SSC Exams: గురువులకే పరీక్ష!
పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు వారి సొంత పిల్లలో, బంధువుల పిల్లలో కారు. అయినా వారిని నూటికి నూరుశాతం ఉత్తీర్ణులు చేయించేందుకు కొందరు ఉపాధ్యాయులు ఎందుకు అతిగా తాపత్రయపడుతున్నారు? ప్రశ్నపత్రాల లీకేజీలు.. మాస్ కాపీయింగ్లకూ ఎందుకు తెగిస్తున్నారు? ఈ క్రమంలో అరెస్టులు, సస్పెన్షన్లకు ఎందుకు గురవుతున్నారు?
నూరుశాతం ఫలితాలు రావాలంటూ లక్ష్యాలు
విద్యార్థుల ప్రతిభ, బోధన పట్టని ఉన్నతాధికారులు
ఉత్తీర్ణత లేకపోతే ఉపాధ్యాయులపైనే బాధ్యత
పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్కు కారణాలివే..
52 మందిపై కేసులు.. 38 మంది సస్పెన్షన్
ఈనాడు - అమరావతి
పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు వారి సొంత పిల్లలో, బంధువుల పిల్లలో కారు. అయినా వారిని నూటికి నూరుశాతం ఉత్తీర్ణులు చేయించేందుకు కొందరు ఉపాధ్యాయులు ఎందుకు అతిగా తాపత్రయపడుతున్నారు? ప్రశ్నపత్రాల లీకేజీలు.. మాస్ కాపీయింగ్లకూ ఎందుకు తెగిస్తున్నారు? ఈ క్రమంలో అరెస్టులు, సస్పెన్షన్లకు ఎందుకు గురవుతున్నారు?
పదోతరగతి పరీక్షలు రాష్ట్రంలో ఈసారి ఎన్నడూ లేనంత గందరగోళంగా మారాయి. పరీక్ష జరిగిన ప్రతిరోజూ లీకేజీలు.. మాస్కాపీయింగ్లకు తెరలేస్తూనే ఉంది. ఈ అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకూ 52 మందిపై కేసులు నమోదు కాగా.. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వీరిలో 38 మంది ఉపాధ్యాయులే! వారందరిపైనా సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఏడాది పది పరీక్షలు విద్యార్థులకే కాదు.. ఉపాధ్యాయులకూ ఎందుకిలా విషమపరీక్షగా తయారయ్యాయి? తరగతి గదుల్లో బోధన, విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారనే అంశాలతో సంబంధం లేకుండా... ఉన్నతాధికారులు ఉత్తీర్ణత విషయంలో లక్ష్యాలు విధిస్తున్నారు. వాటి సాధనకు కొందరు ఉపాధ్యాయులు పక్కదోవ పడుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్ లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. చక్కగా పాఠాలు చెప్పి, విద్యార్థులను సిద్ధం చేయడం కంటే పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ చేయిస్తే సరిపోతుందనే భావన ప్రబలుతోంది. మరోవైపు.. బాగా చదివి మంచి ప్రతిభ చూపాలనుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ గందరగోళంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఎందుకంటే.. పదో తరగతి ఫలితాల ప్రాతిపదికనే ట్రిపుల్ ఐటీలలో సీట్లు వస్తాయి. ఇంటర్ ప్రవేశాల్లోనూ వీటికి ప్రాధాన్యం ఉంటుంది. తాము ఇంత కష్టపడి చదివినా.. నష్టపోతామేమోనన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.
సామర్థ్యాలు లేకపోయినా భారీ ఉత్తీర్ణత: అసలు పదోతరగతి విద్యార్థుల్లో ప్రతిభా పాటవాల సంగతి అటుంచి.. కనీస ప్రమాణాలకూ వారు దూరంగా ఉంటున్నారన్నది జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సర్వేల్లో తేలిన మాట. చాలామంది పదో తరగతి విద్యార్థులు ప్రాథమికాంశాలూ చెప్పలేకపోతున్నారని, తప్పులు లేకుండా తెలుగులోనూ రాయలేకపోతున్నారని ఎన్సీఈఆర్టీ గుర్తించింది. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే పదో తరగతిలో గణితం, సామాన్య శాస్త్రంలో విద్యార్థి సగటు పనితీరు 41% ఉంది. సాంఘిక శాస్త్రం, ఆంగ్లం, తెలుగులో 43%. కానీ, 2019లో పదో తరగతి పరీక్షల్లో మాత్రం ఏకంగా 95% ఉత్తీర్ణులయ్యారు. ఇది ఎలా సాధ్యం? మరోవైపు పదోతరగతిలో ఇంత భారీ ఉత్తీర్ణత ఉన్నా.. ఇంటర్కు వచ్చేసరికి అది 65%లోపే ఉంటోంది. దీన్నిబట్టి.. విషయ పరిజ్ఞానం లేకున్నా పరీక్షల్లో మాత్రం ఉత్తీర్ణులు అయిపోతున్న వాస్తవాన్ని, మన పరీక్షా నిర్వహణ తీరుతెన్నులను ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
సీసీ కెమెరాల ఏర్పాటుపై అశ్రద్ధ..: గుజరాత్లో గత కొన్నేళ్లుగా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఆడియో రికార్డింగ్ ఉంటోంది. ఫలితాలు వచ్చేముందు ఫుటేజీలను పరిశీలిస్తారు. ఇక్కడ 2016-18 నుంచి 2019-20 వరకు సగటు ఉత్తీర్ణత 67.56% మాత్రమే. అదే ఏపీలో 93.67%. 2017లో రాష్ట్రంలోని కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా అక్కడ ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది. అనంతపురం జిల్లా యెల్లనూరులో కెమెరాలు ఉన్న గదిలో ఉత్తీర్ణత 54.85% అయితే.. అవి లేని గదిలో 89.45%. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఆ తర్వాత అసలు సీసీ కెమెరాల ఏర్పాటు అంశాన్నే మూలకు పడేశారు. బిహార్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, అస్సాం లాంటి రాష్ట్రాలు సైతం పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో ఎందుకు వీటిని పట్టించుకోవడం లేదు? రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే ఖర్చయ్యేది రూ.30 కోట్లేనని అంచనా.
ప్రతిభ లేకుండా లక్ష్యాలా?: విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచి, నాణ్యమైన బోధనతో ఫలితాలు సాధించాల్సి ఉండగా.. ఇవేవీ పట్టించుకోకుండా ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పరీక్షల ముందు సమీక్షల్లో ఫలితాలు రాకపోతే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు, కలెక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో కొందరు ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్కు సహకరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కొందరు ఇన్విజిలేటర్లు విద్యార్థుల వద్దకు వెళ్లి.. ‘ఏం సమాధానాలు రాశావు? ఏమైనా కావాలా?’ అని అడుగుతున్నట్లు విద్యార్థులు వెల్లడిస్తున్నారు. ఆంగ్ల భాష పరీక్ష రోజున నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రశ్నపత్రం లీకేజీ, మాస్ కాపీయింగ్ జరగలేదని మంత్రి, అధికారులు ప్రకటించారు. కానీ, పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. దీన్నిబట్టే అధికారుల ప్రకటనల్లో డొల్లతనం బయటపడింది. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నా, ప్రైవేటు వ్యక్తులు వెళ్లే అవకాశం లేకపోయినా ప్రశ్నపత్రాలు బయటకు వచ్చేస్తున్నాయి.. వాట్సప్లో తిరుగుతున్నాయి. వాటికి బయటి నుంచి సమాధానాలు రాసి లోపలకు పంపేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో మాస్ కాపీయింగ్కు పిల్లల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు ఉన్నాయి.
పరీక్షల వ్యవస్థల్లో మార్పులు రావాలి
- షేక్ సాబ్జీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
‘పదోతరగతి ఫలితాలతో సంబంధం లేదు.. పరీక్షలు మాత్రం కఠినంగా నిర్వహించాలని అధికారులు అనడం లేదు. వందశాతం ఫలితాలు సాధించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది మాస్ కాపీయింగ్కు దారితీస్తోంది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడంతో బోధన తగ్గిపోతోంది. లక్ష్యం నిర్దేశించకుండా పరీక్షలు కఠినంగా నిర్వహిస్తే మాస్కాపీయింగ్ ఉండదు. కొన్నిచోట్ల ప్రైవేటు పాఠశాలలతో కుమ్మక్కు కావడంతోనూ ప్రశ్నపత్రాలు బయటకు వస్తున్నాయి. నీళ్లు, ఇతరత్రా పనులకు ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటుచేయడం మానేస్తే లీకేజీ, మాస్కాపీయింగ్ను నిరోధించవచ్చు.’
మోసపోతోంది తల్లిదండ్రులే
- గుంటుపల్లి శ్రీనివాసరావు, సామాజిక కార్యకర్త
‘గత కొంతకాలంగా మాస్ కాపీయింగ్, మూల్యాంకనంలో అధికంగా మార్కులు వేసే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో విద్యార్థుల స్థితిగతులేంటో తల్లిదండ్రులకు తెలియడం లేదు. వ్యవస్థీకృత మాస్ కాపీయింగ్ వల్ల మోసపోతోంది తల్లిదండ్రులు. నష్టపోతున్నది విద్యార్థులు, దేశ భవిష్యత్తు. మాస్ కాపీయింగ్ ఇలాగే కొనసాగితే మన దేశ పతనానికి దారితీస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలి. పరీక్షలు సజావుగా జరిగితే చెట్ల కింద పాఠాలు విన్నవారూ గొప్ప శాస్త్రవేత్తలయ్యారు.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ ఆలౌట్.. ముంబయి థ్రిల్లింగ్ విక్టరీ
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం