నిత్యం నిర్లక్ష్యపు పరీక్షే
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుల పరంపర కొనసాగుతోంది. ప్రతిరోజూ ఉదయం సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపత్రాలు చక్కర్లు కొట్టడం.. కాసేపటి తర్వాత విద్యాశాఖ మంత్రి, అధికార యంత్రాంగం ప్రశ్నపత్రాలు లీక్ కాలేదు,
ప్రతి రోజూ సామాజిక మాధ్యమాల్లో పదో తరగతి ప్రశ్నపత్రాలు
పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు నిరోధించడంలో విఫలం
ఈనాడు, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుల పరంపర కొనసాగుతోంది. ప్రతిరోజూ ఉదయం సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపత్రాలు చక్కర్లు కొట్టడం.. కాసేపటి తర్వాత విద్యాశాఖ మంత్రి, అధికార యంత్రాంగం ప్రశ్నపత్రాలు లీక్ కాలేదు, మాల్ప్రాక్టీస్ జరగలేదని ప్రకటించడం.. ఓ తంతుగా మారింది. వీరికి ప్రశ్నపత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? దీన్ని ఎలా నివారించాలనే విషయాలు పక్కనపెట్టి, ఎక్కడా ఏం జరగలేదని ఒక ప్రకటన చేస్తే సరిపోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోజూ ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వస్తుంటే ప్రతిభావంతులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందుతారన్నది అధికార యంత్రాంగానికి పట్టడం లేదు. ఇలాంటి పరీక్షలు నిర్వహించడం ఎందుకని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
బుధ, గురువారాల్లో తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత బయటకు వచ్చాయని, దీన్ని లీక్గా భావించలేమని అధికార యంత్రాంగం ప్రకటించింది. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లాలో ఆంగ్ల పరీక్ష మొదలైన 8 నిమిషాల్లోనే ప్రశ్నపత్రం వైకాపా నాయకుల వాట్సప్ గ్రూపులో ప్రత్యక్షమైంది. ఇది లీక్ కాదా? మాల్ప్రాక్టీస్కు దారితీయదా? అంటే సమాధానం లేదు. ప్రశ్నపత్రాలను తెరిచే సమయంలోనే సెల్ఫోన్లతో ఫొటోలు తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నిజమైతే పిల్లలకు చేరకముందే బయటకు వచ్చినట్లు కాదా? నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు ప్రచారం సాగింది. ఫొటోలో కనిపిస్తున్న ప్రశ్నపత్రం వెనుకనున్న స్థలం, పరీక్ష కేంద్రం గానీ, ఫొటోలో కనిపిస్తున్న చేతిమీద రాసి ఉన్న ఆషియా అనే పేరుతో పరీక్షా సిబ్బంది, విద్యార్థులు ఎవరూ లేరని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఒకరిద్దరు పోలీసులను పెట్టి ఇన్విజిలేటర్లు, డిపార్టుమెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ల ఫోన్లను ముందుగానే తీసుకుంటే ఇలా వాట్సప్ ద్వారా ప్రశ్నపత్రం బయటికి వచ్చే అవకాశమే ఉండదు. ప్రశ్నపత్రాలపై పిల్లలతో హాల్టికెట్లు నంబర్లు రాయిస్తే అవి ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించేందుకు వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.
సీబీఎస్ఈని చూసి నేర్చుకోలేమా?
రాష్ట్రంలో 30 వేల మందికిపైగా విద్యార్థులు సీబీఎస్ఈ పదోతరగతి సెమిస్టర్-2 పరీక్షలు రాస్తున్నారు. దాదాపుగా ఈ పరీక్షా కేంద్రాలన్నీ ప్రైవేట్ విద్యా సంస్థలవే. ఇన్విజిలేటర్లూ ప్రైవేటు ఉపాధ్యాయులే. కానీ ఎక్కడా లీకేజి లేకుండా పరీక్షలు జరుగుతున్నాయి. మరి ఇంత యంత్రాంగం, పోలీసు వ్యవస్థ ఉన్నా రాష్ట్ర బోర్డు ప్రశ్నపత్రాలు ముందే బయటకు వస్తున్నాయంటే కారణం సీరియస్నెస్ లేకపోవడమేనని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
ఫలితాల్లో లక్ష్యాలు..
పదో తరగతి పరీక్షల్లో అత్యధిక ఫలితాలు రావాలని కలెక్టర్లు లక్ష్యాలు విధిస్తున్నారు. తాను బోధించే సబ్జెక్టులో తక్కువ మంది పాసైతే చర్యలు తీసుకుంటారేమోనన్న ఆందోళన, రెండేళ్ల తర్వాత పరీక్షలు రాస్తున్నందున పిల్లలు ఎక్కడ ఫెయిలవుతారోనన్న భయం చాలామంది ఉపాధ్యాయుల్లో ఉన్నాయి. దీంతో అధిక ఉత్తీర్ణత కోసం కొన్నిచోట్ల మాస్కాపీయింగ్కు అన్ని స్థాయిల్లోనూ సహకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
పరీక్ష విధానాన్నే దారి తప్పించారు
లక్ష్యాల కోసం ప్రభుత్వం పరీక్ష విధానాన్నే దారి తప్పించింది. ఉత్తీర్ణతలో తమ జిల్లానే ముందుండాలి అనే యంత్రాంగాల అత్యుత్సాహమూ ఇందుకు కారణమే. పరీక్ష జరిగినన్ని రోజులు ఏదో రకంగా నడిపిస్తే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చారు.
- ఐ.వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ
సమ్మెటివ్ నుంచి ఇదే తంతు
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉమ్మడి ప్రశ్నపత్రంతో నిర్వహించే సమ్మెటివ్-1 పరీక్ష నుంచి ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నా చర్యలు తీసుకోకపోవడం ఈరోజు దాన్ని పదోతరగతి వరకూ తెచ్చింది. ఇటీవల కడప జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థి చిట్టీలు చూసి పరీక్ష రాస్తుండగా ఉపాధ్యాయుడు పట్టుకున్నారు. ప్రశ్నపత్రంలో ఉన్నవాటికి మాత్రమే చిట్టీలు ఎలా తీసుకువచ్చావంటే.. ముందురోజే యూట్యూబ్లో పేపర్లు వస్తున్నాయి కదా సర్! అని పిల్లవాడు అనడంతో విస్తుపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు