Chandrababu: ప్రజల నెత్తిన గుదిబండ
జగన్మోహన్రెడ్డి బాదుడుకు కొండలే కరిగిపోతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘ఒక్క అవకాశమని ముద్దులు పెట్టి.. ఇప్పుడు ప్రజల నెత్తిన గుదిబండ మోపారు.
జగన్ బాదుడుకు కొండలే కరిగిపోతున్నాయి
ప్రశ్నపత్రాల లీకేజీలను ఆపలేని మంత్రులు ఎందుకు?
రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటుతున్నాయి
రాజుల తాళ్లవలస సభలో చంద్రబాబు మండిపాటు
ఈనాడు, విశాఖపట్నం: జగన్మోహన్రెడ్డి బాదుడుకు కొండలే కరిగిపోతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘ఒక్క అవకాశమని ముద్దులు పెట్టి.. ఇప్పుడు ప్రజల నెత్తిన గుదిబండ మోపారు. నాడు పాదయాత్ర చేస్తే జనం కరిగిపోయారు. అది చేసింది ఖనిజాలు, భూములు ఎక్కడున్నాయో చూడ్డానికని తెలుసుకోలేకపోయారు. విశాఖలోని రుషికొండకు ఎంతో చరిత్ర, గుర్తింపు ఉన్నాయి. భీమిలి- డాల్ఫిన్ కొండ మధ్య ఉన్న రుషికొండ జ్ఞాపకాన్ని ఇష్టారీతిన తవ్వకాలతో చెరిపేశారు. ఆయన కన్ను దేనిమీద పడితే అది గోవిందా. నేను రుషికొండకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికే కాదు.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తా.. నన్ను ఎవరూ అడ్డుకోలేరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు... విశాఖలోని పార్టీ కార్యాలయంలో విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నాయకులతో గురువారం ఉదయం సమీక్షించారు. నియోజకవర్గాల్లో పరిస్థితి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో నాయకులు ఎలా ముందుకెళ్లాలో మార్గనిర్దేశం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లోని నేతల్లో మార్పు రావాలని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. అనంతరం రోడ్డు మార్గాన భీమునిపట్నం మండలం రాజుల తాళ్లవలస గ్రామానికి చేరుకోగా స్థానిక ప్రజలు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. విద్యుత్తు కోతలకు నిరసనగా విసనకర్రలు పట్టుకొని నడిచారు. ముందుగా ఓ టీ దుకాణం వద్ద ఆగి, అక్కడున్న వారితో ముచ్చటించారు. అనంతరం గ్రామంలోకి నడుచుకుంటూ వెళ్లి ప్రజలకు అభివాదం చేస్తూ వైకాపా ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాల వివరాలు తెలిపే కరపత్రాలు పంచారు. అనంతరం ‘బాదుడే.. బాదుడు’పై సభలో మాట్లాడారు.
ప్రజల జీవితాలు తారుమారు
చంద్రబాబు సభను ప్రారంభిస్తూ.. జగన్రెడ్డికి వినపడేలా ‘బాదుడే.. బాదుడు’ అని గట్టిగా చెప్పాలని మూడుసార్లు అనిపించారు. ‘ప్రజల జీవితాలు తలకిందులయ్యాయా లేదా.. అయితే అందరూ చేతులు పైకి ఎత్తండి’ అని అడిగేసరికి.. అందరూ తాము బాధితులమేనన్నారు. ‘పోలీసులకూ బాదుడే. వారికి సరిగా జీతాలు రావు, సెలవులు లేవు. ప్రజలు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అభివృద్ధి చేయడం కష్టం. విధ్వంసం సులభం. ఇప్పుడదే ఈ రాష్ట్రంలో జరుగుతోంది. దీనిపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పోరాటం నా కోసమో.. తెదేపా కోసమో కాదు. ప్రజల కోసం. ఇంతటి దరిద్రపు సీఎంను ఎక్కడా చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. నూనె ధర ఎంత పెరిగిందో సభకు వచ్చిన మహిళలతో చెప్పించారు. పెంచిన ధరలను తగ్గించాలంటూ ప్రజలతో డిమాండు చేయించారు. రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నా కోపం, బాధ రావడం లేదా అని ప్రశ్నించారు. దేశంలో అత్యధిక పన్నుల భారం మోపిన రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని, మనకన్నా ఎక్కువ ధరలు ఎక్కడున్నా తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాలు విసిరారు.
జగన్ను నమ్మిన వారు జైలుకే..
‘జగన్రెడ్డిని నమ్మినవారు జైలుకే పోతున్నారు. వాళ్లకు ఏమోగానీ, నాకు సిగ్గనిపిస్తోంది. అఖిలభారత సర్వీసుల్లో ఉండి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన వ్యక్తులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులకు చెబుతున్నా. రేపు అనేది ఉంది. నేను ఐటీ, ఇంజినీరింగ్ ఉద్యోగాలు వచ్చేలా చేస్తే... ఇప్పుడు 5వేల జీతం వచ్చే వాలంటీరు ఉద్యోగాలిచ్చామని బ్రహ్మాండంగా చెబుతున్నారు. పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీలను నియంత్రించలేని మంత్రులు ఈ రాష్ట్రానికి అవసరమా? అయ్యా బొత్స గారూ.. దేనికి మీరు మంత్రి? ఏం చేయడానికి ఉన్నారు? ఇలాంటి మంత్రులు మనకు అవసరమా?’ అని ప్రజలను అడిగారు. ‘విశాఖను ఐటీ, ఫార్మా, పర్యాటక కేంద్రంగా మార్చుదామనుకుంటే ఏ1, ఏ2లు కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. వీళ్లేమో రాజధాని అని మభ్యపెడుతున్నారు. ప్రజలకు రాజధాని కావాలా? అభివృద్ధి కావాలా’ అని ప్రశ్నించారు.
వ్యవస్థలన్నీ పతనం
‘ఏయూలో వీసీగా ఉన్న వ్యక్తి... తప్పుడు పనులు చేయడం సరికాదు. వ్యవస్థలు పతనం అవుతున్నాయి. పరిస్థితులు తీవ్రతరం అనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పోస్టుమార్టంకు ఒక వైద్యుడు లంచం డిమాండు చేశారు. అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే లంచం, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో వెళ్లాలన్నా డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఎవరికీ బాధ అనిపించడం లేదా’ అని సభకు వచ్చినవారిని ప్రశ్నించారు. అనిపిస్తోందని వారంతా గట్టిగా సమాధానం ఇచ్చారు. అందుకు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రతి ఒక్కరూ మరో పదిమంది.. ఆ పదిమంది మరో వెయ్యిమందికి చెప్పి ప్రభుత్వం తీరును ఎండగట్టి చైతన్యం తీసుకురావాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి