Housing Expenses: ఇంటిఖర్చు ఇంతింత కాదయా
ఉప్పు.. పప్పు.. వంటనూనెలు.. కరెంటు బిల్లులు.. పెట్రోలు బాదుడు.. అబ్బో తలుచుకుంటేనే మధ్యతరగతి ప్రజలు వణికిపోతున్నారు. మూడేళ్ల నాటితో పోలిస్తే.. ఇంటి ఖర్చు సగటున నెలకు రూ.5,200కు పైగా పెరిగింది. అద్దె జీవులైతే ఏటా 5-10% పెంపుతో
నానాటికీ పెరుగుతున్న ధరల భారం
నూనెల రూపంలో నెలకు రూ.270కి పైగా ఖర్చు
టీపొడి, సబ్బు, పేస్టు.. అన్నీ బరువే
పెట్రోలు, వంటగ్యాస్పైనా భారీ బాదుడు
ఈనాడు - అమరావతి
ఉప్పు.. పప్పు.. వంటనూనెలు.. కరెంటు బిల్లులు.. పెట్రోలు బాదుడు.. అబ్బో తలుచుకుంటేనే మధ్యతరగతి ప్రజలు వణికిపోతున్నారు. మూడేళ్ల నాటితో పోలిస్తే.. ఇంటి ఖర్చు సగటున నెలకు రూ.5,200కు పైగా పెరిగింది. అద్దె జీవులైతే ఏటా 5-10% పెంపుతో అదనపు భారం తప్పదు. వంటనూనెల మంటలు అంతా ఇంతా కాదు. లీటరు రూ.60 లోపు ఉండే పామోలిన్ ధర గతేడాది రూ.120కి చేరగా.. ఇప్పుడు ఏకంగా రూ.165 దాటేస్తోంది. పొద్దుతిరుగుడు నూనెదీ అదే దారి. ఏడాది కిందట పచారీ దుకాణానికి ఇచ్చే సొమ్ముతో పోలిస్తే రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరుగుదల కనిపిస్తోంది. కరోనా ప్రభావంతో పట్టణాల్లో, పంటలు దెబ్బతిని గ్రామాల్లో ఉపాధి కరవైంది. అటు పనుల్లేక, ఇటు ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పుల ధరల్లో పెరుగుదల అధికంగా ఉంది. కరోనా సమయంలో ధరలు భారీగానే పెరిగినా.. తర్వాత కాస్త నెమ్మదించాయి. కొంతకాలంగా నిలకడగా సాగుతున్నాయి. ఈ ఏడాది కంది, సెనగల దిగుబడి తగ్గడంతో ఈ ప్రభావం ధరలపై పడొచ్చు. సగటున చూస్తే నెలకు కిలో చొప్పున కుటుంబంపై నెలకు రూ.65 చొప్పున భారం పెరిగింది. 5కిలోల గోధుమపిండి ప్యాకెట్ ధర 2019లో రూ.205 ఉండగా.. ప్రస్తుతం రూ.270 చొప్పున అమ్ముతున్నారు.
ఫోనే కాదు.. బిల్లూ మోగుతోంది
ఫోన్ బిల్లు మనకు తెలియకుండానే పెరిగిపోతోంది. గతంలో మూడు నెలలకు రూ.333 చొప్పున ఉండేది. అదే రీఛార్జి ఇప్పుడు రూ.666కి చేరింది. అంటే రెట్టింపైంది. దీనికి తోడు వై-ఫై రూపంలో రూ.500 వరకు తప్పదు. కేబుల్టీవీ ఖర్చు రూ.250 వరకు అదనం. ఒక్కో ఓటీటీ ఛానెల్కు సగటున రూ.500 చొప్పున నాలుగు తీసుకున్నా ఏడాదికి రూ.2వేలు. అంటే నెలకు రూ.166 చొప్పున ఖర్చవుతుంది. ఒక్కో కుటుంబంపైనా మొబైల్, కేబుల్ బిల్లుల రూపంలోనే రూ.600 వరకు అవుతున్నాయి. వై-ఫై, ఓటీటీ తీసుకున్న కుటుంబాలకు మొత్తంగా నెలకు రూ.1,000 చొప్పున తప్పట్లేదు.
బండి భారం నెలకు రూ.1,200 అధికం
చిరువ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులకు.. ద్విచక్ర వాహనం భారమైపోయింది. నెలకు సగటున 25 లీటర్ల పెట్రోలు లెక్కన చూసినా.. రూ.1,100 వరకు ఖర్చు పెరిగింది. 2019లో రూ.75లోపు ఉన్న పెట్రోలు ధర ప్రస్తుతం రూ.121 వరకు చేరింది. అంటే లీటరుకు రూ.45పైనే పెరిగింది. ఇంజిన్ ఆయిల్ ధర రూ.300 నుంచి రూ.500 వరకు చేరింది. సగటున రెండు నెలలకోసారి ఇంజిన్ ఆయిల్ మార్చినా.. నెల ఖర్చు రూ.100 చొప్పున పెరిగినట్లే. మొత్తంగా చూస్తే.. బండి భారం నెలకు రూ.1,200 పైనే పెరిగింది.
నూనెల మంటలతో.. మధ్యతరగతి వర్గాల జేబుకు చిల్లు
ఏడాది కిందటి నుంచి మండుతున్న వంటనూనెలు.. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో మరింత ఎగిశాయి. పామోలిన్ను పెద్దమొత్తంలో సరఫరా చేసే ఇండోనేషియా ఎగుమతులపై నిషేధం విధించడంతో.. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందనే ఆందోళన నెలకొంది. సగటున నెలకు మూడు లీటర్ల వంటనూనె వినియోగించే కుటుంబానికి మూడేళ్ల క్రితం రూ.270 మాత్రమే ఖర్చవగా.. ఇప్పుడు రూ.541 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. అంటే సగటున 100% పెరిగింది.
టీ తాగలేం
బ్రాండెడ్ టీపొడి ధర గతంలో కిలో రూ.540 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.780 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ఏకంగా 44% పెంచేశారు. అల్లం, యాలకలు, తులసి, అశ్వగంధ తదితర ఉత్పత్తులతో తయారయ్యే ఒక సంస్థ టీపొడి ధర 2019లో కిలో రూ.380 ఉండేది. ఇప్పుడు రూ.560కి చేరింది. అంటే 47% పెరిగింది.
* పాల ధరలూ పెరిగాయి. గతంలో లీటరు రూ.55 నుంచి రూ.58 మధ్యన ఉండేవి. ఇప్పుడు సగటున రూ.64 నుంచి రూ.68 వరకు చేరింది. అంటే లీటరుకు రూ.10 చొప్పున పెరిగింది. నెలకు 30 లీటర్లకు రూ.300 అదనంగా ఖర్చవుతోంది.
* సబ్బులు, దుస్తులు ఉతకడానికి వాడే డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలు 30% వరకు పెరిగినట్లు అంచనా. ఫేస్క్రీమ్, షాంపూ ధరలు రెట్టింపయ్యాయి.
* పాత్రలు కడిగే సబ్బు (700గ్రా) ధర మూడేళ్ల కిందట రూ.45 ఉంటే.. ఇప్పుడు రూ.68 అయింది. అంటే 51% పైగా పెరిగింది.
* టూత్పేస్ట్ (ఆయుర్వేదిక్ 200గ్రా) ధర 2019లో రూ.79 ఉంటే.. ఇప్పుడు రూ.96పైనే ఉంది. ఇదీ 31%పైనే ఎగసింది. షాంపూల ధరలు 40%పైనే పెరిగాయి.
62% పెరిగిన వంటగ్యాస్
2019 మధ్యలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.600 వరకు ఉంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.972 అయింది. అంటే మూడేళ్లలో 62% పెరిగింది. అప్పటితో పోలిస్తే రాయితీ కూడా తగ్గిపోయింది. రూ.15 చొప్పునే నామమాత్రంగా ఇస్తున్నారు. నెలకు ఒక సిలిండర్ లెక్కన చూస్తే.. ఒక్కో కుటుంబంపై రూ.372 చొప్పున భారం పడుతోంది.
30% మేర విద్యుత్తు బిల్లుల బాదుడు
పేద, మధ్యతరగతిపై కరెంటు బిల్లుల భారమూ అధికమైంది. గతంలో సగటున రూ.500 చొప్పున బిల్లు వచ్చే కుటుంబానికి ఇప్పుడు రూ.650 వరకు చేరింది. అంటే సగటున 30% వరకు పెరిగాయి. వీటి రూపంలో ఒక్కో కుటుంబానికి రూ.150 చొప్పున అదనపు ఖర్చు తప్పడం లేదు. ఏడాదికి రూ.1,800 వరకు ప్రభుత్వం బాదేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు