Petrol Prices: నాడు విరుచుకుపడ్డారు.. ఇప్పుడేమంటారు?
నాలుగేళ్లలో పెట్రోలు, డీజిల్పై లీటరుకు ఆరేడు రూపాయలు చొప్పున పెంచడం ద్వారా చంద్రబాబు బాదుడే బాదుడు.. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల్లో మన రాష్ట్రం కంటే లీటరుకు రూ.7 తక్కువకే
పెట్రోలు, డీజిల్పై భారీగా పన్నుల బాదుడు
ధరల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్
కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని మించి రాష్ట్ర పన్నులు
ఏడాది రాబడి.. 2021-22 తొలి 9 నెలల్లోనే
రాష్ట్ర ఖజానాకు రూ.11వేల కోట్లు
ఈనాడు - అమరావతి
నాలుగేళ్లలో పెట్రోలు, డీజిల్పై లీటరుకు ఆరేడు రూపాయలు చొప్పున పెంచడం ద్వారా చంద్రబాబు బాదుడే బాదుడు.. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల్లో మన రాష్ట్రం కంటే లీటరుకు రూ.7 తక్కువకే దొరుకుతోంది. దేశంలో ఎక్కడా లేని రేట్లు ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తున్నాయి.
- నాడు ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన మాటలు
2019 మే నెలలో జగన్ సీఎం అయ్యే నాటికి తాడేపల్లిలో లీటరు పెట్రోలు ధర రూ.76.89 ఉండగా.. ఇప్పుడు రూ.120.95 అయింది. లీటరుపై రూ.44.08 (57.33%) పెరిగింది. అప్పట్లో రూ.71.50 చొప్పున ఉన్న డీజిల్ ధర ప్రస్తుతం రూ.106.58 అయింది. అంటే లీటరుకు రూ.35.10 (49.09%) పెరిగింది. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పెట్రోలు, డీజిల్ రేట్లపై బాదుడే బాదుడంటూ ప్రభుత్వంపై విరుచుకుపడిన జగన్.. తాను అధికారం చేపట్టాక వాటి ధరల్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలే లేవు సరికదా మరింత భారం వేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసే నాటికి పెట్రోలు, డీజిల్పై అదనపు వ్యాట్ లీటరుకు రూ.2 మాత్రమే ఉండగా.. దాన్ని రూ.4 చేశారు. రహదారి అభివృద్ధి నిధి పేరుతో లీటరుకు రూపాయి, దానిపై వ్యాట్ అదనమంటూ మరింత వడ్డించారు.
గతేడాది నవంబరులో కేంద్రం పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున తగ్గించింది. దీంతో అధిక శాతం రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారులపై ఇసుమంత కనికరం కూడా చూపలేదు. పైగా కేంద్ర చర్యలతో రాష్ట్ర ఆదాయం పడిపోతోందని ముఖ్యమంత్రి జగన్ విమర్శలకు దిగారు.
అప్పులపైనే ఆధారపడుతున్న రాష్ట్ర సర్కారు.. పెట్రో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని అంతకంతకూ పెంచుకుంటోంది. ప్రత్యక్ష పన్నుల బాదుడులో కేంద్రాన్ని మించిపోయింది. పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై పన్నుల ద్వారా 2020-21లో 12 నెలల్లో వచ్చిన రాబడిని.. 2021-22లో తొలి తొమ్మిది నెలల్లోనే రాబట్టింది. పన్నుల రూపంలో వినియోగదారుల్ని పిండేయడంలో 45% వృద్ధి నమోదు చేసింది. పెట్రోలు, డీజిల్పై వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు సుంకం, దానిపై వ్యాట్ రూపంలో రూ.10,920 కోట్లను వసూలు చేసింది. కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎంత ధర పెంచితే అందుకు అనుగుణంగా పన్ను రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతోంది.
పన్ను బాదుడు అధికమే
వ్యాట్తోపాటు అదనపు వ్యాట్, రహదారి సుంకం అంటూ అధిక మొత్తంలో బాదుతుండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ సుంకాన్ని మించి పన్నులు విధిస్తోంది.
* రాష్ట్ర విభజన తర్వాత తెదేపా ప్రభుత్వ హయాంలో 2015 ఫిబ్రవరి 5న పెట్రోలు, డీజిల్పై లీటరుకు రూ.4 చొప్పున అదనపు వ్యాట్ విధించారు. 2018లో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అదనపు వ్యాట్ను లీటరుకు రూ.4 నుంచి రూ.2కి తగ్గిస్తూ 2018 సెప్టెంబరులో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
* వైకాపా ప్రభుత్వం వచ్చాక మళ్లీ అదనపు వ్యాట్ను పెంచింది. లీటరు పెట్రోలుపై 31% వ్యాట్, రూ.4 అదనపు వ్యాట్, రూ.1 రోడ్డు అభివృద్ధి సుంకం (దీనిపై వ్యాట్ అదనం)గా పిండుతోంది. పొరుగునున్న కర్ణాటకలో 25.92% వ్యాట్ మాత్రమే ఉంది. తమిళనాడులో 13% వ్యాట్తోపాటు లీటరుకు రూ.11.52 చొప్పున అదనపు వ్యాట్ తీసుకుంటోంది.
* డీజిల్పై లీటరుకు ఆంధ్రప్రదేశ్లో 22.25% వ్యాట్, లీటరుకు రూ.4 అదనపు వ్యాట్, రోడ్డు అభివృద్ధి సుంకం రూ.1 (దీనిపై వ్యాట్ అదనం) చొప్పున పిండేస్తున్నారు. కర్ణాటకలో 14.34% వ్యాట్ మాత్రమే వసూలు చేస్తున్నారు. తమిళనాడులో 11% వ్యాట్తోపాటు లీటరుకు రూ.9.62 అదనపు వ్యాట్గా వసూలు చేస్తోంది.
కేంద్రాన్ని మించి బాదేస్తున్న రాష్ట్రం
లీటరు పెట్రోలు అమ్మకంపై ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రం రూ.27.90 వసూలు చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం అంతకు మించి అన్నట్లు రూ.31.30 వరకు పిండుకుంటోంది. డీజిల్పైనా కేంద్రం కంటే లీటరుకు ఎక్కువే దండుకుంటోంది. ఈ బాదుడులో గతంలో కేంద్రం ముందుండగా.. నవంబరు నుంచి ఒక అడుగు వెనక్కేసింది. ఇప్పుడు అందరికంటే నేనే ముందు అంటూ ఆంధ్రప్రదేశ్ ఇంధన వినియోగదారుల నడ్డి విరుస్తోంది.
ఏడాదికి రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం
పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగేకొద్దీ.. వాటిపై రాష్ట్ర పన్నుల ద్వారా ఆదాయమూ పెరుగుతుంది. అందుకే 2020-21లో రూ.11 వేల కోట్లకు పెరిగింది. 2021-22లో తొలి తొమ్మిది నెలల్లోనే ఏకంగా 10,920 కోట్లకు చేరింది.
* గతేడాది నవంబరులో చాలా రాష్ట్రాలు తమ వ్యాట్ను తగ్గించుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం పన్నుభారం తగ్గించకపోవడంతో వాటి కంటే ఆదాయం పెరగనుంది. రాష్ట్రానికి దీనిపై రూ.15 వేల కోట్ల వరకు రాబడి ఉంటుందని అంచనా.
ఎవరి బాదుడు వారిదే
పెట్రోలుపై పన్నుల బాదుడులో కేంద్ర, రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. పెట్రోలు, డీజిల్పై ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్రం.. వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు సుంకాల ద్వారా రాష్ట్రాలు వేసే భారమే అత్యధికంగా ఉంటుంది. ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచడం ద్వారా గతేడాది నవంబరు వరకు కేంద్ర ఖజానాకు కాసుల వర్షమే కురిసింది. గతేడాది నవంబరులో లీటరు పెట్రోలుపై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో.. దాని రాబడి స్వల్పంగా తగ్గింది.
మేమేమీ పెంచలేదంటూనే.. ఇంత బాదేశారే!
ఒకరేమో ధర ఇబ్బడిముబ్బడిగా పెంచి, అరకొరగా తగ్గించి, ధర్నాలు చేస్తున్నారని.. మరొకరు తమ హయాంలో ఎంత పెంచామనేది మరచి రాజకీయాలు చేస్తున్నారని ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటనలు ఇచ్చింది. గత ప్రభుత్వం విధించిన వాటి కంటే.. తమ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధి కోసం లీటరుకు రూపాయి మాత్రమే సుంకంగా విధించామని అందులో చెప్పింది. అవన్నీ అవాస్తవాలేనని, వివిధ రాష్ట్రాల్లో పన్నుల వివరాలపై కేంద్రం మార్చి 24న లోక్సభకు ఇచ్చిన సమాధానమే స్పష్టం చేస్తోంది. పెట్రోలు, డీజిల్నే కాదు, సహజవాయువునూ వదల్లేదని పన్నుల వివరాలు వెల్లడిస్తున్నాయి.
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ
పెట్రోలు, డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఉన్నాయని నాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక, తమిళనాడుల్లో ఏ రేట్లున్నాయో చూడమని పత్రాలు కూడా చూపించారు. ఇప్పుడు కూడా తమిళనాడు, కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ధరలకే పెట్రోలు, డీజిల్ లభిస్తోంది. అయినా జగన్ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మరిచినట్లున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు పొరుగు రాష్ట్రాల్లోని బంకుల నుంచి ఇంధనం తెచ్చుకునే పరిస్థితులున్నా బాదుడు నుంచి వెనక్కి తగ్గడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు
తలా రూ.500 నోటు. మగవారికి మద్యం సీసా. బిర్యానీ పొట్లం. ఊరూరా జనాన్ని తరలించేందుకు 1,200 బస్సులు. -
మండుతున్న ఆంధ్రప్రదేశ్.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ భానుడి ప్రతాపం మొదలైంది. -
త్రిమూర్తులే దగ్గరుండి గుండ్లు గీయించారు: శిరోముండనం బాధితుల ఆక్రందన
ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా అడ్డుకున్నామని పగబట్టి తమకు శిరోముండనం చేయించారని బాధితులు కోటి చినరాజు, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభిరామయ్య వాపోయారు. -
‘మట్టి మనవాళ్లు తరలిస్తే సక్రమమే..!’.. జనం ప్రశ్నించక ముందే జాగ్రత్తపడిన ముత్తంశెట్టి
ఎన్నికల ప్రచారానికి విశాఖ జిల్లా పద్మనాభం వచ్చిన వైకాపా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలకు మంగళవారం రాత్రి విచిత్ర పరిస్థితి ఎదురైంది. -
డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు
స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
సివిల్స్లో ర్యాంకు సాధించిన మాజీ కానిస్టేబుల్
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
వేకువనే పోలీసు పంజా
పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
జగన్ హయాంలో పెరిగిన శిరోముండనం ఘటనలు
జగన్ హయాంలో గతంలో ఎన్నడూ లేనన్ని శిరోముండనం ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. -
ఏపీఈఏపీ సెట్కు 3,54,235 దరఖాస్తులు
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగియగా.. మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
వెబ్సైట్లో పాలిసెట్ హాల్టికెట్లు
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024కు హాల్టికెట్లు బుధవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. -
కొయ్.. రాజా.. కొయ్!
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జగన్తోపాటు ఆయన అధికారుల బృందం వివిధ దేశాల్లో కాళ్లరిగేలా తిరిగిందట. -
క్షేత్రస్థాయికి ఎన్నికల నిఘా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసేందుకు పనిచేస్తున్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) సంస్థను క్షేత్రస్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
చర్మకారులకు ఏమిటీ ఖర్మ?
ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు.