CM Jagan: కుళ్లు.. కుతంత్రాలతో మాపై దుష్ప్రచారం
తాము విద్యా దీవెన పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిసి ప్రశ్నపత్రాల లీకేజీపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. నాడు చంద్రబాబు హయాంలో
ప్రశ్నపత్రాల లీకేజీ, అత్యాచారాలు వారి పనే
దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు
తిరుపతి సభలో ముఖ్యమంత్రి జగన్
‘విద్యా దీవెన’ కింద 709 కోట్ల జమ
ఈనాడు, తిరుపతి: తాము విద్యా దీవెన పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిసి ప్రశ్నపత్రాల లీకేజీపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. నాడు చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన వారి పాఠశాల నుంచే పేపర్లు లీక్ చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రెండు నారాయణ, మూడు చైతన్య పాఠశాలల ప్రమేయం ఇందులో ఉందని తెలిపారు. వాళ్ల పాఠశాలల్లో ప్రశ్నపత్రాలు లీక్ చేసి వ్యవస్థను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో నారాయణ మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. జగన్ విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నాడని, మంచి పేరు వస్తుందన్న కుళ్లు, కుతంత్రాలతో ఇలా చేస్తున్నారని విమర్శించారు. వాళ్లే నాశనం చేస్తారని, మళ్లీ వాళ్లే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ.. దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తిరుపతిలో గురువారం విద్యా దీవెన ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
తెదేపా నాయకులే చేశారు..
‘అత్యాచారాలు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా అతలాకుతలం అయినట్లు చెబుతున్నారు. మహిళల సంక్షేమం, ఆర్థిక, రాజకీయ సాధికారత, రక్షణ విషయంలో ఏ ప్రభుత్వం చేయనంత చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం.. అక్కాచెల్లెమ్మల మనసుల్లో జగన్ నిలిచిపోతాడేమోనని బురదజల్లేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. మహిళలపై నేరాలు జరగకుండా చూసేందుకు ఏ రాష్ట్రంలో లేని విధంగా దిశ యాప్ను తీసుకొచ్చాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరుగుతున్న సంఘటనలపై దోషులు ఎంతటివారైనా చట్టాన్ని ప్రయోగిస్తున్నాం. వైఫల్యం ఉంటే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడలో అత్యాచారం జరిగిందని యాగీ చేశారు.. గుంటూరులో ఏదో జరిగిందని, విశాఖలో ఏదేదో జరిగిపోతోందని మరో యాగీ. ఈ మూడు ఘటనల్లో అత్యాచారం చేసింది తెదేపా నాయకులే. వీళ్లే చేస్తారు.. వీళ్లే మళ్లీ ప్రత్యారోపణలు చేస్తుంటారు. ఏడుకొండల వాడిని మనం కోరగలిగింది.. రాష్ట్రాన్ని రక్షించాలి అని. సమాజ గతిని మార్చగలిగే గొప్ప విప్లవం చదువే. పేద విద్యార్థులు అనుభవిస్తున్న క్షోభను పాదయాత్ర సమయంలో చూశా. ఆ పరిస్థితుల నివారణ కోసమే మూడేళ్లుగా నూరుశాతం రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫీజులు 10.85 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లోకి రూ. 709 కోట్లు తిరుపతి వేదికగా వేస్తున్నా. జగనన్న విద్యా, వసతి దీవెన రెండు పథకాలకే రూ. 10,994 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలో పిల్లల చదువులకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చును ఒక పెట్టుబడిగా భావిస్తున్నా. మన పాలనలో కేవలం విద్యారంగంపై 35 నెలల్లో భారీగా వెచ్చించాం.
మేం నిలబెడుతున్నాం..
వారు గుడులు ధ్వంసం చేస్తే మేం కట్టాం. విగ్రహాలు విరిచేస్తే పెట్టించాం. రథాలను తగలబెడితే నిర్మించాం. రైతులను కుంగదీస్తే నిలబెడుతున్నాం. పిల్లలను, పల్లెలను దెబ్బతీస్తే ప్రతి పల్లెలోనూ సేవలను ప్రజల ముందుకు తెచ్చాం. గడప వద్దకే సుపరిపాలన తీసుకొచ్చి దేశానికే మార్గనిర్దేశం చేశాం. బడులను శిథిలావస్థకు తెస్తే వాటిని నిలబెడుతున్నాం. ఎన్ని ఆటంకాలు కలిగించినా ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చే పోరాటం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
చిన్న పిల్లల ఆసుపత్రికి శంకుస్థాపన.. క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎస్వీ విశ్వవిద్యాలయ మైదానంలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం అనంతరం అలిపిరి వద్ద తితిదే ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బర్డ్ ఆసుపత్రిలో గ్రహణమొర్రి, చెవుడు చికిత్సల కోసం ఏర్పాటు చేసిన వార్డులను ప్రారంభించారు. భక్తులు తిరుమల వెళ్లేందుకు శ్రీనివాస సేతు తొలి దశ పనుల్లో భాగంగా శ్రీనివాసం నుంచి వాసవి భవన్ వరకు పూర్తయిన వారధిని ప్రారంభించారు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనవ్యర్థాల నిర్వహణ ప్లాంటు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ (స్వీకార్) ఆసుపత్రిని ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని