Chandrababu: రాజకీయ సైకోలను అణచివేస్తాం
‘జగన్మోహన్రెడ్డి ఊరికో సైకోను, గ్రామానికో రౌడీని తయారు చేశారు. వాళ్ల బారి నుంచి బయట పడాలంటే గ్రామస్థులంతా ఒక్కటి కావాలి.
జగన్రెడ్డిది ఐరన్లెగ్...
ప్రజా సమస్యలపై పోరాడండి
కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు
ఈనాడు డిజిటల్, ఈనాడు, విశాఖపట్నం, న్యూస్టుడే- వన్టౌన్: ‘జగన్మోహన్రెడ్డి ఊరికో సైకోను, గ్రామానికో రౌడీని తయారు చేశారు. వాళ్ల బారి నుంచి బయట పడాలంటే గ్రామస్థులంతా ఒక్కటి కావాలి. వారి నుంచి రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మన పార్టీకి ఆ శక్తిని ఇచ్చాడు. రాజకీయ సైకోలను పూర్తిగా అణచివేసి రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదే’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘జగన్రెడ్డి రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేశారు. ఇక్కడి సహజ వనరులు, తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని ఉంటే మనం చెప్పిన విజన్ ప్రకారం 2029కి భారతదేశంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో రాష్ట్రంలో నిలిచేది. మనం అభివృద్ధిపై ఆలోచిస్తే.. జగన్ విధ్వంసంతో ఏం చేయగలరో చేసి చూపించారు. 30 ఏళ్లలో ఎవరూ చేయని విధ్వంసం మూడేళ్లలో చేశారు. దేశంలో ఎక్కడా వేయని రీతిలో పన్నులు ఇక్కడ వేస్తున్నారు. జగన్రెడ్డిది ఐరన్లెగ్. రాష్ట్రానికి ఏదీ రాదు తమ్ముళ్లూ’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘కార్యకర్తలు, నేతలు కలిసి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లండి. కొంతమంది నా చుట్టూ తిరిగితే పదవులు వస్తాయని అనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడిన వారికే పదవులు. నా చుట్టూ తిరిగితే ఫొటోలే వస్తాయి’ అని చంద్రబాబు అనడంతో సమావేశ మందిరం నవ్వులతో నిండిపోయింది.
జనం గోడు ఆలకించిన చంద్రబాబు
‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా ప్రజల బాధలు తెలుసుకునేందుకు కొందరితో చంద్రబాబు మాట్లాడించారు. అగ్రిగోల్డ్ బాధితులు తమ సమస్య పరిష్కారం కాలేదని చెప్పగా.. తెదేపా హయాంలో దాన్ని ఒక కొలిక్కి తీసుకురాగా జగన్రెడ్డి దాన్ని తొక్కిపెట్టారని, ఇప్పుడా భూములను కాజేయాలని చూస్తున్నారన్నారు. వర్షం కురుస్తున్నా.. ప్రజలు అక్కడే ఉండి సభలో పాల్గొన్నారు.
బిల్లులు మంజూరు చేయలేదు
2016లో నాకు జలసిరి పథకం మంజూరైంది. ఆ బిల్లులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద చివరి దశలో నిర్మాణంలో ఉన్న ఇళ్లకూ బిల్లులు ఇవ్వలేదు.
- రామారావు, గొల్లలపాలెం
పింఛను తొలగించారు
నాకు తెదేపా హయాంలో దివ్యాంగుల పింఛను మంజూరైంది. వైకాపాకు ఓటు వేయలేదని ఇప్పుడు నా పింఛను తొలగించారు. నేను ఎవరి సాయం లేకుండా నడవలేను, ఏ పనీ చేసుకోలేను.
- అప్పలరాజు, లక్ష్మీపురం
నాలుగు లారీలే మిగిలాయి
గతంలో నాకు 8 లారీలు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు లారీలే మిగిలాయి. ఇష్టానుసారం వేసిన పన్నులతో వ్యాపారాలు సాగక ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో నాలుగు లారీలు తీసుకుపోయారు. నెలకు ప్రభుత్వానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పన్ను కట్టాలి. ఇలా కడితే నేను ఈఎంఐలు ఎలా చెల్లిస్తాను? కుటుంబాన్ని ఎలా పోషిస్తాను? లారీ ఇసుక ప్రస్తుతం రూ.70వేలు. తెదేపా హయాంలో రూ.16 వేలే అయ్యేది.
- తేజ, లారీ యజమాని, మద్దిలపేట
చంద్రబాబు వాహనశ్రేణి అడ్డగింత
విశాఖలో గురువారం తెదేపా అధినేత చంద్రబాబు వాహనశ్రేణి జాతీయ రహదారి నుంచి రుషికొండవైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రుషికొండ సమీపంలోని పర్యాటక ప్రాజెక్టు పనుల పరిశీలనకు చంద్రబాబు బయల్దేరారు. అయితే, ముందస్తు అనుమతి లేదన్న నెపంతో పోలీసులు ఎండాడ కూడలిలో వాహనాలను అడ్డుకున్నారు. దాంతో జాతీయ రహదారిపై కొన్ని కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. రుషికొండపై ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలోని హరిత రిసార్ట్స్ భవనాలను తొలగించి.. కొండపై తవ్వకాలు చేపడుతున్న ప్రదేశాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు వెళ్లాల్సి ఉంది. ఆయన వస్తారని తెదేపా నేతలంతా అక్కడకు చేరుకోగా వారందరినీ అదుపులోకి తీసుకుని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. చంద్రబాబు సైతం రుషికొండ వెళ్లకుండా, నేరుగా సమావేశ ప్రాంతమైన రాజుల తాళ్లవలసకు వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు
తలా రూ.500 నోటు. మగవారికి మద్యం సీసా. బిర్యానీ పొట్లం. ఊరూరా జనాన్ని తరలించేందుకు 1,200 బస్సులు. -
మండుతున్న ఆంధ్రప్రదేశ్.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ భానుడి ప్రతాపం మొదలైంది. -
త్రిమూర్తులే దగ్గరుండి గుండ్లు గీయించారు: శిరోముండనం బాధితుల ఆక్రందన
ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా అడ్డుకున్నామని పగబట్టి తమకు శిరోముండనం చేయించారని బాధితులు కోటి చినరాజు, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభిరామయ్య వాపోయారు. -
‘మట్టి మనవాళ్లు తరలిస్తే సక్రమమే..!’.. జనం ప్రశ్నించక ముందే జాగ్రత్తపడిన ముత్తంశెట్టి
ఎన్నికల ప్రచారానికి విశాఖ జిల్లా పద్మనాభం వచ్చిన వైకాపా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలకు మంగళవారం రాత్రి విచిత్ర పరిస్థితి ఎదురైంది. -
డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు
స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
సివిల్స్లో ర్యాంకు సాధించిన మాజీ కానిస్టేబుల్
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
వేకువనే పోలీసు పంజా
పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
జగన్ హయాంలో పెరిగిన శిరోముండనం ఘటనలు
జగన్ హయాంలో గతంలో ఎన్నడూ లేనన్ని శిరోముండనం ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. -
ఏపీఈఏపీ సెట్కు 3,54,235 దరఖాస్తులు
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగియగా.. మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
వెబ్సైట్లో పాలిసెట్ హాల్టికెట్లు
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024కు హాల్టికెట్లు బుధవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. -
కొయ్.. రాజా.. కొయ్!
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జగన్తోపాటు ఆయన అధికారుల బృందం వివిధ దేశాల్లో కాళ్లరిగేలా తిరిగిందట. -
క్షేత్రస్థాయికి ఎన్నికల నిఘా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసేందుకు పనిచేస్తున్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) సంస్థను క్షేత్రస్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
చర్మకారులకు ఏమిటీ ఖర్మ?
ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
-
పేదలకు ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
-
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
-
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
-
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్