PM Modi: భారత్లో అవకాశాల్ని వదులుకోవద్దు
భారత దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు హరిత సాంకేతికతలు, శీతల గిడ్డంగులు, షిప్పింగ్, పోర్టులు, శుద్ధ ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయని
డెన్మార్క్ వ్యాపారవేత్తలతో మోదీ
హరిత సాంకేతికతలు, శుద్ధ ఇంధనం.. పోర్టుల రంగాల్లో కలిసి పనిచేద్దామని పిలుపు
సంప్రదింపులకు సిద్ధం కావాలని రష్యా, ఉక్రెయిన్లకు పిలుపు
కోపెన్హాగెన్: భారత దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు హరిత సాంకేతికతలు, శీతల గిడ్డంగులు, షిప్పింగ్, పోర్టులు, శుద్ధ ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. భారత్లో పెట్టుబడులు పెట్టకుంటే ఈ అవకాశాలను కోల్పోతారని డెన్మార్క్ వ్యాపారవేత్తలకు స్పష్టం చేశారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్కు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన ఇండియా-డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆధునిక మౌలిక వసతుల కల్పన కోసం తలపెట్టిన పీఎం-గతిశక్తి పథకం గురించీ వివరించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ‘చేజారుతుందనే భయం’(ఫియర్ ఆఫ్ మిసింగ్ అవుట్-ఎఫ్ఓఎంఓ) గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలోనూ భారత్, డెన్మార్క్లు వ్యాపార రంగంలో కలిసి పనిచేశాయని వివరించారు. భారత్లోని సరళతర వ్యాపార విధానాలు వాణిజ్య సంస్థలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. రెండు దేశాలకు చెందిన అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు హాజరయ్యారు. డానిష్ పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన మరో సమావేశంలో మోదీతో పాటు డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్, యువరాజు ఫెడెరిక్ పాల్గొన్నారు.
ఉక్రెయిన్లో కాల్పుల విరమణకు పిలుపు
భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్లో తక్షణం కాల్పుల విరమణను పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చర్చలు, దౌత్య మార్గాల్లోనే వివాదాలను పరిష్కరించుకోవాలని రష్యా, ఉక్రెయిన్లకు ఆయన సూచించారు. డెన్మార్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్తో ద్వైపాక్షిక సంప్రదింపుల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉక్రెయిన్పై దాడులను నిలిపివేసేలా రష్యాను భారత్ ఒప్పిస్తుందన్న ఆశాభావాన్ని ఫ్రెడెరిక్సన్ వ్యక్తం చేశారు. యుద్ధం నిలిపివేయాల్సిందిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ను కోరుతున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతుండడంపై భారత్,డెన్మార్క్లు ఆందోళన వ్యక్తం చేశాయి.
విమానాశ్రయంలో విశేష స్వాగతం
మంగళవారం బెర్లిన్ నుంచి కోపెన్హాగెన్కు చేరుకున్న భారత ప్రధాని మోదీకి డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలకడం విశేషం. అనంతరం తన అధికారిక నివాసం మ్యారియన్బోగ్లో ఆమె మోదీకి ఆతిథ్యమిచ్చారు. 18వ శతాబ్దానికి చెందిన మ్యారియన్బోగ్..ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన భవనం. చుట్టూ విశాలమైన పచ్చటి మైదానం, జలాశయాలు, దట్టమైన వృక్షాలతో ఆహ్లాదకరంగా ఉంది. ఇద్దరు నేతలు కొద్ది సమయంపాటు ఆ పరిసరాల్లో పర్యటించారు. భారత పర్యటనకు వచ్చినప్పడు ప్రధాని మోదీ బహూకరించిన రామ దర్బార్ పెయింటింగ్ను తన అధికారిక నివాసంలో ఫ్రెడెరిక్సన్ ప్రత్యేకంగా అమర్చుకున్నారు. గోడకు వేలాడుతున్న ఆ చిత్తరువును మోదీ గమనించారు. అనంతరం ఇద్దరు నేతలు ముఖాముఖీ చర్చలు జరిపారు. ఇరు దేశాల ప్రతినిధుల బృందాల సంప్రదింపుల్లోనూ వారు పాల్గొన్నారు. భారత్-డెన్మార్క్ హరిత వ్యూహ భాగస్వామ్యం పురోగతిని సమీక్షించారు. పునరుత్పాదక ఇంధనం, పవన విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, షిప్పింగ్, శుద్ధ ఇంధనం తదితర అంశాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల స్నేహ బంధం మరింత బలపడాలన్న ఆకాంక్ష వ్యక్తమయ్యింది.
పర్యావరణ అనుకూల జీవనశైలి
పర్యావరణానికి భారతీయులు కలిగిస్తున్న హాని చాలా స్వల్పమైనదని ప్రధాని మోదీ తెలిపారు. భూమాతకు నష్టం కలిగించడం మన సంస్కృతి కాదని పేర్కొన్నారు. పుడమి సహజ సిద్ధ వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు, 2070నాటికి ‘నెట్ జీరో’ ఉద్గారాల స్థాయిని చేరుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వస్తువులను ఒక్కసారి వాడి చెత్తలోకి విసిరేసే ధోరణికి స్వస్తి పలికి, పర్యావరణ అనుకూల జీవనశైలిని అలవరచుకోవాలని ఆయన హితవు పలికారు. డెన్మార్క్లో స్థిరపడ్డ భారతీయులు నిర్వహించిన సమావేశానికి మోదీ హాజరై ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి