికి జరిగినంత బాధ కలిగిందని తెదేపా జాతీయ కార్యదర్శి లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
* ఈ ఘటన కలచివేసిందని, ఈ దుస్థితికి ప్రభుత్వమే కారణమని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..