Telangana News: ఉగ్ర కుట్ర!
తెలంగాణలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర భగ్నమైంది! పాకిస్థాన్ నుంచి డ్రోన్ ద్వారా అందిన ఆయుధాలను ఆదిలాబాద్కు చేరవేసే క్రమంలో- నలుగురు ముష్కరులు హరియాణాలో పోలీసులకు చిక్కారు. కర్నాల్ ప్రాంతంలో గురువారం
భగ్నం చేసిన హరియాణా పోలీసులు
ఆయుధాలను ఆదిలాబాద్కు తరలిస్తున్న నలుగురు ముష్కరుల పట్టివేత
భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం
పాకిస్థాన్ నుంచి డ్రోన్ ద్వారా మందుగుండు సామగ్రి సరఫరా...
చండీగఢ్: తెలంగాణలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర భగ్నమైంది! పాకిస్థాన్ నుంచి డ్రోన్ ద్వారా అందిన ఆయుధాలను ఆదిలాబాద్కు చేరవేసే క్రమంలో- నలుగురు ముష్కరులు హరియాణాలో పోలీసులకు చిక్కారు. కర్నాల్ ప్రాంతంలో గురువారం ఉదయం పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారు ప్రయాణిస్తున్న వాహనం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని విచారించడంతో నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను హరియాణా డీజీపీ పీకే అగర్వాల్, కర్నాల్ రేంజ్ ఐజీ సతేందర్కుమార్ గుప్తా, ఎస్పీ గంగారామ్ పునియాలు విలేకరులకు వెల్లడించారు. నిందితులను పంజాబ్కు చెందిన గుర్ప్రీత్, అమన్దీప్, పర్మిందర్, భూపిందర్లుగా గుర్తించినట్టు తెలిపారు.
ఇన్నోవాలో తరలిస్తూ...
పాకిస్థాన్కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది హరివిందర్సింగ్ రిండా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టడంలో సిద్ధహస్తుడు. పోలీసులకు చిక్కిన నలుగురు ముష్కరులు కొంతకాలంగా అతడితో సంప్రదింపులు జరుపుతున్నారు. రిండా వారికి డ్రోన్ ద్వారా పంజాబ్లోని ఫిరోజ్పుర్ పొలాల్లోకి ఆయుధాలను చేరవేశాడు. వాటిని ఎక్కడికు తీసుకువెళ్లాలో ఓ యాప్ ద్వారా లొకేషన్ను కూడా పంపాడు. ఆ ప్రకారం ముష్కరులు ఇన్నోవా వాహనంలో పేలుడు పదార్థాలను నాందేడ్ మీదుగా ఆదిలాబాద్కు తరలించేందుకు బయల్దేరగా... పోలీసులు వారిని బస్తారా టోల్ ప్లాజా సమీపంలో చాకచక్యంగా పట్టుకున్నారు. కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారంతో బాంబు నిర్వీర్య బృందం, ఫోరెన్సిక్ నిపుణులు అప్పటికే అక్కడ మోహరించారు. ముష్కరుల వాహనం నుంచి మూడు ఆర్డీఎక్స్ కంటైనర్లు, ఒక తుపాకీ, 31 రౌండ్ల లైవ్ క్యాటరిడ్జ్లతో పాటు రూ.1.30 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హరియాణా, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ముష్కరులకు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయి? పాకిస్థాన్ నుంచి డ్రోన్ ద్వారా ఆయుధాలు ఎలా చేరాయి? అన్న విషయాలను నిర్ధారించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఇప్పటివరకూ రాబట్టిన సమాచారం మేరకు వీరు ఖలిస్థానీ ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని... ఇందుకు ఆయుధాలను నిల్వ చేసేందుకు ఆదిలాబాద్ అనువుగా ఉంటుందని వారు భావించి ఉండొచ్చని చెబుతున్నారు.
జైలులో పరిచయమై...
ప్రధాన నిందితుడైన గుర్ప్రీత్సింగ్కు పాకిస్థాన్ ఉగ్రవాది హర్జీందర్సింగ్ రిండా అనుచరుడైన రాజ్బీర్ సింగ్తో గతంలో జైలులో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వారి మధ్య సంప్రదింపులు నడిచాయి. అనంతరం తెలంగాణలో విధ్వంసం సృష్టించేలా ఆదిలాబాద్కు ఆయుధాలు, పేలుడు సామగ్రిని చేరవేసేందుకు వారు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే- గుర్ప్రీత్సింగ్ తన సొంత ప్రాంతం ఫిరోజ్పుర్కు చెందిన అమన్దీప్, పర్మిందర్లతో పాటు... లుథియానాకు చెందిన భూపిందర్సింగ్తో కలిసి ఆదిలాబాద్కు ఆయుధాలను చేరవేసేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కాగా- నలుగురు ఉగ్రవాదులను కర్నాల్లోని కోర్టులో హాజరుపరచగా, పది రోజుల రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాది రిండా, అతని అనుచరుడు రాజ్బీర్లను కూడా నిందితులుగా పేర్కొన్నట్టు వెల్లడించారు.
లోతుగా దర్యాప్తు చేస్తున్నాం: సీఎం ఖట్టర్
ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేయడంపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ స్పందించారు. పేలుడు పదార్థాలు, ఆయుధాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాల కింద నిందితులను విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారాన్ని లోతుగా, సమగ్రంగా దర్యాప్తు చేస్తామన్నారు.
ఉలిక్కిపడ్డ ఆదిలాబాద్.. తెలంగాణా నిఘా అధికారుల రాక!
ఈటీవీ, ఆదిలాబాద్: హరియాణాలో ఉగ్రవాదులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పట్టుబడిన వ్యవహారంలో ఆదిలాబాద్ పేరు ప్రస్తావనకు రావడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ముష్కరులు ఇక్కడకు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు హరియాణా హోంమంత్రి వెల్లడించడం ప్రకంపనలు సృష్టించింది. జాతీయ దర్యాప్తు సంస్థ మూడురోజుల కిందటే ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమివ్వడంతో... వారు దీన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులతో పంచుకున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఆదిలాబాద్ జిల్లా ప్రశాంతంగా ఉంటుందని, ఇక్కడకు ఆయుధాలను తరలిస్తే అనుమానాలకు ఆస్కారం ఉండదనే కారణంతోనే దీన్ని అనువైన స్థావరంగా ఉగ్రవాదులు ఎంచుకొని ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు చెబుతున్నారు. ఇందుకు పలు కారణాలను పేర్కొంటున్నారు. 1) ఆదిలాబాద్ జిల్లా మీదుగా 44వ నంబరు జాతీయ రహదారి గుండా దిల్లీకి చేరుకోవచ్చు. 2) నిర్మల్ జిల్లా భైంసా గుండా నాందేడ్కు వెళ్లి, అక్కడి నుంచి దిల్లీకి వెళ్లొచ్చు. 3) మంచిర్యాల మీదుగా నేరుగా దిల్లీకి రైల్వే మార్గం ఉంది. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్డీఎక్స్తో పాటు ఆయుధాలను నిల్వచేసి ఉంచుకోవచ్చనే ఆలోచన ఉగ్రవాదులకు ఉండవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నతాధికారులంతా మంచిర్యాల, ఆదిలాబాద్, కాగజ్నగర్, నిర్మల్ ప్రాంతాలతో పాటు... దాబాల వద్ద ఇతరులెవరికీ అనుమానం రాకుండా కొత్త వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నారు. తెలంగాణా నిఘా విభాగం అధికారులు ఆదిలాబాద్ చేరుకుని, ఇక్కడ పరిస్థితులపై ఉన్నతాధికారులతో మంతనాలు సాగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
జాతీయ, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఆదిలాబాద్లో ఐఎస్ఐ కదలికలపై వేర్వేరుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. పాకిస్థాన్కు చెందిన ఖలిస్థాన్ ఉగ్రవాది హరివిందర్సింగ్ రిండాతో ఇక్కడి సంబంధాలపైనా ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు. కాగా- జిల్లాలో ఖలిస్థాన్, ఐఎస్ఐ కదలికలు... ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను ఇక్కడకు తరలించాలనుకోవడంపై తనకు సమాచారం లేదని ఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.