Andhra News: లీకేజీ దందా!
పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాల లీక్లను అధికార యంత్రాంగం అరికట్టలేకపోతోంది. మంత్రి, అధికారులు కఠిన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. పరీక్షల నిర్వహణ అపహాస్యంగా మారింది.
పదోతరగతి గణిత పరీక్షలోనూ బయటకు వచ్చిన ప్రశ్నపత్రాలు
వరుసగా నాలుగో పరీక్షలోనూ ఇదేతంతు
పలుచోట్ల ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్న వారిని పట్టుకున్న అధికారులు
ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాల లీక్లను అధికార యంత్రాంగం అరికట్టలేకపోతోంది. మంత్రి, అధికారులు కఠిన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. పరీక్షల నిర్వహణ అపహాస్యంగా మారింది. ఈ ఏడాది లీక్ల పరీక్షలుగా పది పరీక్షలు మిగిలిపోనున్నాయి. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ప్రశ్నపత్రాల లీక్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 27న ప్రారంభమైన తెలుగు పరీక్ష నుంచి సోమవారం గణితం వరకు ప్రశ్నపత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో వచ్చేశాయి. వీటి ఆధారంగా చిట్టీలతో సమాధానాలను కేంద్రాలకు చేరవేస్తున్నారు. దీంతో మాస్ కాపీయింగ్ పెరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగిన గణితం పరీక్షలోనూ మాస్ కాపీయింగ్ భారీగా కొనసాగింది. ఈ పరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో మొత్తం 44 మందిని అరెస్టు చేయగా.. ఇందులో సుమారు 30మందిని సస్పెండు చేశారు.
ఉత్తీర్ణత పెంచడానికేనా?
పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ప్రశ్నపత్రాలు బయటకు రావడం, కొన్ని పరీక్ష కేంద్రాల్లో భారీగా మాస్ కాపీయింగ్ జరగడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల నిఘా పెట్టి, సెల్ఫోన్లను ముందుగానే స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా.. దీన్ని సరిగా పాటించడం లేదు. వెలుగులోకి వస్తున్న ఘటనలు నామమాత్రమేనని, అన్ని కేంద్రాల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తే భారీ అక్రమాలు వెలుగుచూస్తాయని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగలేదు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకే ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల్లో వింత పరిస్థితి..
సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్లను తగ్గించాలని, మెడ తిప్పనివ్వకుండా కఠినంగా వ్యవహరిస్తున్న వారిని తొలగించాలంటూ కొందరు అభ్యర్థులు ఆందోళన చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. పరీక్షల్లో చిట్టీలు రాయించేందుకు డబ్బులు వసూలు చేశారని, ఇప్పుడు అది జరగకపోవడంతోనే అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారని ఓ అధికారి ఆ వీడియోలో పేర్కొన్నారు.
నిర్వాహకులే సమాధానాలు రాసేశారు..
ఏలూరు విద్యావిభాగం, న్యూస్టుడే: రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన పదోతరగతి గణితం పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం పలుచోట్ల లీకైంది. రంగంలోకి దిగిన విద్యా, పోలీసు శాఖల అధికారులు పలువురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు సహకరించిన కొందరు ఉపాధ్యాయులను సస్పెండు చేశారు. ఏలూరు సమీపంలోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో నిర్వాహకులే తెల్ల కాగితాలపై సమాధానాలను రాసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. సత్రంపాడులోని విద్యా వికాస్ ఉన్నత పాఠశాలలో (పది పరీక్ష కేంద్రం) మాస్ కాపీయింగ్ జరుగుతోందంటూ కొందరు డీఈవో కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనరు ఎల్.శ్రీకాంత్ ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యుడితో కలిసి విద్యావికాస్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహించాల్సిన సిబ్బంది రెండు కార్బన్ నకళ్లతో సమాధానాలు రాస్తుండటాన్ని గుర్తించారు. దీంతో సీఎస్, డీవో, ఇన్విజిలేటర్లను త్రీటౌన్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. డీవో, ఇన్విజిలేటర్ను విధుల నుంచి సస్పెండు చేస్తూ డీఈవో గంగాభవాని ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్పై క్రమశిక్షణ చర్యల కోసం ఆర్జేడీ మధుసూదనరావుకు సిఫార్సు చేశారు.
ఆంగ్ల ప్రశ్నపత్రం లీకేజీలో ఆరుగురి అరెస్టు
నందికొట్కూరు, న్యూస్టుడే: నంద్యాల జిల్లా నందికొట్కూరు బాలికల ఉన్నత పాఠశాల నుంచి గత నెల 29వ తేదీన పదో తరగతి ఆంగ్ల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు జరిపి ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నందికొట్కూరు పోలీస్స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆత్మకూరు డీఎస్పీ శ్రుతి ఆ వివరాలు తెలిపారు.
ప్రకాశం జిల్లా కొమరోలులో అరగంటకే బయటకు...
కొమరోలు గ్రామీణం, న్యూస్టుడే: పదో తరగతి గణిత పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం... సోమవారం పరీక్ష ప్రారంభమైన అరగంటకే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ప్రకాశం జిల్లా కొమరోలులో స్క్వాడ్లోని అధికారులే ఈ విషయాన్ని గుర్తించారు. ప్రశ్నపత్రం లీకేజీకి సహకరిస్తున్న 12 మంది ఇంటర్ విద్యార్థులను స్టేషన్కు తీసుకువెళ్లి పోలీసులు విచారిస్తున్నారు.
సి.ఎస్.పురంలో విధుల నుంచి తొలగింపు...
సి.ఎస్.పురం, న్యూస్టుడే: ప్రకాశం జిల్లా సి.ఎస్.పురంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, రత్నం జూనియర్ కళాశాల కేంద్రాలను పాఠశాల విద్య ఉప సంచాలకులు, పరీక్షల జిల్లా పరిశీలకురాలు పార్వతి సోమవారం తనిఖీ చేశారు. పరీక్ష గదుల వద్ద... ప్రశ్నపత్రం జవాబులు ఉన్న జిరాక్స్ కాగితాలను గుర్తించారు. ప్రశ్నల వరుస క్రమంలోనే జవాబులు ఉండడంతో... ప్రశ్నపత్రం బయటకు వెళ్లినట్లు అంచనాకు వచ్చారు. ఈ విషయమై ఆయా కేంద్రాల ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్మెంట్ అధికారులు, 16 మంది ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు.
ఆలూరులో పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
ఆలూరు గ్రామీణ, న్యూస్టుడే: కర్నూలు జిల్లా ఆలూరులో సోమవారం ఓ యువకుడి చరవాణిలోని వాట్సప్లో పదో తరగతి ప్రశ్నపత్రం కనిపించగా... పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నకలు చీటీలు అందించేందుకు వచ్చిన మరో యువకుడిని పోలీసులు పట్టుకోవడంతో ప్రశ్నపత్రం లీకేజీ విషయం బహిర్గతమైంది.
కృష్ణా జిల్లాలో ఏడుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
ఈనాడు, అమరావతి: పదోతరగతి గణితం ప్రశ్నపత్రం లీకేజీకి కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా నిలవడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసు, విద్యాశాఖల అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లీకేజీ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి ఆరుగురు ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేశారు.. మండవల్లి నుంచి పసుమర్రికి ప్రశ్నపత్రం వెళుతోందని నిర్ధారించినట్లు తెలిసింది. ఇక్కడ మరో స్కూల్ అసిస్టెంట్ను సస్పెండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ